Chittoor

News March 23, 2024

తిరుపతి ఐఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఎంటెక్(M.Tech), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ(MPP) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 19.

News March 23, 2024

పులివర్తి నాని కారుకు ప్రమాదం

image

చంద్రబాబు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు వద్ద కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులివర్తి నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

News March 23, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజుల బస్సు యాత్ర: పెద్దిరెడ్డి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రి నివాసంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమావేశం అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 2న పీలేరు, 3న చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర, నాయకులతో సమావేశం, 4న తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర.. శ్రీకాళహస్తి లేదా నాయుడుపేటలో నాయకులతో సమావేశం జరుగుతుందన్నారు.

News March 23, 2024

25న కుప్పంలో చంద్రబాబు భారీ బహిరంగ సభ

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25న సోమవారం జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో పీఈఏస్ వైద్య కళాశాలకు ఆయన చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

News March 23, 2024

సుధీర్ రెడ్డిపై అసమ్మతి సెగ చల్లారేనా.?

image

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పలువురు నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆ మరుసటి రోజు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఎస్సీవీ నాయుడు సైతం తాను సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కూటమి సహకారం లేకుండా విజయావకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

News March 23, 2024

ఏర్పేడు: వాలంటీర్ల తొలగింపు.. కండక్టర్‌పై విచారణ

image

మండలంలోని పెనుమల్లం, రావిళ్లవారి కండ్రిగకు చెందిన ఇద్దరు వాలంటీర్లను శుక్రవారం విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు లత, గీత, ఆర్టీసీ కండక్టర్ మురళి పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వాలంటీర్లను తొలగించడంతో పాటు మురళిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

News March 23, 2024

MCMC అనుమతి తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారానికి మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ అన్నారు. మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచారం నిబంధనలకు లోబడి ఉందా లేదా అని పరిశీలించి ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను వరుస క్రమం ప్రకారం అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

News March 22, 2024

చిత్తూరు: ఆ 4 చోట్ల మహిళలు గెలవలేదు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.

News March 22, 2024

కుప్పం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి 

image

కుప్పం మండలం బురడ సిద్దనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మురుగేష్ కుమారుడు రాజశేఖర్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మద్యాహ్నం మేకలకు మేత కోసం వెళ్లినప్పుడు పొలం వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పొరపాటున తగిలి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

News March 22, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో వ్యవసాయ కోర్సులు

image

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.