India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బీఎల్ఓలందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొనాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్క అధికారి రైతుల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

రామకుప్పం(M) వీర్నమలకు చెందిన వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి మృతి పట్ల CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భూపతి విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమని, వార్డు మెంబర్, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమన్నారు. భూపతి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని CM అన్నారు.

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

మదనపల్లె జిల్లాలోకి పుంగనూరును మార్చనున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 6మండలాలను 3రెవెన్యూ డివిజన్ల పరిధిలోకి చేర్చనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మండలాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు. సోమల, సదుం కొత్త డివిజన్ పీలేరులో కలుస్తాయి. పులిచెర్ల, రొంపిచర్ల మండలాలను చిత్తూరు డివిజన్లోనే కొనసాగించనున్నారు. ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకుంటారు.

చిత్తూరు జిల్లా విస్తీర్ణం తగ్గిపోనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని 6మండలాలను మదనపల్లె జిల్లాలో కలపనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్లోకి వెళ్తాయి. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు పీలేరు డివిజన్లో చేర్చుతారు. పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురుకుప్పాన్ని తిరుపతిలో కలపాలనే డిమాండ్ను పట్టించుకోలేదు.
Sorry, no posts matched your criteria.