India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్వేటినగరం మండలంలోని భట్టువారిపల్లిలో జూదం ఆడుతున్న 9మంది నిందితులను అరెస్ట్ చేశామని, వీరిలో తిరుపతి నగరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఉన్నాడని సీఐ సత్యబాబు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పుత్తూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో శిక్షణ డీఎస్పీ పావన్ కుమార్, ఎస్సై వెంకటకృష్ణ, ఏఎస్సై మునికృష్ణ పాల్గొన్నారు.
మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ప్రశ్నించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మదనపల్లె పట్టణంలోని సీటీఎం రోడ్డులో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీ నగర్లో ఉంటున్న షేక్ మస్తాన్ కుటుంబంలోని మహిళలతో అదే వీధిలో ఉండే ఇర్షాద్ అసభ్యకర పదజాలంతో మాట్లాడాడు. దీంతో అతడిని మస్తాన్ నిలదీశాడు. ఆగ్రహించిన ఇర్షద్ మస్తాన్పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు చిత్తూరు డీఈవో దేవరాజు తెలిపారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి 12 వరకు ప్రవేశ పరీక్ష అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు ఎస్పీ జాషువా కోరారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
రాజంపేట MP అభ్యర్థిగా మరోసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014, 19లో గెలిచిన ఆయన హ్యాట్రిక్పై కన్నేశారు. 2014లో ఆయన ప్రత్యర్థిగా మాజీ CM ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి పోటీ చేశారు. 2019లో TTD మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ TDP తరఫున బరిలో నిలిచారు. తాజా ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా గెలుపు ఎవరిదో చూడాలి.
#Elections2024
చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పదో తరగతి మూల్యాంకనం జరుగుతుందని డీఈవో దేవరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ను నియమించామని చెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పీసీఆర్ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మదనపల్లికి ఏప్రిల్ 2న సీఎం జగన్ రానున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి ‘మేము సిద్ధం ‘బహిరంగ సభకోసం టిప్పు సుల్తాన్ మైదానం శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ మహమ్మద్, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, షమీం అస్లాం తదితరులు ఉన్నారు.
కుప్పం పట్టణంలోని డాక్టర్ వైసీ జేమ్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ( PolyCET) – 2024 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథం పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.
తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరు: యువ ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. 2019లో 85.02% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. 2024లో వంద శాతం నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.