India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నాగశశి భూషణ్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో DIO అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ శశి భూషణ్ రెడ్డిని DMHOగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో ఈయన బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు.

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.

అంగన్వాడీ ఉద్యోగాలకు అభ్యర్థులు సమర్పించిన టెన్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలంటూ DEOకు లేఖ రాసినట్లు కుప్పం CDPO చంద్రకళ తెలిపారు. అయితే, కలెక్టర్ ద్వారా ఆదేశాలు రావాలని DEO చెప్పడంతో కడ PD ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్టిఫికెట్లు ఒరిజినల్ Or ఫేక్ అన్నది విద్యాశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. కుప్పంలో 10th ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వారిని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.

జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం(M)లో ఇంటర్వ్యూలకు కొందరు కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. కొంతమంది National institute of Open Schoolలో 10th చదివినట్లు సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్టిఫికెట్లతో మరెంత మంది ఉద్యోగాల్లో చేరారన్నది చర్చనీయాంశంగా మారింది.

మదనపల్లెలో చిన్నారి <<19166799>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నిందితుడి ఇంట్లోనే బాలిక మృతదేహం ఉంది. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఇప్పటికీ అప్పజెప్పలేదు. ఇంట్లోకి వెళ్లకుండా బాలిక బంధువులు, స్థానికులు అడ్డుకుంటున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కడప ఎస్పీ విశ్వనాథ్ వచ్చారు. మరికాసేపట్లో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సైతం రానున్నారు.

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

జీడీనెల్లూరు గ్రామానికి చెందిన మాళవిక తన తండ్రితో కలిసి చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్ డేకు హాజరైంది. తనకు రెండు కళ్లు లేవని.. పెన్షన్ ఇప్పించాలని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. గ్రామ సచివాలయ అధికారులను ఆశ్రయిస్తే.. రాదన్నారని చెప్పింది. అర్హతను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయడానికి నివేదిక ఇవ్వాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

రోజువారి కూలీలతో జీవనం సాగించే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. వయసును బట్టి నెలకు ప్రీమియం రూ. 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల అనంతరం నెలవారి రూ. 3 వేలు పింఛను వస్తుంది. లబ్ధిదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50% పింఛన్ చెల్లిస్తారు.

కుప్పం GH లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా ఆసుపత్రి వారు మాత్రం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో కుప్పం GH కు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంటును అందజేశారు. అయితే అప్పటి YCP ప్రభుత్వం సైతం మరో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 2 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో మరమ్మతులు కాగా సుమారు ఏడాదికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.