India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మదనపల్లెలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మిస్తానని అన్నారని, మదనపల్లెలో నిర్మించాడా అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో పశుపతి లాగా.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.
SV యూనివర్సిటీ పరిధిలో గత
ఏడాది సెప్టెంబర్ నెలలో PG మొదటి సంవత్సరం ఏంఏ హిందీ, ఎంఏ ఫిలాసఫీ, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ అంత్రోపాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్లో చూడాలన్నారు.
తిరుపతి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ లక్ష్మీశాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు ఎస్పీ జాషువాను కూడా బదిలీ చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * తంబళ్లపల్లి- చంద్రశేఖర్ రెడ్డి * పీలేరు- సోమశేఖర్ రెడ్డి * మదనపల్లె-పవర్ కుమార్ రెడ్డి * పుంగనూరు- మురళీమోహన్ యాదవ్ * చంద్రగిరి- కనుపర్తి శ్రీనివాసులు * శ్రీకాళహస్తి- రాజేశ్ నాయుడు * సత్యవేడు (SC) – బాలగురువం బాబు * నగరి- పి రాకేశ్ రెడ్డి * చిత్తూరు- తికరామ్ * పలమనేరు- శివశంకర్ *
కుప్పం- ఆవుల గోవిందరాజులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికగా మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఏదేని డిగ్రీ, అడ్మినిస్ట్రేషన్ లో మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 07.
పుంగనూరు మండలం,ఈడిగపల్లి వద్ద సోమవారం రాత్రి ఆటో ఢీకొని బైకు నడుపుతున్న మదనపల్లె అరవాండ్లపల్లి పూల లక్ష్మి నరసింహ(36) అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం పాఠకులకు తెలిసిందే. కాగా చికిత్స పొందు తున్న ఇద్దరిలో మంగళవారం సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లికి చెందిన రమణ(45) మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పుంగనూరు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరింది.
18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జీ.లక్ష్మీశ సూచించారు. మార్చి 16వ తేదీ వరకు జిల్లాలో 17.94 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో కొత్తగా ఓట్లు పొందిన యువకులు 30,508 మంది ఉన్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో బుధవారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ రజినీ ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 30 వరకు తరగతులు ఉంటాయని, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.
బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈశ్వర్ (33) అదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరుతో గత నెల 19న అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదు చేశామని చెప్పారు. విచారణలో బాలికపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిసిందన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లెలో పర్యటించనున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజంపేట MP మిథున్ రెడ్డి, మదనపల్లె అసెంబ్లీ వైసీపీ MLA అభ్యర్థి నిస్సార్ అహ్మద్ లతో కలిసి పలువురు YCP నాయకులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు
Sorry, no posts matched your criteria.