Chittoor

News June 29, 2024

పేర్లు తొలగింపుపై చెవిరెడ్డి ఆగ్రహం

image

జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు దిగడం హేయమని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని సచివాలయాలను ఆయన శనివారం సందర్శించారు. క్షక సాధింపు చర్యలో భాగంగానే సచివాలయాలపై ఉన్న జగన్ ఫొటోలు, పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను టీడీపీ నాయకులు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు.

News June 29, 2024

పుంగనూరుకు పోవడం కూడా కష్టమే: లాయర్

image

తన భద్రత విషయమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డికి 5+5 భద్రత ఉండేది. ఇప్పుడు 2+2 కూడా ఇవ్వడం లేదు. భద్రత ఉపసంహరణపై పోలీసులు కారణాలు చెప్పడం లేదు. ఆయన MLAగా పుంగనూరుకు కూడా వెళ్లలేకున్నారు’ అని కోర్టులో వాదించారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.

News June 29, 2024

టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం..?

image

టీటీడీ ఆన్‌లైన్ సేవలకు ఆధార్‌ లింక్ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయమై ఈవో శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో UIDAI అధికారులతో సమావేశమయ్యారు. ‘టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలను ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ దళారుల బెడద తప్పడం లేదు. ఆధార్ లింక్ ద్వారా మోసాలను అరికట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి’ అని టీటీడీ ఐటీ అధికారులకు ఈవో సూచించారు.

News June 29, 2024

చిత్తూరు: టేబుల్ రకాల మామిడికి గిరాకీ ఎక్కువే..!

image

చిత్తూరులో జిల్లాలో టేబుల్ రకం మామిడికి మంచి ధర లభిస్తోంది. హిమామ్ టన్ను రూ.2 లక్షలు, బంగినపల్లి కాయల నాణ్యతను బట్టి టన్ను రూ.45 వేల నుంచి రూ.80 వేలు, కాలేపాడు రూ.50 వేల నుంచి రూ.80 వేలు, మల్గూబా రూ.లక్ష నుంచి రూ.1.2 లక్షలు పలుకుతున్నాయి. సీజన్ ముగిసిపోతుండడంతో రైతుల దగ్గర టేబుల్ రకాల కాయల లభ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో ధరలు పెరిగినా రైతులకు ఒరిగేది ఏమీ లేదని వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

News June 29, 2024

చిత్తూరు: ఆందోళనలో మామిడి రైతులు

image

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పంటకు సరైన ధర అందకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం టన్ను రూ.28వేలు పలికిన తోతాపురి మామిడి రకం తాజాగా రూ.24వేలకు పడిపోయింది. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్‌గా ధరలు తగ్గిస్తున్నారని వారు వాపోయారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 29, 2024

తిరుపతి- హిసార్ మధ్య ప్రత్యేక రైలు

image

తిరుపతి- హిసార్ మధ్య వారానికోసారి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. హిసార్- తిరుపతి (04717) రైలు ప్రతి శనివారం జులై 6 నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు, తిరుపతి- హిసార్ (04718) రైలు ప్రతి సోమవారం జులై 8 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు నడవనున్నాయి. గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ ఖాఘజ్నగర్, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్ తదితర స్టేషన్ల మీదుగా వెళుతుందని చెప్పారు.

News June 29, 2024

తిరుపతిలో భార్యాభర్తకు జైలుశిక్ష

image

చీటింగ్ కేసులో తిరుపతికి చెందిన భార్యాభర్తలకు జైలుశిక్ష పడింది. ఫిర్యాది తరఫు న్యాయవాది జి.వెంకట కుమార్ వివరాల మేరకు.. నగరానికి చెందిన కె.శ్రీనివాసులు, కె.ఓంకార లక్ష్మి ఒకరికి అప్పు తీర్చేందుకు భార్య పేరుతో ఉన్న చెక్‌పై భర్త సంతకం పెట్టారు. దీంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరికీ మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి ఎం.సంధ్యారాణి తీర్పు చెప్పారు.

News June 29, 2024

CTR: మామిడి రైతులకు సూచనలు

image

ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.

News June 29, 2024

తిరుమల: ఘాట్ రోడ్లోకి వచ్చిన ఏనుగులు

image

తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ఏనుగుల గుంపు కలకలం రేపింది. 7వ మైలు సమీపంలో దాదాపు 15 ఏనుగులు సంచారించాయని సమాచారం. అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేసి గజరాజులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అలాగే భక్తులను అప్రమత్తం చేశారు.

News June 28, 2024

బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల జైలుశిక్ష

image

చిత్తూరు: బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. గుడిపల్లె మండలానికి చెందిన 9వ తరగతి బాలికకు దేవరాజ్(26) మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2014 జూలై 5న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో దేవరాజ్‌కు 24 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి శాంతి తీర్పు చెప్పారు.