India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏటా టీటీడీ గౌరవప్రదంగా అందజేసే నూతన ఏడాది డైరీ, క్యాలెండర్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సున్నితంగా తిరస్కరించారు. సాధారణంగా ఛైర్మన్కు టీటీడీ ఉచితంగా 75 డైరీలు, 75 క్యాలండర్లు ఇస్తుంది. వీటిని ఆయన తిరస్కరించి.. కొన్ని డైరీలను, క్యాలెండర్లను సొంత నగదుతో కొనుగోలు చేసి సన్నిహితులకు అందజేశారు.

కడప జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎంహెచ్ఎఓ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడపలోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ను సంప్రదించాలన్నారు.

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్ల ఎంపిక కార్యక్రమం మూడోరోజు కొనసాగినట్టు పోలీసులు తెలిపారు. 599 మంది అభ్యర్థులకు 394 మంది హాజరు కాగా 163 మంది అర్హత సాధించినట్టు వారు చెప్పారు. శుక్రవారం మహిళల అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. 495 మంది హాజరుకానున్నట్టు చెప్పారు.

బోయకొండలో గుర్తు తెలియని వాహనం ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. చౌడేపల్లె మండలం, బోయకొండ అప్పినేపల్లికి చెందిన ఎన్ రాజన్న(50) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సొంత పనిపై బుధవారం వేకువజామున పక్షిరాజపురానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుమలత ఉండగా పిల్లలులేరు. కేసు దర్యాప్తులో ఉందని SI తెలిపారు.

APSSDC ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ నారావారిపల్లి టీటీడీ కళ్యాణ మండపంలో జరగబోయే మెగా జాబ్ మేళా పోస్టర్ను మంగళవారం తిరుపతి జిల్లా వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళా దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 1200 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్
➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్
➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ
➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ
➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్

SVU హెల్త్ సెంటర్ నందు గత ప్రభుత్వ హయాంలో అనేక మెడికల్ దందాలు జరిగాయని TNSF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్కే నాయుడు, రాష్ట్ర నాయకులు చిన్న, AISF యూనివర్సిటీ అధ్యక్షులు రంజిత్ ఆరోపించారు. విద్యార్థులు ఏ అనారోగ్య సమస్యతో వెళ్లిన ఒకే రకమైన మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రిజిస్ట్రార్ భూపతి నాయుడుకి వినతి పత్రం అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

చిత్తూరులో నిన్న రాత్రి తనపై ఇద్దరు ఎమ్మార్వోలు దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపంజాణి, గంగవరం ఎమ్మార్వోలు ప్రసన్న, శివను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని బాకీ చెల్లించాలని అడిగినందుకు పదునైన ఆయుధంతో పొడిచాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కురబలకోట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుడు మదనపల్లె కనకదాస్ నగర్కు చెందిన నేతన్న శివ(25)గా గుర్తించారు. మహిళను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆమెను రుయాకు రెఫర్ చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.