India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. విశాఖ జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో కిమ్స్లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్ ఫ్లైట్లో రేణిగుంటకు తరలించారు.
1911, ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నేటితో 113 ఏళ్లు పూర్తి అయింది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో కాణిపాకం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జిల్లాలు విడిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఇద్దరు మాజీ సీఎంలు, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న పట్టించుకోలేదు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఖండించారు. తిరుమల స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎన్నడూ ధర్మారెడ్డి తమ పీఠానికి రాలేదని చెప్పారు. అహోబిలం పీఠాధిపతి శ్రీశైలం గుహల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించారనే ఆరోపణలతో అప్పట్లో ఓ వీడియో వైరల్ అయ్యింది.
తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. చంద్రగిరి నియోజకర్గం రామచంద్రపురం మండలం కొత్త వేపకుప్పం గ్రామానికి చెందిన మణి కుమారుడు బాలు గుండెపోటుతో చనిపోయాడు. విద్యార్థి నిన్న రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తిరుపతిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమలో చనిపోయాడు.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ కానిస్టేబుల్ను తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్ పటేల్ సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం(M) కొల్లాగుంటలోని ఓ మామిడి తోటలో పేకాట ఆడారు. పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పూర్ణచంద్రరావు ఉన్నారు. జూదాన్ని అడ్డుకోవాల్సిన పోలీసే ఇలా చేయడంతో SP సీరియస్ అయ్యారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తిరుపతి IISERలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఇతర వివరాలకు www.iiseradmissiఓn.in వెబ్సైట్ చూడాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 13.
ఓటరు గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్తూరు కలెక్టర్ ఎస్.షన్మోహన్ కోరారు. ఎపిక్ కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా ఫోటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆధార్ కార్డ్, ఉపాధి హామీ కార్డ్, బ్యాంక్/ పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్లు లాంటి 12 రకాల కార్డులు చూపించి ఓటు వేయవచ్చని సూచించారు.
ప్రస్తుత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలపై అందరి దృష్టి నెలకొంది. YCPలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. తరచూ కుప్పంలో పర్యటిస్తూ బాబుకు సవాల్ విసురుతున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ కావడంతో పెద్దిరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.
కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు చెరువులో దిగిన ఓ గిరిజన వివాహిత నీట మునిగి మృతి చెందింది. ఈ ఘటన వరదయ్యపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పవన్, నాగరాణి దంపతులు శుక్రవారం సాయంత్రం కాలనీ సమీపంలోని చెరువులో సరదాగా ఈత కోసం దిగారు. భర్త పవన్ చెరువు ఒడ్డున దుస్తులు ఆరబెడుతుండగా.. ఈత రాకపోవడంతో నాగరాణి(40) నీట మునిగి శవమై తేలింది. వీరికి నలుగురు సంతానం. ఘటన పై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.