Chittoor

News October 24, 2024

చిత్తూరు: చిరుత పులిని చంపిన ఇద్దరు అరెస్ట్

image

చిరుత పులిని చంపిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. బంగారుపాలెం వద్ద ఇటీవలె ఓ చిరుత పులి చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వెళుతురుచేను గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల నుంచి చిరుతపులి కాళ్లు, గోళ్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. మరికాసేపట్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  

News October 24, 2024

గర్భం దాల్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

image

ఓ బాలిక గర్భం దాల్చిన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. కురుబలకోటకు చెందిన 16 ఏళ్ల బాలిక మదనపల్లెలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. లక్కిరెడ్డిపల్లికి చెందిన ఓ యువకుడు (24), బాలిక మధ్య కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో బాలిక గర్భందాల్చింది. గురువారం ఉదయం బాలిక తల్లి పసిగట్టి ముదివేడులో ఫిర్యాదు చేయగా పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News October 24, 2024

నేడు శ్రీవారి రూ.300 టికెట్ల విడుదల

image

తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి నెలకు సంబంధించి రూ.300 టికెట్ల కోటాను నేడు విడుదల చేయనున్నట్లు TTD అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 24, 2024

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కొడుకులు మృతి

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో తండ్రి, కొడుకులు మృతి చెందిన విషాద ఘటన తొట్టంబేడు మండలం దొమ్మరపాలెం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..చియ్యవరం గ్రామానికి చెందిన రాజా (30) తన భార్య, బిడ్డలతో కలిసి బైక్‌పై శ్రీకాళహస్తి నుంచి చియ్యవరం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో రాజా (30), అతని కుమారుడు చైతన్య(5) మృతి చెందారు. మృతుడి భార్య గురువమ్మకు హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు.

News October 24, 2024

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా సచివాలయంలో సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 8,996 ఫిర్యాదులు అందగా 6,399 సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించినట్లు చెప్పారు. సమస్యల రీఓపెన్ కు అవకాశం లేకుండా అధికారులు చూడాలని అన్నారు.

News October 23, 2024

తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య

image

రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లె గ్రామంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. రేణిగుంట అర్బన్ సీఐ శరత్ చంద్ర, ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చెంగారెడ్డి పల్లె గ్రామంలో ఈశ్వరయ్య(45) భార్య సుజాత, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆయన రోజు తాగి వచ్చి భార్యను ఇబ్బందులు పెట్టడంతో బండరాయితో తలపై మోది చంపింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News October 23, 2024

పన్ను వసూళ్లపై దృష్టి పెట్టండి: చిత్తూరు కలెక్టర్

image

ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టి పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పని దినాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

నూజివీడులో చిత్తూరు ఎంపీటీసీ డెడ్ బాడీ కలకలం

image

చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం ఎంపీటీసీ కే.జగన్నాథం(40) మృతదేహం నూజివీడు ఆసుపత్రిలో కనిపించడం కలకలం రేపింది. చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు JCB కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో పోలీసులకు కనిపించింది.

News October 23, 2024

చిత్తూరు: పట్టాలపై రెండు మృతదేహాలు.. మృతులు వీరే  

image

చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రైలు పట్టాలపై నేడు <<14429914>>రెండు మృతదేహాలు<<>> పడి ఉన్న విషయం తెలిసిందే. మృతులు పీలేరు వాసులని కదిరి రైల్వే ఎస్ఐ రహీం తెలిపారు. పట్టణానికి శ్రీనివాసులు కుమారుడు కిరణ్ కుమార్(19) అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు యాసీన్(17) పులిచెర్ల రోడ్డులో పట్టాలపై కూర్చుని మద్యం తాగుతుండగా రైలు ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.