Chittoor

News October 13, 2024

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ఆహ్వానం పలుకుతూ గరుడ పటాన్ని అవరోహణం చేయడమే ధ్వజావరోహణం అంటారు. ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

News October 13, 2024

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ,పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు జారీ చేశారు.

News October 12, 2024

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ,పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు జారీ చేశారు.

News October 12, 2024

శ్రీకాళహస్తి స్వామివారి సేవలో బాలకృష్ణ సతీమణి

image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిహెచ్ఓ నాగభూషణం, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

News October 12, 2024

చిత్తూరులో ప్రజా పరిష్కార వేదిక వాయిదా

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 15వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.

News October 12, 2024

TTDపై అభ్యంతరకరంగా పోస్ట్.. వ్యక్తిపై కేసు

image

TTD ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చైతన్య అనే వ్యక్తిపై తిరుమల 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం పట్టు వస్త్రాలను తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News October 12, 2024

మదనపల్లె: రైలు పట్టాలపై డెడ్ బాడీ

image

రైలు పట్టాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్రకలకలం రేపుతోంది. మదనపల్లె సీటీఎం రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని శనివారం వేకువజామున స్థానికులు గుర్తించారు. పట్టాల మధ్యలో మృతదేహం బోర్లపడి ఉంది. పక్కనే ల్యాప్‌టాప్ ఉంది. ఎక్కడైనా చంపి, ఇక్కడికి తీసుకొచ్చి పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 12, 2024

మరో మూడు రోజులు జాగ్రత్త: తిరుపతి కలెక్టర్

image

తిరుపతి జిల్లాలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. జిల్లాలోని డివిజన్, మునిసిపల్, మండల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

News October 11, 2024

ఏర్పేడు: Ph.D ప్రవేశాలకు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో 2024-25 విద్యా సంవత్సరానికి Ph.Dలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్ & క్లైమేట్ సైన్స్, హ్యుమానిటీస్& సోషల్ సైన్స్ విభాగాలలో అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. చివరి తేదీ నవంబర్ 03.

News October 11, 2024

నేను తిరుమలలో తప్పు చేయలేదు: మాధురి

image

చేయని తప్పుకు తాను క్షమాపణ చెప్పనని దివ్వెల మాధురి అన్నారు. తిరుమల పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడంతో స్పందించారు. ‘తిరుమలలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. దువ్వాడ గారితో చాలా మంది కార్యకర్తలు తిరుమలకు వెళ్లారు. నేనూ కార్యకర్తలాగే ఆయన వెంట వెళ్లా’ అని మాధురి చెప్పారు. తాను కొండపై ఎలాంటి తప్పు చేయలేదని.. తెలిసీతెలియక తప్పు జరిగి ఉంటే క్షమాపణ చెబుతున్నా’ అని దువ్వాడ అన్నారు.