India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 MP సీట్లు ఉన్నాయి. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి(BJP), వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేశారు. చిత్తూరులో దగ్గుమళ్ల ప్రసాదరావు(TDP), రెడ్డప్ప(YCP) హోరాహోరీగా తలపడ్డారు. తిరుపతిలోనూ గురుమూర్తి(YCP), వరప్రసాద్(BJP) నువ్వానేనా అంటూ ప్రచారం చేశారు. రాజంపేట, తిరుపతిలో YCP కచ్చితంగా గెలుస్తుందని ఆరా సర్వే చెబుతోంది. చిత్తూరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

కుప్పంలో చంద్రబాబు విజయం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. తమ లక్ష్యమంతా లక్ష మెజార్టీనే అని అంటున్నారు. మరికొన్ని గంటల్లోనే కుప్పం ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు విజయం సాధిస్తే ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు.

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగిన గొడవలకు సంబంధించి 37 మంది టీడీపీ నాయకులుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 31 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆరుగురికి బెయిల్కు రాలేదు. 14న గొడవ జరిగితే 26న వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం తెలిసిందే.

ఈవీఎంలు భద్రపరచిన తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ హాలులో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని సూచించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ జరిగేలా అధికారులు పని చేయాలన్నారు.

తిరుపతి జిల్లా పుత్తూరు మాజీ MLA గంధమనేని శివయ్య సతీమణి పారిజాతమ్మ(84) ఆదివారం సాయంత్రం మృతిచెందారు. వృద్ధాప్య కారణాలతో పారిజాతమ్మ చెన్నైలోని తమ నివాసంలో కన్నుమూసినట్లు ఆమె కుమారుడు గౌతమ్ వెల్లడించారు. చెన్నైలోని కోడంబాకం ఎన్టీఆర్ స్ట్రీట్లో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. పిచ్చాటూరు(M) గోవర్ధనగిరికి చెందిన గంధమనేని శివయ్య 1972-77 మధ్య కాలంలో CPI తరఫున పుత్తూరు MLAగా గెలిచారు.

హనుమంతుడు ఆకాశగంగలోని అంజనాద్రిలో జన్మించినట్లు రాయలచెరువు శక్తి పీఠం అధిపతి మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమల నాదనీరాజనం, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేశారు. అంజనాదేవికి వాయుదేవుని కారణంగా తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపారన్నారు.

చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐపై వేటు పడింది. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో పోలింగ్ రోజున ఘర్షణలు జరిగాయి. ఎస్ఐ శ్రీనివాసరావు అలసత్వం కారణంగానే ఘర్షణ చెలరేగినట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్కు నివేదిక పంపారు. దీంతో ఎస్ఐ సస్పెండ్కు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి.

మతిస్థిమితం లేని యువతి(22) పై ముగ్గురు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 26న నగరి పట్టణానికి చెందిన యువతిని పక్కింటి యువకులు నమ్మకంగా మాటలు కలిపి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అప్పటి నుంచి బాధితురాలు నొప్పితో బాధపడుతుండగా.. నగరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువు ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటనారాయణ కేసు నమోదు చేశారు.

4న జరిగే ఎన్నికల కౌటింగ్కు సంబంధించి హాజరయ్యే పార్టీ ఏజెంట్లు ఎలా పడితే అలా కూర్చోవడం కుదరదని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా దేశ గుర్తింపు కలిగిన పార్టీ, రాష్ట్ర గుర్తింపు కలిగిన పార్టీ, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పార్టీలు, గుర్తింపు లేని పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కూర్చోవడంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో శనివారం కూడా జిల్లాలో మద్యం దుకాణాలు మూసేశారు.
Sorry, no posts matched your criteria.