India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TTD ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు శనివారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యాలయం పేర్కొంది. పీడియాట్రిక్ అసోసియేట్& అసిస్టెంట్, పీడియాట్రిక్ ఇంటెన్స్ విస్ట్ , అసిస్టెంట్ అనస్తీషియా మొత్తం 4 పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్సైట్ చూడాలన్నారు.
గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా వ్యవహరించారు. నారాయణ స్వామి డిప్యూటీ CM, ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలకమైన విద్యుత్తు, మైనింగ్ శాఖ.. రోజా పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా కేబినెట్లో ఎవరికీ చోటు లేకపోయినా.. కుప్పం నుంచి గెలిచిన CM చంద్రబాబు సాధారణ పరిపాలన, లాండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు ఉంచుకున్నారు.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్, యూనిట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ నెల15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు అర్హులన్నారు. ఆసక్తి గల వారు చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే మేళాకు హాజరుకావాలని ఆమె కోరారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15.
మదనపల్లెలో టీచర్ దొరస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి ఖాయం చేయడంతో దొరస్వామి కుమార్తే చపాతి కర్ర, ఇనుప అట్టతో కొట్టి చంపినట్లు తెలిపింది. హరితను పోలీసులు అదుపులోకి తీసుకుని,హత్యకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రేమ విషయమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రియుడితో కలిసి ఉండడాన్ని గమనించి తండ్రి మందలించారని..ప్రియుడితో కలిసి హత్య చేసి ఉంటుందని అంటున్నారు.
తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్పై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (RRR) ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మరో రెండు రోజుల్లో జగన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని RRR చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాను ఘన విజయం సాధించానని చెప్పారు. తనకు స్పీకర్ పదవి ఇస్తే స్వీకరిస్తానని.. ఇవ్వకపోయినా తనకు ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
ఆడుదాం ఆంధ్రా, CM కప్ పేరిట అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం CEO ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఆ రెండు కార్యక్రమాల పేరిట రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై విచారణ చేయాలని తాను CIDకి ఫిర్యాదు చేశానని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, IIITలో అడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలని కోరారు.
వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(TUDA) ఛైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు ప్రభుత్వం నిన్న ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడి పదవికి కూడా మోహిత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మదనపల్లెలో ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి <<13430375>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు మృతుని కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుమార్తే హత్యచేయించినట్లు సమాచారం అందగా..హత్య సమయంలో కూతురు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బాలుడితో పాటు ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ ఎస్సై షేక్షావలి తెలిపారు. గురువారం తిరుపతి గ్రామీణ మండలం రామాంజుపల్లి కూడలి వద్ద అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కర్ణాటకకు చెందిన జేహెచ్ భరత్, బెంగళూరు నగరానికి చెందిన కార్తీక్ అంజన్ కుమార్తోపాటు మరో బాలుడి నుంచి రూ.7,500 విలువైన 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.