Chittoor

News April 10, 2025

చిత్తూరు: ముగిసిన టెన్త్ వ్యాల్యుయేషన్

image

చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.

News April 10, 2025

చిత్తూరు: ఖైదీలకు బ్యాంకు లోన్లు..!

image

చిత్తూరు జైలు ఖైదీలకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ తదితర కోర్సుల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ ట్రైనింగ్ ఇప్పించారు. ఫిబ్రవరి, మార్చిలో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. త్వరలో ఓపెన్ క్లాస్ ద్వారా పదో తరగతి పాఠాలు చెబుతామన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు బ్యాంకు లోన్లు సైతం ఇప్పిస్తామని చెప్పారు. మహిళా ఖైదీలకు టైలరింగ్ నేర్పించాలని జైలు అధికారులు కలెక్టర్‌ను కోరారు.

News April 10, 2025

తిరుపతి: విషం పెట్టి చంపేశారా..?

image

చంద్రగిరి(M) నరసింగాపురంలో యువతి <<16044546>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ సంచలన విషయాలు చెప్పాడు. ‘మూడేళ్లుగా ప్రేమించుకుని గతేడాది గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఆమె తల్లిదండ్రులు నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం రావడంతో అబార్షన్ చేయించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె నన్ను కలిసింది. దీంతో తన అమ్మానాన్న విషం పెట్టి చంపేస్తారని ఆమె నాకు మెసేజ్ చేసింది. ఆ పక్కరోజే ఆమె చనిపోయింది’ అని అజయ్ తెలిపాడు.

News April 10, 2025

చిత్తూరు-కాట్పాడి డబుల్ లైన్‌కు గ్రీన్ సిగ్నల్

image

తిరుపతి-కాట్పాడి డబుల్ లైన్ నిర్మాణానికి రూ.1332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు చిట్టిబాబు వెల్లడించారు. తిరుపతి-పాకాల, చిత్తూరు-కాట్పాడి వరకు సింగిల్ లైనే ఉంది. 104 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చనున్నారన్నారు. ఈ పనులు పూర్తి అయితే శ్రీకాళహస్తి-చెన్నై మార్గంలో బెల్లం, గ్రానైట్, మామిడి ఎగుమతులు పెరుగుతాయి.

News April 10, 2025

ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం: చిత్తూరు కలెక్టర్

image

గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ యుగంధర్ పొన్న బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తక్షణమే కొనసాగించాలని కోరారు. అడవుల్లో జీవిస్తున్న గిరిజన ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని యుగంధర్ డిమాండ్ చేశారు. త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News April 9, 2025

ఖైదీలకు స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ల ప్రదానం

image

వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జైలులో బుధవారం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి హాజరై వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని ఖైదీలకు సూచించారు. అనంతనం శిక్షణ పొందిన పలువురు ఖైదీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.  

News April 9, 2025

తిరుపతి: ఉద్యోగం తీసేశారని బైక్ ఎత్తుకెళ్లాడు..!

image

స్కూటర్ దొంగతనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీసులు వెల్లడించారు. నెల్లూరు(D) రాపూరు(M) గండవోలు పంచాయతీకి చెందిన ప్రసాద్ రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై కంపెనీ బయట ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 9, 2025

చిత్తూరు: బాలికకు గర్భం.. కేసు నమోదు

image

చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. SI నాగేశ్వరరావు వివరాల మేరకు.. 15 ఏళ్ల బాలికను ఆమినిగుంట పంచాయతీకి చెందిన నాగేంద్ర ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భణిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News April 9, 2025

చిత్తూరు: యువతి ప్రేమ నిరాకరించిందని..!

image

ఓ యువకుడు తన వాహనానికే నిప్పు పెట్టుకున్న ఘటన పుంగనూరు మండలంలో జరిగింది. గిరి అనే యువకుడు పూజాగానిపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను నిరాకరించిదన్న కోపంతో గిరి ఆమె ఇంటి ముందు మంగళవారం తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News April 9, 2025

జ్యూట్ బ్యాగులను వినియోగించుకుందాం: ఎంపీ 

image

జ్యూట్ బ్యాగులను వినియోగించి, పర్యావరణాన్ని పరి రక్షించుకుందామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ కార్యాలయంలో జ్యూట్ బ్యాగులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని ఎంపీ సూచించారు.