India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైక్ డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తవణంపల్లిలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. చిత్తూరులోని కట్టమంచి కంది కాలమ్మ గుడి వీధికి చెందిన రామన్ (60) బైక్పై వెళ్తుండగా కె. పట్నం ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి డివైడర్కు ఢీకొని తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అతని భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
తిరుమల శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25న జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థంలోకి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. మరుసటి రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 24, 25న రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు.
ఇటీవల వైసీపీకి దూరమైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తిరుపతి ఎంపీ పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. ఆయినప్పటికీ ఆయన సీటుపై ఎలాంటి భరోసా ఇవ్వలేదని సమాచారం. తాజాగా ఆయన ఢిల్లీ బాట పట్టారు. అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలతో తిరుపతి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు లాబీ చేస్తున్నారని తెలుస్తోంది.
ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.
తొలిసారిగా 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం ఉన్నవారు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. తాజా వివరాల ప్రకారం తిరుపతి జిల్లాలో 7,940 మంది వృద్ధులు, 24,481 మంది దివ్యాంగులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల లోపు వీరంతా ఫారం12-డీ ద్వారా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. మీ సమీపంలోని బీఎల్వోలను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియమాలను ఉల్లంఘించరాదని ఎస్పీ హెచ్చరించారు. నారా భువనేశ్వరిని కలవడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం.
పిచ్చాటూరు కీలపూడి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ (జ్యూస్ షాప్) వద్ద ద్విచక్ర వాహనంలో వస్తున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో విచారణ చేపట్టారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
బి కొత్తకోటలో విషం తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. స్థానిక రంగసముద్రం రోడ్డులో ఉంటున్న దంపతులు బాలాజీ, అశ్వినికి 9 ఏళ్లగా పిల్లలు కలగలేదు. దీంతో వారు బుధవారం గొడవపడ్డారు. మనస్థాపం చెందిన అశ్విని పురుగుమందు తాగడంతో గమనించిన భర్త ఆవెంటనే పురుగు మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితులను కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
నంద్యాల జిల్లాలో జనావాసాల మధ్య దొరికిన నాలుగు పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి ఎస్వీ జూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు పులి పిల్లల్ని నల్లమల అభయారణ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసి పులి పిల్లలకు వేటాడటం నేర్పించేందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టారు.
Sorry, no posts matched your criteria.