Chittoor

News October 1, 2024

తిరుపతి: చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చిన కలెక్టర్, MLA

image

తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ లో స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చీపుర కట్టలు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News October 1, 2024

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలు పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఆలయం వెలుపల టీటీడీ ఈవో జే. శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

News October 1, 2024

వెదురుకుప్పం: బొమ్మయపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

image

వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి సర్పంచి గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు దేవళంపేట వార్డు సభ్యుడు పయని డీపీవో, కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. నిధులు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ కావడంతో చెక్ పవర్ రద్దు చేసినట్టు అందులో పేర్కొన్నారు.

News October 1, 2024

చిత్తూరు: భవిత కేంద్రాల్లో ఖాళీలకు దరఖాస్తులు

image

భవిత కేంద్రాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బంగారుపాళ్యం, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, సోమల కేంద్రాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫిజియోథెరపీ డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల ఐదులోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు.

News October 1, 2024

తెలంగాణ DSCలో పలమనేరు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్

image

తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ-24 ఫలితాలలో పలమనేరుకు చెందిన తహసీనా ప్రతిభ చూపింది. తహసీనా 75.57 శాతం మార్కులతో ఉర్దూ మీడియంలో తొలి ర్యాంకు సాధించింది. విద్యార్థిని తండ్రి సుందర్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీఎస్పీ టాపర్‌గా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.

News October 1, 2024

చిత్తూరు: ‘నవంబర్ 15 లోపు అందజేయాలి’

image

ST గ్రామాలలో బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేనివారికి నవంబర్ 15లోపు అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం వాటి మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 588 హాబిటేషన్లో సుమారు 60 వేల మంది ఉన్నారని.. వారికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నట్టు కలెక్టర్ చెప్పారు. వాటిపై చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2024

తిరుపతి : రేపు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్/ సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మొత్తం 6 రకాల పోస్టులు 8 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు http://slsmpc.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 30, 2024

SVU : ఫీజు చెల్లించడానికి నేడు చివరి తేదీ

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.

News September 30, 2024

సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి

image

మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.

News September 30, 2024

మదనపల్లెలో టమాటా కిలో రూ. 60

image

మదనపల్లెలో టమాటా KG రూ.60 పలికింది. దిగుబడి తక్కువగా ఉండటంతో వ్యవసాయ మార్కెట్లో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధర రూ.1,500వరకు పలికిందని అధికారులు పేర్కొన్నారు. బయటరాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలేకపోవడంతో ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది. వారంరోజులుగా కిలో రూ.44నుంచి రూ.50 వరకు పలకగా ఆదివారం రూ.60 చేరింది.