Chittoor

News February 6, 2025

పలమనేరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

పలమనేరులో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటావూరుకు చెందిన షౌకత్ అల్లి అనే వ్యక్తి ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. గత కొంతకాలంగా అప్పువాళ్లు వచ్చి ఇంటిముందు అడుగుతుండడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్లేసరికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News February 6, 2025

బైరెడ్డిపల్లి: హైవేపై ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వి.కోట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లికి చెందిన మునెప్పగా గుర్తించారు. అతనికి మతిస్తిమితం సరిగా లేదని తెలుస్తోంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

నగరి : నలుగురి మృతికి కారణమైన లారీ పట్టివేత

image

ఫిబ్రవరి 2న నగరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని ఎట్టకేలకు నగరి పోలీసులు ఛేదించారు. సిమెంట్ లారీ వేలూరుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అనకాపల్లి నుంచి చెన్నైకి సిమెంటు తరలించే లారీ తిరుపతి వైపు వెళ్తున్న బస్సును ఢీకొని నలుగురు చనిపోయిన ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లను బాధ్యులుగా చూపుతూ కేసు నమోదు చేశారు.

News February 6, 2025

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

image

లారీ ఢీకొని అన్నాచెల్లెళ్లు మృతి చెందిన విషాద ఘటన విజయపురం మండలంలో జరిగింది. నిండ్ర(మం), అగరం పేట గ్రామానికి చెందిన రవి(48), KVB పురం(మం), కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44) అన్నాచెల్లెళ్లు. వారు పెద్ద అక్క దేశమ్మ ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ప్రయాణంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేశారు.

News February 5, 2025

చిత్తూరు: 19 నుంచి టెక్నికల్ పరీక్షలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష (లోయర్, హయ్యర్ గ్రేడ్) పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షల షెడ్యూల్ WWW. bre.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నట్లు తెలిపారు.

News February 5, 2025

కుప్పం: రహదారుల అభివృద్ధికి రూ.53.35 కోట్లు మంజూరు

image

కుప్పం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి కోసం ఆర్‌ఐడిఎఫ్ గ్రాంట్ కింద రూ.53.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని 23 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

News February 4, 2025

కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7.85 కోట్లు

image

శాంతిపురం (M) రాళ్లబూదుగూరులో నెలకొని ఉండు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.85 కోట్లను మంజూరు చేసింది. కుప్పం ప్రాంతంలో అత్యంత పురాతన ఆలయంలో ఒకటైన శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

News February 3, 2025

కుప్పంలో పట్టపగలు వరుస చోరీలు

image

కుప్పం పట్టణంలో మధ్యాహ్నం రెండిళ్లలో వరుస చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి రెండిళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. టీబీ రోడ్డు సమీపంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో బీరువాను పగలగొట్టి చోరీ చేయడంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను దొంగ ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా ప్యాలెస్ ఏరియాలో సైతం ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

News February 3, 2025

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచారంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆదివారం ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

News February 2, 2025

పుంగనూరుకు చేరుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

image

సోమల మండలంలో జరుగు ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేరుకున్నారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ చదల్ల గ్రామంలోని ఎం. వేణుగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సోమల బహిరంగ సభలో పాల్గొననున్నారు.