Chittoor

News July 19, 2024

మాపై దాడికి పోలీసులే సాక్ష్యం: రెడ్డప్ప

image

పుంగనూరులో తమపైనే కేసులు పెట్టడం విడ్దూరంగా ఉందని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప అన్నారు. ‘పోలీసుల సమక్షంలోనే నిన్న మా ఇంటిపై దాడి చేశారు. నేను, మిథున్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాం. అయినా మాపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది.’ అని ఆయన అన్నారు. నిన్నటి ఘటనపై రెడ్డప్ప ఫిర్యాదుతో టీడీపీ నాయకులపై.. సుహేల్ బాషా, RK ప్రసాద్ ఫిర్యాదుతో A1గా మిథున్ రెడ్డితో పాటు 77 మందిపై కేసులు పెట్టినట్లు సమాచారం.

News July 19, 2024

కుప్పంలో భువనేశ్వరి పర్యటన..!

image

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 23, 24, 25న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం. ఎన్నికలకు ముందు బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమైన ఆమె అత్యధిక మెజార్టీలు వచ్చిన బూత్‌లను ఎన్టీఆర్ ట్రస్టు తరఫున దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 4 మండలాల్లో అత్యధిక మెజారిటీ వచ్చిన బూత్‌లలో పర్యటించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

News July 19, 2024

చిత్తూరు: ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వ హించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పెండింగ్ ఆధార్ సర్వీసులను అప్‌డేట్ చేయనున్నారు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించనున్నారు.

News July 19, 2024

మరోసారి ఎంపీ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ..!

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు సిద్ధం కావడం టెన్షన్ రేపుతోంది. మరికాసేపట్లో ఆయన సదుంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు పులిచెర్ల మండలం కల్లూరులో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 19, 2024

నా ఆదాయం రోజుకు రూ.కోటి: MLA థామస్

image

వైద్యుడిగా తనకు రోజుకు రూ.కోటి ఆదాయం వస్తుందని.. ప్రజాసేవ కోసమే దానిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ అన్నారు. పెనుమూరు మండలం నెల్లేపల్లె ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అవుతానని అసలు ఊహించలేదని చెప్పారు. చంద్రబాబు సూచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని చెప్పారు.

News July 19, 2024

పుంగనూరులో గొడవకు కారణం అదేనా..?

image

పుంగనూరులో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పట్టణంలోని మాజీ MP రెడ్డప్ప ఇంటికి రాజంపేట MP మిథున్ రెడ్డి వచ్చారు. గతంలోనే పుంగనూరుకు రావడానికి ఎంపీ ప్రయత్నించడంతో తిరుపతిలోనే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిన్నటి పర్యటనపై పోలీసులకు ముందస్తు సమాచారం లేదు. ఇదే సమయంలో జలాశయాల నిర్వాసితులు, టీడీపీ నేతలు ఎంపీని నిలదీసేందుకు రావడంతో పరిస్థితులు అదుపు తప్పాయి.

News July 19, 2024

చిత్తూరు: రెగ్యులర్ ఎస్ఈగా సురేంద్రనాయుడు

image

విద్యుత్తు శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి సర్కిల్ ఎస్ఈగా సురేంద్రనాయుడు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా కొనసాగుతున్న ఆయన్ను రెగ్యులర్ ఎస్ఈగా నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన కృష్ణారెడ్డిని తిరుపతి కార్యాలయంలో ఆపరేషన్- నిర్వహణ విభాగం జీఎంగా నియమించారు.

News July 19, 2024

TPT: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

image

తిరుపతి జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఐరాల మండలం రామతీర్థ సేవాశ్రమ ఎస్టీకాలనీకి చెందిన జయచంద్ర(38), నారాయణ(35), చుక్కావారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాగమల్లయ్య(14), మనోజ్ బైకుపై దామలచెరువుకు బయలుదేరారు. పాత అక్కగార్ల గుడి వద్ద ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. మనోజ్ మినహా మిగిలిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మనోజ్‌ను 108లో కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 19, 2024

23న రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్వీమ్స్) యూనివర్సిటీ నందు మెడికల్/ పారామెడికల్ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్-01 పోస్ట్ కు ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ నర్సింగ్/ MPT న్యూరో/ఎమ్మెస్సీ న్యూరో సైన్స్/ ఎమ్మెస్సీ న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/ వెబ్ సైట్ చూడగలరు.

News July 18, 2024

తిరుపతిలో మహిళలపై కత్తితో దాడి.. ఒకరు మృతి

image

తిరుపతిలోని రాయల్‌నగర్‌లో ప్రముఖ వ్యాపారి ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ముసుగు వేసుకొని వచ్చి ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలను కత్తితో పొడిచి పరారయ్యారు. అందులో వృద్ధురాలు మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన వారిద్దర్నీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాపార గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.