India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో తనపై విషప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈక్రమంలో పలు పత్రికలు, మీడియా సంస్థలకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. పరువు నష్టం కింద తనకు ఈనాడు, ఈటీవీ రూ.50 కోట్లు, మహా న్యూస్ రూ.50 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు రాసిన వారికి న్యాయపరంగా బుద్ధి చెప్తామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి రఘుచంద్ర గుప్తా కారులో ప్రయాణిస్తుండగా గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు టెంపోతో ఢీకొని హత్యా ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఈ విషయంపై విచారణ జరపాలని గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(M) VM పల్లి గ్రామానికి చెందిన పసల మహాలక్ష్మమ్మ, మోహన్రావుల కుమారుడు పొన్నారావు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(DSG)గా నియమితులయ్యారు. హైకోర్టులో కేంద్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు కేంద్రన్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నారావు మూడేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి DSGగా నియమితులవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

SC వర్గీకరణ తీర్పు కు వ్యతిరేకంగా ఈ నెల 21న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని రామసముద్రం మండలం మాలమహానాడు అధ్యక్షుడు టి. కృష్ణప్ప తెలిపారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు “యమాల సుదర్శన్, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివయ్య ఆదేశాల మేరకు బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్కు ప్రతి ఒక్క మాల జాతి, అనుబంధ సంఘాలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంతో ప్రారంభం కానున్నాయి.

తిరుమలలో నకిలీ రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లతో వెళ్తున్న వారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలో స్కానింగ్ చేసే దగ్గర కలర్ జిరాక్స్ టికెట్లను విజిలెన్స్ అధికారులు గమనించి పట్టుకున్నారు. అమృత్ యాదవ్ అనే ఓ నేరస్థుడు చెన్నైకి చెందిన మోహన్రాజును మోసం చేసి 4 టికెట్లకు రూ.11వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా యాదమరి వద్ద లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పెరియంబాడికి చెందిన సంపత్(34) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్ స్టాప్నకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోవడంతో సంపత్ తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతడి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. శ్రీ సిటీలో ఆయన పలు కంపెనీలకు భూమి పూజ, పలు కంపెనీల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు మినహా ఇతరులకు ప్రవేశం కల్పించలేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ సిటీలో స్వాగతం పలికారు.

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మంగళవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిక్సన్ కంపెనీ ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు https://rb.gy/6son88 గూగుల్ ఫాం లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి సూచించారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచంలోని నా బెస్ట్ బ్రదర్స్కి, రక్షా బంధన్ శుభాకాంక్షలు. నా కోసం ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ మాజీ సీఎం జగన్తోపాటు ఆమె అన్నలతో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.