Chittoor

News June 9, 2024

రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

image

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌ శోభారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో ఆమె రూ. 21,53,110వరకు నగదు అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపించిన ఉన్నతాధికారులు శోభారాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకున్నారు.

News June 9, 2024

ప్రజలు మార్పు కోరుకున్నారు: చెవిరెడ్డి

image

గత 5 ఏళ్లలో చంద్రగిరిలో ఎలాంటి అల్లర్లు జరగలేదని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. గెలిచిన వారు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. ‘అభివృద్ధిలో దేశానికి చంద్రగిరి ఆదర్శంగా నిలవడానికి రూ.950 కోట్లతో పనులు చేశా. 1600 KM పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నా. కానీ మార్పు కోరి TDPకి అవకాశం ఇచ్చారు. వారి తీర్పును గౌరవిస్తున్నా. నాకు లక్ష ఓట్లు వేశారు. వాళ్లు అందరికీ పాదాభివందనం’ అన్నారు.

News June 9, 2024

తిరుమల అడిషనల్ ఎస్పీ వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలి

image

తిరుమల అడిషనల్ ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న యం శివరామి రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆయనను వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీని వెంటనే పంపాలని, మరొకరిని ప్రత్నాయంగా ఏర్పాటు చేసుకోవాలని తిరుపతి ఎస్పీకి సూచించారు. ఈ ఉత్తర్వులపై బదిలీ చేశారా.. ఏదైన చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

News June 8, 2024

TPT: SV యూనివర్సిటీ నుంచి రామోజీరావుకు డాక్టరేట్

image

తిరుపతి : మీడియా మొగల్, రామోజీ గ్రూప్స్ సంస్థ అధినేత రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన తన జీవిత ప్రస్థానంలో అనేక పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఇందులో భాగంగా 1989వ సంవత్సరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ ను అందజేసింది.

News June 8, 2024

తిరుపతి: పదవులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా

image

తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. తుమ్మల గుంటలోని వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రజల కోసం కష్టపడ్డామని, 980 కోట్లరూపాయలతో చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. కరోనా కాలంలోనూ ప్రజలను ఆదుకున్నామని అన్నారు. పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

News June 8, 2024

తిరుపతి : శ్రీ సిటీలో 50 ఉద్యోగాలు

image

శ్రీ సిటీలోని NS ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. బీఎస్సీ, డిప్లమా, ఐటిఐ పూర్తి చేసిన, 26 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 50 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/8wFL3GvvGZjLi4oA9 వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 8, 2024

రామోజీ మరణం తీరని లోటు: రోజా

image

రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని మాజీ మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు. ‘రామోజీరావు గారి మరణం సినీ, పాత్రికేయ రంగానికి తీరనిలోటు. ఉషాకిరణ్‌లో పని చేసిన నాటి రోజుల నుంచి ప్రతి ఇంట నవ్వులు పూయించిన జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నా. వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. Rip Sir’ అని ట్వీట్ చేశారు.

News June 8, 2024

కురబలకోట: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్‌లో సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాషా కథనం మేరకు.. అర్ధరాత్రి కురబలకోట రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News June 8, 2024

చిత్తూరు జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. చిత్తూరు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి రేసులో పులివర్తి నాని, గాలి బానుప్రకాశ్, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉన్నట్లు అలికిడి వినిపిస్తోంది.

News June 8, 2024

చిత్తూరు: కరెంటు షాక్ కొట్టి చిన్నారికి తీవ్రగాయాలు

image

కరెంటు షాక్ కొట్టి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగింది. రెడ్డిస్ కాలనీకి చెందిన లలిత్ ఆదిత్య (10) ఇంటి మిద్దెపై కమ్మితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే వెళ్తున్న విద్యుత్తు లైనుకు తగిలించాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన బాలుడిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేశారు.