India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఓ యువకుడు చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లె(M) రామనపల్లికి చెందిన జయప్ప కుమారుడు యాదగిరి(26) MBA చదివి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఇంటికి వచ్చాడు. నిన్న ఉదయం పశువులకు మేత వేసి ఇంట్లోకి వచ్చాడు. తల్లిదండ్రులతో ఒంట్లో బాగోలేదని కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు.
తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా గ్రీవెన్స్ త్రిసభ్య కమిటీ ద్వారా సామాన్య ప్రజల నుంచి సీజ్ చేసిన రూ.26.07 లక్షలను విడుదల చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియా నుంచి 223 ఫిర్యాదులు రాగా 213 పరిష్కరించామన్నారు. కంప్లైంట్ మానిటరింగ్ యాప్ ద్వారా 47 ఫిర్యాదులు రాగా అందులో 44 పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
భర్తను హత్య చేసి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న భార్యను అరెస్ట్ చేసి చిత్తూరు ఏడీజే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు SI వెంకట నరసింహులు తెలిపారు. 2018లో సోమల(M), ఆవులపల్లెకు చెందిన గోవిందప్ప(35)ను భార్య కుమారి, ప్రియుడు వెంకటరమణతో కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చింది. కుమారి రిమాండుకు వెళ్లివచ్చిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు.
డీఎస్సీ-2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసిన పీఈటీ అభ్యర్థుల వివరాలు డీఈవో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. జాబితాను పరిశీలించుకుని ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. గడువు తర్వాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించబడవని డీఈవో స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఈసారి బావ, మరదల మధ్య పోటీ జరగనుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసీపీ జీడీనెల్లూరు MLA అభ్యర్థిగా, ఆయన చెల్లెలు కుమారుడు రమేశ్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. బావ, మరదల పోటీలు ఎవరు గెలుస్తారో చూడాలి మరి. ఇదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా వీఎం.థామస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాలెంకు చెందిన ఇందు శేఖర్ (52) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పెద్దపంజాణి పీహెచ్సీలో వైద్య పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న ఆయన
బుధవారం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఛాతినొప్పితో కింద పడిపోయారు. స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య చంద్రకళ స్థానిక మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయిని.
SV యూనివర్సిటీలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అందినట్టు సమాచారం. దీంతో చర్యల కోసం ఎన్నికల కమిషన్ యూనివర్సిటీ అధికారులను ఆదేశించిన క్రమంలో అయ్యప్ప (డ్రైవర్), డాక్టర్ ఐఎస్ కిషోర్ మాథ్యూ అర్నాల్డ్ (అకడమిక్ కన్సల్టెంట్),మురళిరెడ్డి (రిజిస్ట్రార్ పీఎస్) లను సస్పెండ్ చేసినట్టు సమాచారం.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఓ మైనర్ బాలిక(17)పై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈనెల 7న బాలికపై గణేశ్ అత్యాచారం చేశాడు. మనస్తాపానికి గురైన బాలిక ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ తిరుపతి MP అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గెలుపు, ఓటమిలో హ్యాట్రిక్ కొట్టారు. ఆయన 1984లో టీడీపీ అభ్యర్థిగా, 1989, 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1996లో పోటీ చేయలేదు. 1999లో ఓడిపోయారు. 2004, 2009లో గెలిచారు. 2014, 2019, 2021లో హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్నారు. 2021 ఉప ఎన్నికల్లో 9585 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 11వ సారి పోటీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.