Chittoor

News December 22, 2025

చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

News December 21, 2025

చిత్తూరు: రేపు ఉదయం 9 నుంచి ప్రారంభం.!

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరగనుందని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.

News December 21, 2025

జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పెద్దిరెడ్డి

image

YCP అధినేత జగన్ను ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు బొకే అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం పెద్దిరెడ్డి గురించి వివరించారు.

News December 21, 2025

TDP చిత్తూరు జిల్లా బాస్ ఎవరంటే..?

image

TDP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. పుత్తూరుకు చెందిన షణ్ముగ రెడ్డిది వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం. గతంలో జిల్లా అధ్యక్షుడిగా CRరాజన్ పనిచేశారు. ప్రస్తుతం అదే సామాజికవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డికి అవకాశమిచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు.

News December 21, 2025

చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

image

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.

News December 21, 2025

రేపే చిత్తూరులో లీప్ టీచర్స్ టోర్నీ

image

చిత్తూరు మోసానికల్ మైదానంలో ఈనెల 22న లీప్ టీచర్స్ టోర్నమెంట్ నిర్వహిస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీల్లో పురుషుల విభాగంలో పలమనేరు, చిత్తూరు, కుప్పం, నగరి, త్రోబాల్ మహిళా విభాగంలో కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు జట్లు పాల్గొంటాయని చెప్పారు.

News December 21, 2025

చిత్తూరు మామిడి రైతులకు ముఖ్య గమనిక

image

మామిడి రైతులకు డిసెంబర్ నెల కీలకమని చంద్రగిరి HO అధికారిణి శైలజ అన్నారు. పూతదశకు ముందు నీటి తడులు ఆపితే చెట్టు ఒత్తిడికి లోనై మంచి పూత వస్తుందన్నారు. పిండి పురుగు పైకి ఎక్కకుండా కాండం చుట్టూ 25 సెం.మీ ప్లాస్టిక్ కవర్ కట్టి గ్రీజు రాయాలని, పూత సమంగా రావడానికి 13-0-45 నిష్పత్తిలో పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రా.కలిపి పిచికారీ చేయాలన్నారు. పాదుల్లో కలుపు తీసి,ఎండిన కొమ్మలు కత్తిరించాలన్నారు.

News December 21, 2025

సంక్రాంతి వస్తోంది.. చిత్తూరు జిల్లాలో జాగ్రత్త

image

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మహిళలు ఉదయాన్నే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడుతున్నారు. మగవాళ్లు అప్పుడే కోడిపందేలకు తెరలేపారు. పోలీసులు అయితే సైలెంట్‌గా ఉండరు కదా? వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి(M) నెల్లిపట్ల పంచాయతీ కక్కనూరు సమీపంలో కోడిపందెం స్థావరంపై SI చందన ప్రియ దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని 18బైకులు, 3కోళ్లు సీజ్ చేశారు. సో కోడిపందేలకు వెళ్లకండి.

News December 20, 2025

చిత్తూరు: రేపు 2 లక్షల మందికి టీకాలు.!

image

ఈఏడాది జిల్లాలో 2,21,502 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులు ఈ ప్రోగ్రాం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 5,794 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఈ కేంద్రాల వద్ద, మిగిలిన రెండు రోజులు సిబ్బంది ఇంటింటికీ తిరిగి వేయనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పేరంట్స్ చిన్నారులకు తప్పక టీకాలు వేయించాలి.

News December 20, 2025

చౌడేపల్లి: ‘సచివాలయ సిబ్బందికి జీతాలు నిలుపుదల’

image

చౌడేపల్లె మండలం చారాల సచివాలయంలోని పలువురి సిబ్బందికి మూడు నెలల జీతాలను నిలుపుదల చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓం ప్రసాద్, కృష్ణమూర్తి, హిమబిందు, సోమశేఖర్, మహమ్మద్ ఆరీఫ్ లకు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే వారికి జీతాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.