India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలోని దాసర్లపల్లి-కుప్పం రహదారిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి, మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో మాట్లాడారు. జిల్లా బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువులను వధించిన, అక్రమంగా తరలించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పంచాయతీ స్థాయిలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లోని ఓఆయిల్ షాపు వద్ద ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన మాదం ప్రసాద్గా గుర్తించారు. మద్యంమత్తులో గుర్తుతెలియని వ్యక్తులు ప్రసాద్తో శుక్రవారం రాత్రి 2 గంటల వరకు గొడవపడి, వెంటబడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరచారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కేవీ పల్లి మండలంలోని గ్యారంపల్లె గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఆంగ్లంలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలని కోరారు.
యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళ హాస్యనటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య పెళ్లయిన విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైలోని ఓ ప్యాలెస్లో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తిరుపతి జిల్లాలో ఈనెల 16న ఆదివారం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ EOగా ఏవీ ధర్మారెడ్డిని నియమించారు. ఆయన రక్షణ శాఖకు చెందిన ఉద్యోగి. జగన్ సీఎం అయిన తర్వాత ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి తీసుకు వచ్చి మరి ఈవో పోస్టు అప్పగించారు. ప్రభుత్వం మారడంతో ఆయనపై వేటు పడింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును నూతన ఈవోగా నియమించింది.
చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాణిపాకం నుంచి బంగారుపాలేనికి బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఇరువారం జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టింది. సంక్రాంతిపల్లెకు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. లారీ రాంగ్ రూట్లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం, అనుచరులు అరాచకాలు, భూకబ్జాలు, గనుల దోపిడీ చేశారని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. విద్యుత్తు ఒప్పందాల్లోనూ అవినీతి జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వీటిపై సమగ్ర విచారణకు మూడు రకాల కమిటీలు వేయాలని.. పెద్దిరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
హైదరాబాద్లో వ్యభిచార ముఠా పోలీసులకు దొరికింది. విజయవాడకు చెందిన సూర్యకుమారి HYD మధురానగర్లో ఉంటోంది. అక్కడే ఆమెకు తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు. అతను కస్టమర్ల డేటా యాప్లో ఉంచుతాడు. యువతులకు డబ్బు ఆశ చూపి వాళ్లని వేణుగోపాల్ బాలాజీ(తిరుపతి) సహకారంతో కస్టమర్లు చెప్పిన హోటళ్లకు తీసుకెళ్లేవాడు. సూర్యకుమారి డబ్బులు తీసుకునేది. నిన్న పంజాగుట్టలోని ఓ హోటల్లో సోదాలు చేయగా దొరికిపోయారు.
Sorry, no posts matched your criteria.