Chittoor

News March 27, 2024

చేనేతలకు 500 యూనిట్ల కరెంట్ ఫ్రీ: CBN

image

పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News March 27, 2024

చంద్రబాబు భయపడ్డాడు: చిత్తూరు ఎంపీ

image

చంద్రబాబు కుప్పం పర్యటనపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పందించారు. ‘భయం అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు కుప్పంలో ఒక్కరోజూ ప్రచారం చేయకుండా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతున్నాడు. కారణం కుప్పంలో జగన్ గారు చేసిన అభివృద్ధి. కుప్పం ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు అనే నిజానికి చంద్రబాబు భయపడ్డాడు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 27, 2024

చిత్తూరు: 10th పరీక్షలు రాయడానికి వెళ్తూ విద్యార్థి మృతి

image

తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రమణ కొడుకు పి.చరణ్(16)ను పది పరీక్షలు రాయడానికి బైక్‌పై తీసుకెళ్తుండగా మరో బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

ఏర్పేడు: లైంగిక వేధింపులు.. బెదిరింపులు

image

ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. CI. శ్రీరామశ్రీనివాస్ కథనం మేరకు.. మండలంలోని వికృతమాలకు చెందిన ఓ కుటుంబం నుంచి పుత్తూరు మండలంలోని వేణుగోపాలపురానికి చెందిన సురేంద్ర కొంతకాలం కిందట నగదు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించాలని మహిళ అడిగినందుకు ఇంట్లో భర్త లేని సమయంలో అశ్లీల చిత్రాలను చూపించి లైంగికంగా వేధిస్తున్నాడన్నారు.

News March 27, 2024

చౌడేపల్లి: రామచంద్ర యాదవ్‌పై కేసు నమోదు

image

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఐదుగురు అనుచరులపై ఎన్నికల కోడు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పలమనేరు రోడ్డులో బస్టాండ్ ప్రాంతంలో సమావేశానికి అనుమతి తీసుకుని.. ప్రైవేటు బస్టాండ్‌లో సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘించారని ఆయన చెప్పారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు.

News March 27, 2024

తిరుపతి: TTDలో 78 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని డిగ్రీ/ ఓరియంటల్, జూనియర్ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికగా లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగుస్తుంది. డిగ్రీ లెక్చరర్స్ -49, జూనియర్ లెక్చరర్స్-29 మొత్తం …78 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 27.

News March 27, 2024

చిత్తూరు: తండ్రి మరణాన్ని దిగమింగి.. పరీక్ష రాసిన విద్యార్థి

image

తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన ఘటన ఐరాల మండలంలో జరిగింది. నాగంవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన చలపతి కుమారుడు సంతోశ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుుతున్నాడు. అనారోగ్యంతో చలపతి మంగళవారం మృతి చెందాడు. ఒకపక్క తండ్రి మరణం.. మరోపక్క పరీక్ష. తండ్రి మరణాన్ని దిగమింగి ఉదయం జరిగిన జీవశాస్త్ర పరీక్షను రాసి అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

News March 27, 2024

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఇలా

image

ప్రజాగళం పేరుతో మాజీ సీఎం, TDP అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కుప్పం నుండి బయలుదేరి 9:30 గంటలకు పలమనేరు చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకు పుత్తూరుకి, సాయంత్రం 4:30 గంటలకు మదనపల్లె బెంగళూరు బస్ స్టాండు వద్దకు చేరుకుంటారు. విందులో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

News March 27, 2024

చిత్తూరు: 14 మంది వాలంటీర్లు రాజీనామా

image

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కంబార్లపల్లి పంచాయతీ పరిధిలోని 14 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీవోకు రాజీనామా పత్రాలు సమర్పించారు. తాము రానున్న ఎన్నికల్లో వైసీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడ విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. సీఎం జగన్ చొరవతో లబ్ధిదారులకు గత ఐదేళ్లుగా సేవలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు.

News March 27, 2024

భ‌క్తుల‌కు అందుబాటులో పంచాంగం

image

శ్రీక్రోధినామ సంవత్సర పంచాంగాన్ని మంగ‌ళ‌వారం నుంచి టీటీడీ భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది. ఏటా లాగానే నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని టీటీడీ ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వ‌ర‌లో టీటీడీ అందుబాటులోనికి తీసుకు రానుంది.

error: Content is protected !!