India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులు రెండు మూడు సెట్లతో పాటు డమ్మీలు వేస్తుంటారు. ఇలా తాజా ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 8 నామినేషన్లు పడ్డాయి. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2, ఆయన భార్య 2 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లెలో 2 సెట్లు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కుమారుడు మిథున్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ వేశారు.
తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానం, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడవరోజు శనివారం 20 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం సెలవు కావడంతో నామినేషన్ల స్వీకరణ లేదన్నారు. ఈనెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
మూడవరోజు శనివారం జిల్లాలో నామినేషన్ల దాఖలు వివరాలను అధికారులు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ వచ్చినట్టు చెప్పారు. నగిరి, పూతలపట్టు కు ఒక్కో నామినేషన్ వచ్చిందన్నారు. జీడి నెల్లూరుకు రెండు, పలమనేరుకు రెండు నామినేషన్లు వచ్చాయన్నారు. కుప్పం, పుంగనూరులో ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహణ తేదీలు మారాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 7వ తేదీ నుంచి 15 వరకు జరగాల్సి ఉంది. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంది. అదే సమయంలో జాతర నిర్వహిస్తే బందోబస్తు సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంతో 14వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు జాతర చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద రాయచోటి నుంచి పీలేరు వైపు కారు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు షౌకత్ ఆలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పీలేరు తరలించారు.
శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. మృతురాలి భర్తకు కాలు విరగడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను వారం రోజుల పాటు మార్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరను నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఇబ్బందులు లేకుండా అవిలాల జాతర ఆలస్యం కావడంతో మే 14 నుంచి 22వ తేదీకి మార్చారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇదే తొలిసారి ఇలా జరగడం.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమశ్రీ పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు సంవత్సరాల B.A, B.Edలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30.
పెన్షన్ డబ్బు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కర్రతో దాడిచేసి కాలు విరిచిన ఘటన శనివారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పత్తెపురానికి చెందిన వెంకటరమణమ్మ పెన్షన్ డబ్బు, కొడుకు లక్ష్మన్నకు ఇవ్వలేదని ఆగ్రహించాడు. ఇంట్లోని గొడ్డలి కట్టెతో తల్లి వెంకటరమణమ్మపై దాడి చేయడంతో ఆమె కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని మదనపల్లికి తరలించి, అక్కడి నుంచి రుయాకు తీసుకెళ్లారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో ప్రాజెక్టు అసోసియేట్ – 01 పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ (M.Sc) బయాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 02.
Sorry, no posts matched your criteria.