Chittoor

News April 2, 2024

ఏర్పేడు : మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికగా మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఏదేని డిగ్రీ, అడ్మినిస్ట్రేషన్ లో మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 07.

News April 2, 2024

రెండుకు చేరిన పుంగనూరు రోడ్డు ప్రమాద మృతులు

image

పుంగనూరు మండలం,ఈడిగపల్లి వద్ద సోమవారం రాత్రి ఆటో ఢీకొని బైకు నడుపుతున్న మదనపల్లె అరవాండ్లపల్లి పూల లక్ష్మి నరసింహ(36) అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం పాఠకులకు తెలిసిందే. కాగా చికిత్స పొందు తున్న ఇద్దరిలో మంగళవారం సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లికి చెందిన రమణ(45) మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పుంగనూరు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరింది.

News April 2, 2024

తిరుపతి: ఓటు నమోదుకు 14 వరకు అవకాశం

image

18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జీ.లక్ష్మీశ సూచించారు. మార్చి 16వ తేదీ వరకు జిల్లాలో 17.94 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో కొత్తగా ఓట్లు పొందిన యువకులు 30,508 మంది ఉన్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News April 2, 2024

తిరుపతి: SPMVVలో రేపటి నుంచి ఒంటిపూట తరగతులు

image

శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో బుధవారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ రజినీ ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 30 వరకు తరగతులు ఉంటాయని, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.

News April 2, 2024

బైరెడ్డిపల్లి: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈశ్వర్ (33) అదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరుతో గత నెల 19న అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదు చేశామని చెప్పారు. విచారణలో బాలికపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిసిందన్నారు.

News April 2, 2024

మదనపల్లెలో సీఎం బహిరంగ సభ

image

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లెలో పర్యటించనున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజంపేట MP మిథున్ రెడ్డి, మదనపల్లె అసెంబ్లీ వైసీపీ MLA అభ్యర్థి నిస్సార్ అహ్మద్ లతో కలిసి పలువురు YCP నాయకులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు

News April 2, 2024

తిరుపతి: వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేయండి

image

వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

News April 1, 2024

విశాఖ నుంచి తిరుపతికి అవయవాల తరలింపు

image

విశాఖలో ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. విశాఖ జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్‌ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.

News April 1, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 113 ఏళ్లు

image

1911, ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నేటితో 113 ఏళ్లు పూర్తి అయింది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో కాణిపాకం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జిల్లాలు విడిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఇద్దరు మాజీ సీఎంలు, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న పట్టించుకోలేదు.

News April 1, 2024

ధర్మారెడ్డి అహోబిలానికి రాలేదు: పీఠాధిపతి

image

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఖండించారు. తిరుమల స్వామివారిని సోమవారం ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎన్నడూ ధర్మారెడ్డి తమ పీఠానికి రాలేదని చెప్పారు. అహోబిలం పీఠాధిపతి శ్రీశైలం గుహల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించారనే ఆరోపణలతో అప్పట్లో ఓ వీడియో వైరల్ అయ్యింది.