India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోడలి మృతదేహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొడుకు చనిపోయాడని తెలియడంతో తీరని శోకంలో మునిగిపోయారు. తిరుపతి జిల్లా కేవీబీపురం(M) కాళంగికి చెందిన చెన్ను బ్రహ్మానందరెడ్డి, సుగుణమ్మ ఒక్కగానొక్క కుమారుడు సాయిరెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య హరిత 2 రోజుల కిందటే చనిపోయిన విషయం తెలిసిందే. సాయిరెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారి మృతదేహాలు ఆదివారం ఇక్కడికి రానున్నాయి.
చిత్తూరు జిల్లాలో అక్టోబర్ నెల రేషన్ సరుకుల పంపిణీని శుక్రవారం వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. బియ్యం పంపిణీ గడువు గురువారంతో ముగిసిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఓ పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
CA ఫలితాలల్లో ఆలిండియా 14వ ర్యాంకు, CMA పరీక్షల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినిని CM చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆమె తన నాన్నతోపాటూ CMను అమరావతిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి ర్యాంకులతో ఏపీ పేరు ప్రతిష్ఠలను నిలపడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.
పీహెచ్సీలలో నిర్మాణ దశలలో ఉన్న బ్లాక్ లెవెల్ హెల్త్ యూనిట్లను త్వరితగతిన పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఎనిమిది బ్లాక్ లెవెల్ హెల్త్ యూనిట్ల పురోగతిపై సంబంధిత వైద్య అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నిర్వహించే స్కానింగ్ కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బెంగళూరు – చెన్నై రైల్వే మార్గంలోని కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని గుల్లే పల్లి వద్ద గుడిపల్లి(M) కంచి బందార్లపల్లి చెందిన కిరణ్ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పట్టాలపై తలపెట్టి కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో తలముండెం వేరువేరుగా తెగిపోయింది. కిరణ్ ఆత్మహత్య వ్యవహారంపై కుప్పం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నిమ్మనపల్లెలో మిస్సింగ్ అయిన యువకుడు బెంగళూరులో స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని గుండ్లబురుజు దళితవాడకు చెందిన బాలాజీ(24) పవణహళ్లి పీఎస్ పరిధిలోని దొడ్డనహళ్లిలో రామసముద్రానికి చెందిన స్నేహితుడి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. దీంతో స్నేహితుడి చేతిలో హత్యకు గురయ్యాడని గురువారం ఉదయం బెంగుళూరు, పవణహళ్లి ఎస్ఐ సెల్వ తెలిపారు. మధ్యాహ్నంలోగా స్వగ్రామానికి మృతదేహం రానుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత నాలుగు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను భయపెట్టింది. ఏకంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు భారీ వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా జనజీవనం స్తంభించిపోయింది. ఎట్టకేలకు కాసేపటి క్రితం తడ వద్ద వాయుగుండం తీరం దాటింది అని తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, చిట్టమూరు, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, కేవీబీ పురం, నారాయణవనం, పుత్తూరు, రామచంద్రపురం, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, వడమాల పేట, వరదయ్యపాలెం, ఏర్పేడు మండలాలు హైరిస్క్ ఏరియాలుగా ప్రకటించింది.
తిరుపతి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 208 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అందులోకి లోతట్టు ప్రాంతాల నుంచి 1,183 మందిని తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం కూడా సెలవు ప్రకటించారు. సెలవు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో కాసేపటి క్రితమే రేపటికి సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.
Sorry, no posts matched your criteria.