India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.
టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును ప్రకటించారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన తొలిసారి ఎంపీ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ కేటాయించినట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 10 చోట్ల 2019లో తలపడిన వారు ఇప్పుడు పోటీలో లేరు. నగరిలో గాలి భాను ప్రకాశ్, రోజా.. శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి, బొజ్జల సుధీర్, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, నల్లారి కిశోర్ రెడ్డి, పలమనేరులో వెంకటే గౌడ, అమర్నాథ్ రెడ్డి మాత్రమే మరోసారి పరస్పరం పోటీ పడనున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని పోటీలో ఉన్నా.. అక్కడి YCP అభ్యర్థి మారారు.
ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి పక్కాగా ఎన్నికల నిర్వహణ చేయాలని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలలో పలు కొత్త అంశాలు, సూచనలు ఉన్నాయని, పూర్తిగా పీ.ఓ హ్యాండ్ బుక్ చదివి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు.
బైరెడ్డిపల్లి పోలీసులను ఓ ప్రేమజంట గురువారం ఆశ్రయించారు. రామసముద్రంకు చెందిన యువకుడు, తీర్థం గ్రామానికి చెందిన యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమికుల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు.
బైక్ డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తవణంపల్లిలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. చిత్తూరులోని కట్టమంచి కంది కాలమ్మ గుడి వీధికి చెందిన రామన్ (60) బైక్పై వెళ్తుండగా కె. పట్నం ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి డివైడర్కు ఢీకొని తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అతని భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
తిరుమల శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25న జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థంలోకి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. మరుసటి రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 24, 25న రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.