Chittoor

News April 26, 2024

పీలేరులో 30న సీఎం జగన్ ప్రచార సభ

image

పీలేరులో 30న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన కోరారు. ప్రచార సభను విజయవంతం చేయాలన్నారు.

News April 26, 2024

రేణిగుంట: గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

image

జిల్లాలో ఒక్క రోజు పర్యటనను ముగించుకున్న ఏపీ గవర్నర్ ఎస్.నజీర్ శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

News April 26, 2024

పెద్దిరెడ్డి నామినేషన్‌కు ఆమోదం

image

పుంగనూరు నియోజకవర్గం నుంచి MLA బరిలో నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం.. అన్ని అంశాలను పరిశీలించి ఆయన నామినేషన్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈయనతో పాటు కూటమి నుంచి బరిలో నిలిచిన చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా ఆమోదించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

News April 26, 2024

సోమల: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి 

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన సోమల మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సదుం మండలం కారేవాండ్ల పల్లెకు చెందిన ముని-వెంకట సిద్ధుల కుమారుడు భవిత్ కుమార్(15) మండలంలోని నడింపల్లిలో సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో నేడు ఈత కోసం గుంజు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 26, 2024

40 మందిని చంపేశారు: పవన్ కళ్యాణ్

image

రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాపాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం డాన్ గంగిరెడ్డితో మిథున్ రెడ్డి తిరుగుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డు వస్తున్నారని 40 మందిని చంపేశారు. మరికొందరి కాళ్లు, చేతులు నరికేశారు. ఆస్పత్రుల్లో ఇంజెక్షన్లతో చంపేస్తున్నారు. యువత ఎదురు తిరిగితే జగన్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..?’ అని పవన్ ప్రశ్నించారు.

News April 26, 2024

తిరుపతి ఎంపీగా పోటీ చేసిన నేత మృతి

image

టీడీపీ నేత కారుమంచి జయరాం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చనిపోయారు. పోలీసు శాఖలో పని చేసిన ఆయన రిటైర్‌మెంట్ తీసుకుని పొత్తులో భాగంగా 2014లో BJP తిరుపతి MP అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో YCP అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు TDPలో చేరారు. రేణిగుంట(M) అత్తూరులో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News April 26, 2024

CTR: టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీలకు రెబల్ పోటు తప్పేలా లేదు. తాజాగా పలమనేరులో TDP రెబల్‌గా దామోదర్ నాయుడు (బుల్లెట్ నాయుడు) నామినేషన్ వేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్నా.. తనకు ఎవరూ గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సత్యవేడులో టీడీపీ రెబల్‌గా జేడీ రాజశేఖర్, కుప్పంలో వైసీపీ రెబల్‌గా ఓ మాజీ సర్పంచ్ నామినేషన్ వేశారు.

News April 26, 2024

CTR: 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో పాలిసెట్-2024 పరీక్ష ఈనెల 27న నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ జేమ్స్, ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుప్పంలో 561 మంది, పలమనేరులో 1243 మంది విద్యార్థులు హాజరుకానుట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు.

News April 25, 2024

చంద్రబాబుకు సాదర వీడ్కోలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట, కోడూరు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. వాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

News April 25, 2024

CTR: రైలు ఢీకొని ముగ్గురి మృతి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు… రామసముద్రం మండలం పట్రాజుపల్లికి చెందిన లోకేశ్, గంజిగానిపల్లికి చెందిన సుబ్బు, శశికుమార్ బెంగుళూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు.