Chittoor

News December 31, 2024

కురబలకోటలో రోడ్డుప్రమాదం.. మదనపల్లె వాసి మృతి

image

కురబలకోట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుడు మదనపల్లె కనకదాస్ నగర్‌కు చెందిన నేతన్న శివ(25)గా గుర్తించారు. మహిళను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆమెను రుయాకు రెఫర్ చేశారన్నారు.

News December 31, 2024

తిరుపతి: విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులు..  ప్రొఫెసర్ సస్పెండ్

image

తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఆఫ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఓ విద్యార్థిని పట్ల లైంగిక వేధింపుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్ర రావు ఉత్తర్వులు ఇచ్చారు.

News December 30, 2024

2024 రౌండప్.. చిత్తూరు జిల్లాలో 389 మంది మృతి

image

చిత్తూరు జిల్లాలో 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2023లో 703 ప్రమాదాలు సంభవించి 351 మంది మృతి చెందగా.. 2024లో 734 ప్రమాదాలు జరిగి 389 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2023లో సైబర్ కేసులు 58 నమోదవ్వగా.. 2024లో 41 కేసులు నమోదయ్యాయి. హత్యలు 44 జరగగా.. 2024లో 24 జరిగాయి. గతంలో 427 దొంగతనాలు జరగగా, 2024లో 323 జరిగినట్లు అధికారులు తెలిపారు.

News December 30, 2024

తిరుపతి: ఆనాటి గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు ఎక్కడ..?

image

చిత్తూరు జిల్లాలో కొత్త సంవత్సరం అంటే అందరూ తిరుమల, తిరుచానూరు, కాణిపాకం అంటూ తమకు నచ్చిన గుడికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆత్మీయుల కోసం గ్రీటింగ్ కార్డు కొనుగోలు చేసి మనసులోని భావాలను ఆ కార్డుపై రాసి పంపేవారు. నేడు పరిస్థితి మారింది. గుడికి వెళ్లడం కొనసాగుతున్నా.. గ్రీటింగ్ కార్డులు మాయమయ్యాయి. మొబైల్ ఫోన్ల రాకతో అర్ధరాత్రి 12 మోగగానే మెసేజ్‌లు, కాల్స్‌తో విషెస్ చెబుతున్నారు.

News December 30, 2024

CTR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News December 30, 2024

CTR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News December 29, 2024

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రివెన్స్ డే: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News December 29, 2024

తిరుపతి: పరీక్షలు వాయిదా

image

తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.

News December 29, 2024

కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

image

కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

News December 28, 2024

CA ఫలితాల్లో ‘టాప్‘ లేపిన చిత్తూరు జిల్లా కుర్రాడు

image

జాతీయ స్థాయిలో జరిగిన చార్టెర్డ్ అకౌంటెంట్(CA) తుది ఫలితాల్లో చిత్తూరు జిల్లా వాసి అగ్రస్థానం కౌవసం చేసుకున్నాడు. తాజాగా వెలవడిన ఫలితాల్లో పలమనేరుకు చెందిన రిషబ్ ఓత్సవాల్ 600 మార్కులకు గాను 508 మార్కులు సాధించి మరో విద్యార్థితో సమానంగా నిలిచాడు. దీంతో ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండిమా(ICIA) ఇద్దరికి ప్రథమ స్థానం కేటాయించింది. వారికి పలువురు అభినందనలు తెలిపారు.