India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తమ తప్పులేకపోయినా భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ..క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగిరారు.ఎవరో ఏదో మాట్లాడారని స్పందించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.

తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.

గురువారం నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు సచివాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.విశ్వనాథ్ తనిఖీ చేశారు. వార్డు పరిధిలో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. వార్డు సచివాలయంలో కార్యదర్శులు హాజరు నమోదు, మూవ్మెంట్ రిజిస్టర్, పబ్లిక్ సర్వీసెస్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకుంటారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను ఆయన పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్, 4 గంటలకు నారా లోకేశ్ సైతం తిరుపతి వస్తారని సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతి నుంచి తిరుపతికి బయల్దేరారు. మరికాసేపట్లోనే రుయాలో బాధితులను పరామర్శిస్తారు.

తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరికాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. 12 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు చేరుకుంటారు.12 నుంచి 3 గంటల వరకు పరామర్శలు, టీటీడీ ఈఓ కార్యాలయంలో రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని విజయవాడకు చేరుకుంటారని అధికారులు తెలిపారు.

వివాదాస్పద వ్యక్తులకు TTD పాలనా పగ్గాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మాజీ ఛైర్మన్ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన మాట్లాడుతూ.. టీడీడీ చరిత్రలో ఇదో చీకటి రోజని, CM చంద్రబాబు పాలనా వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికీ పుష్కరాల ఘటన వెంటాడుతుందన్న ఆయన తాజా ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. YCP పాలనలో ఎన్నడూ ఇలా జరగలేదని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు.

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరందరికీ మరికాసేపట్లో రుయా ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్మార్టం చేయనున్నారు. స్విమ్స్లో చనిపోయిన ఇద్దరు, రుయాలో చనిపోయిన నలుగురి మృతదేహాలకు ఇక్కడే శపపరీక్ష చేసి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే బంధువులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.

తిరుపతిలో బుధవారం క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడిన ఘటనపై AP గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మాజీ మంత్రి రోజా అన్నారు. ‘ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలంటే ఇంతటి నిర్లక్ష్యమా? ఘటనపై కేంద్రం కలగజేసుకొని నిర్లక్ష్యం వహించిన TTD ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలి. అధికార యంత్రాంగాన్ని తన పర్యటనలో వినియోగించుకుని ఇంతమంది చావుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి’ అని రోజా డిమాండ్ చేశారు.

తిరుపతిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం పర్యటిస్తారని సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం 11. గంటలకు జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ (NRI) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.