Chittoor

News August 4, 2024

విద్యార్థిపై దాడి.. లోకేశ్‌కు లేఖ

image

తన బిడ్డపై కరస్పాండెంట్ దాడి చేశాడని ఓ తండ్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు. ‘ నా బిడ్డ ములకలచెరువులోని SPVB పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బిడ్డపై ఆ స్కూల్ కరస్పాండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. పాఠశాలలో బంధించడంతో తప్పించుకుని నా వద్దకు వచ్చాడు. ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని శ్రీసత్యసాయి జిల్లా కుక్కంటి క్రాస్‌కు చెందిన విద్యార్థి తండ్రి ఇక్బాల్ ఆరోపించారు.

News August 4, 2024

రెండు సార్లు గరుడ వాహన సేవ

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆగస్టులో రెండు సార్లు గరుడ వాహన సేవ జరగనుంది. 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనం పై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

News August 4, 2024

పుంగనూరు ఈవోపీఆర్డీపై వేటు

image

పుంగనూరు MPDO ఆఫీసులో రూ.1.37 కోట్ల నిధుల దుర్వినియోగం ఉదంతంలో ఈవోపీఆర్డీ నారాయణను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీపీవో లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్ సునీల్, ప్రస్తుత ఏవో రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నారాయణపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు.

News August 4, 2024

చిత్తూరు: బాలికపై బాలుడు అత్యాచారం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల వివరాల మేరకు.. కలికిరి మండలంలో బాలిక ఒకటో తరగతి చదువుతోంది. స్థానికంగా ఉంటున్న 14 ఏళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అతను బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News August 4, 2024

మదనపల్లె: నలుగురిపై నాన్ బెయిల్‌బుల్ కేసులు

image

మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు నిందితులపై నాన్ బెయిల్‌బుల్‌తో వన్ టౌన్ పోలీసులు FIR నమోదు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకా చలపతి, పెద్దిరెడ్డి అనుచరులు మాధవ రెడ్డి, కె.రామకృష్ణారెడ్డి ఉన్నారు. కేసు వివరాలను మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 8 ఉండరాని ఫైల్స్ దొరకడంతోనే కేసు నమోదు చేశారు.

News August 4, 2024

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం

image

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సుమధుర గ్రూప్‌ సీఎండీ మధుసూధన్‌ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ  మేరకు డీడీని తిరుమలలోని గోకులం రెస్ట్‌ హౌస్‌లో టీటీడీ అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భరత్ కుమార్,నవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

News August 3, 2024

అక్టోబరు 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. అడిషనల్ ఈ.ఓ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News August 3, 2024

తిరుపతిలో బంగారం ధరలు ఇవే..

image

AP బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ తిరుపతి వారి వివరాల మేరకు శనివారం సాయంత్రం బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10gm బంగారం ధర రూ.72160, 22 క్యారెట్ల 1gm బంగారం ధర రూ.6674గా ఉంది. ఒక సవరం బంగారం (8gm) ధర రూ.53392లుగా ఉంది. వెండి 1కిలో రూ.85,000, రిటైల్ ధర 1gm రూ.87.00గా ఉంది.

News August 3, 2024

చిత్తూరు: ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి దుర్మరణం

image

కోసువారిపల్లిలో ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ రోజు జరిగిన ఈ ఘటనపై తంబళ్లపల్లె SI శివకుమార్ ప్రకారం.. చరణ్, నందినిల కుమార్తె రూప(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందినట్లు వైద్యులు తెలిపారు. చరణ్ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

News August 3, 2024

సదుం: కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి

image

కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి చెందిన విషాదకర ఘటన సదుం మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పీలేరుకు చెందిన తులసమ్మ (55) మనవడు అద్విక్ (3) తో కలసి మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న గృహనిర్మాణం పరిశీలించేందుకు వచ్చారు. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో విరుపాక్షమ్మ ఆలయం వద్దనున్న కోనేరులో ఇద్దరూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.