India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసానికి చేరకున్న పెద్దిరెడ్డి బొకే అందించి సన్మానించారు. తమ నాయకుడు ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.
CM చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద రూ.456 కోట్లు మంజూరు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. కుప్పం పరిధిలో 130 KM మేర అండర్ డ్రైనేజ్, 11 అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించింది. నిన్న రాత్రే ఈ జీవోను రద్దు చేసింది. పనుల్లో కొన్ని మార్పులు చేసి మరోసారి జీవో ఇస్తారని సమాచారం.
తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరు ఎలా ఉందనే అంశంపై సినిమా తీస్తున్నట్లు MLA జగన్ మోహన్ ప్రకటించారు. ఇందులో వివిధ పార్టీల రాజకీయ నాయకుల ప్రస్తావన ఉంటుందని చెప్పారు. ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ పేరిట వచ్చే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పాత్రలు, స్వభావాలు అంటూ ఇందులో సీకే బాబు, బుల్లెట్ సురేశ్, విజయానందరెడ్డి తదితరుల పేర్లతో కూడిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.
తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి శ్రీవాణి, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ల విడుదల తేదీలు(ఆయా రోజుల్లో ఉదయం 11 గంటలకు) ఇవే..
➤శ్రీవాణి టికెట్లు: డిసెంబర్ 23న
➤రూ.300 టికెట్లు: డిసెంబర్ 24న
➤మార్చి నెల శ్రీవాణి టికెట్లు: డిసెంబర్25న
➤మార్చి నెల రూ.300 టికెట్లు: డిసెంబర్ 26న
చిత్తూరు- తవణంపల్లె రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ కళాశాల విద్యార్థులు స్పోర్ట్స్ బైక్పై అతివేగంతో బస్ను ఓవర్టేక్ చేస్తుండగా.. బైకు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో విద్యార్థులు హర్ష(17), సాయితేజ(18)కు తీవ్ర రక్తస్రావమై కోమాలోకి వెళ్లారు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022 కు వాట్సాప్ చేయండి.
కుప్పం నియోజకవర్గంలో YCP అధినేత జగన్ జన్మదిన వేడుకలపై ఆంక్షలు విధిస్తూ సబ్ డివిజనల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో సీఎం భార్య భువనేశ్వరి పర్యటన 21 వరకు కొనసాగడం, అదే రోజు జగన్ పుట్టిన రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ ఆఫీసులో మినహా మరెక్కడా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేయకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంత్రి లోకేశ్ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేశ్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ముగిసి నేటికీ సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఆయనను కలిసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కుమారుడు వినీల్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.