India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లాస్థాయి దళం కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నూతన ఫుడ్ కోర్టును ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. విధినిర్వహణలో ఉండి ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయలేని సిబ్బంది కోసం దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎటువంటి లాభాపేక్షా లేకుండా, తక్కువ ధరకే ఆహార పదార్థాలు సిబ్బందికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్ విమల కుమారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. రాష్ట్ర చరిత్రలోనే 108 అంబులెన్స్ ప్రవేశపెట్టి రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఎంతోమందికి పునఃజన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో అనిమల్ హస్బెండరీ (ఏహెచ్) పాలిటెక్నిక్ డిప్లొమా రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సుకు ఆన్ లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెంగల్రాయులు ఒక ప్రకటనలో తెలిపారు. SSC లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు సోమవారం నుంచి వర్సిటీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తుందని చెప్పారు.

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, చౌడేశ్వరీ నగర్లో ఉండే ఎస్.ఆర్.దుర్గ (28), కే.భాస్కర్ నాయుడుకు ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న భాస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యపై అనుమానంతో కొడుతూ వుండేవాడు. రాత్రి కత్తితో దాడి చేయగా దుర్గ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి స్వగృహానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేసారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి పుంగునూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల చర్చించారు. త్వరలోనే పుంగనూరు పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నట్లు విశ్వనీయ సమాచారం.

తిరుపతి SV జూపార్క్లో ఆడ పులి మృతి చెందిందని జూపార్క్ క్యూరేటర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనిమల్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమంలో భాగంగా లక్నోలో గల నవాబ్ మజీద్ అలీషా జువాలాజికల్ పార్క్ నుంచి జాలి అనే ఐదేళ్ల వయసు గల ఆడపులిని జూ పార్క్ కు తీసుకొచ్చారు. జూన్ మొదటి వారంలో డే కేర్ లో ఆడుతూ కిందపడి తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పులి మృతి చెందిందని అన్నారు.

చిత్తూరు నగరంలోని జింకల పార్క్ వద్ద మధ్యాహ్నం లారీ ఆదుపు తప్పి బోల్తా పడింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సాయంతో లారీని లేపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో గిరింపేట నుంచి జింకల పార్క్ మీదుగా టౌన్ లోకి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీకి చెందిన సుధ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహారావు కథనం మేరకు.. ఓ ప్రకటనల కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో పెద్దఎత్తున ఆదాయాలు పొందవచ్చునని నర్మద కుటుంబ సభ్యులు సుధాని నమ్మించారు. దీంతో ఆమె ఏడాది పాటు రూ.39లక్షలు అందజేసింది. చివరికి ఇంటికి తాళంవేసి పరారయ్యారు.

ఆన్లైన్ ద్వారా మోసానికి పాల్పడిన ఓ యాప్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన మన్సూర్ అలీ ఆన్లైన్లో ట్రేడ్ బైమార్జిన్ యాప్లో పెట్టుబడులు పెట్టాడు. యాప్ ద్వారా ఇటీవల విడతల వారీగా రూ.3,14,300 చెల్లింపులు చేశాడు. ఈ నగదును తిరిగి చెల్లించకుండా బాధితుడి ఖాతాను మూసివేశారు. ఆన్లైన్ వ్యాపారంలో తాను నష్టపోయినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.