Chittoor

News June 18, 2024

నా సెలవు పొడిగించండి: ధర్మారెడ్డి

image

ఎన్నికల ఫలితాలు విడుదలైన 2 రోజుల తర్వాత తనకు సెలవు కావాలని టీటీడీ పూర్వ ఈవో ధర్మారెడ్డి కోరారు. అదే సమయంలో తిరుమలకు చంద్రబాబు రావడంతో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవు మంజూరు చేశారు. ఈక్రమంలోనే ధర్మారెడ్డిని ఈవోగా తప్పించి శ్యామలరావును నియమించారు. ఇది ఇలా ఉండగా ఈనెలాఖరు వరకు తన సెలవు పొడిగించాలని ధర్మారెడ్డి సీఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు మరో లేఖ రాశారు. ఈనెల 30న ఆయన రిటైర్ కానున్నారు.

News June 18, 2024

23న కుప్పానికి చంద్రబాబు రాక..?

image

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పానికి చంద్రబాబు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న ఆయన కుప్పంలో పర్యటిస్తారని టీడీపీ నేతలకు సమాచారం అందింది. రెండు రోజులు పాటు కుప్పంలోనే సీఎం ఉంటారని సమాచారం. ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

News June 18, 2024

చిత్తూరు: ఉద్యోగం పేరుతో చీటింగ్

image

ఉద్యోగం పేరుతో మోసం చేసిన ముగ్గురిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం సంతపేటకు చెందిన వైష్ణవి(24) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. మురకంబట్టుకు చెందిన రాజేశ్, విజయ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఉద్యోగం తీసిస్తామని చెప్పి ఆమె వద్ద రూ.2.90 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం తీసి ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 18, 2024

జూన్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల

image

తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు ఆన్ లైన్ కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

News June 18, 2024

పదోన్నతులు పొందిన పోలీసులను అభినందించిన SP

image

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన ఒక ఏఎస్ఐ, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్ లను స్థానిక కంట్రోల్ రూమ్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అభినందించారు. పెరిగిన బాధ్యతలను నూతన ఉత్సాహంతో మరింత సమర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. వారికి వివిధ పోలీస్ స్టేషన్లకు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

News June 17, 2024

సత్యవేడు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కేవీబీపురంలోని పేరడి గ్రామంలో సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రవి కొడుకు మునస్వామి అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

News June 17, 2024

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

image

తిరుమలలో సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

News June 17, 2024

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని తెలిపింది.

News June 17, 2024

TTD ఛైర్మన్ పదవి ఎవరికో..?

image

వైసీపీ ఓటమితో ఎన్నికల ఫలితాల రోజే టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో కీలకమైన ఈ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నేతలు పోటీపడుతున్నారు. ముందుగా నాగబాబుకు ఛైర్మన్ పదవి ఖరారైందని వార్తలు రాగా ఆయన దీనిని ఖండించారు. ఓ టీవీ అధినేత, నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు పదవి ఎవరి దక్కుతుందో చూడాలి మరి.

News June 17, 2024

పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం: మంత్రి

image

వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం. అక్రమ సంపాదన కోసం పాలు, ఇసుక, మద్యం, ఎర్రచందనం దేన్నీ ఆయన ఫ్యామిలీ వదల్లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అనుమతులు లేకుండా రూ.700 కోట్లతో రిజర్వాయర్ కట్టారు. అక్కడ రైతుల భూములు లాగేసుకున్నారు’ అని ఆయన ఆరోపించారు.