EastGodavari

News September 2, 2025

కృష్ణునిపాలెంలో కోడి కత్తులతో దాడి.. నలుగురి అరెస్టు

image

గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని పెట్రోల్ బంకు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘర్షణలో గోకవరానికి చెందిన గేదెల శివ, రాయి అచ్చారావు, కామేష్, మహిపాల దుర్గాప్రసాద్ ఓసీ బంధ గ్రామానికి చెందిన జ్యోతి, భరత్‌పై కోడి కత్తులతో దాడిచేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలించి నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.

News September 2, 2025

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 2, 2025

‘ఇండియా స్కిల్స్ పోటీకి దరఖాస్తు చేసుకోవాలి’

image

ఈనెల 30లోపు ఇండియా స్కిల్స్ పోటీ ఏపీ-2025కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తూ.గో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీజీ మురళి మంగలవారం కోరారు. ఈ పోటీల్లో 63 స్కిల్ ట్రేడ్స్‌లో యువత తమ ప్రతిభను ప్రదర్శించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వరల్డ్ స్కిల్స్ 2025లో పోటీపడే అవకాశం పొందవచ్చారు. ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 2, 2025

తూర్పు గోదావరి జిల్లాకు 3వ స్థానం

image

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ మూల్యాంకనంలో తూ.గో జిల్లా వైద్య సేవల్లో 3వ స్థానాన్ని సాధించిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వర్ రావు సోమవారం తెలిపారు. కలెక్టర్ పి.ప్రశాంతి మార్గదర్శకత్వం, సూచనల మేరకు, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవడం వల్ల ఈ పురోగతి సాధ్యమైందని ఆయన అన్నారు. నిరంతరం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షల ఫలితమే ఈ ఘనత అని పేర్కొన్నారు.

News September 1, 2025

జిల్లాలో 93%కు పైగా పెన్షన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. మొత్తం 2,35,813 పెన్షన్లలో ఇప్పటివరకు 2,19,792 పెన్షన్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఇది 93.21 శాతానికి సమానమని ఆమె పేర్కొన్నారు. మొత్తం రూ. 102.83 కోట్ల నిధులలో, రూ. 95.52 కోట్లు లబ్ధిదారులకు అందించినట్లు వెల్లడించారు. మిగిలిన పెన్షన్ల పంపిణీ కూడా త్వరలో పూర్తవుతుందని ఆమె తెలిపారు.

News September 1, 2025

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: జేసీ

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకూడదని, నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్న రాముడు ఆదేశించారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవనంలో డి.ఆర్.ఓ. సీతారామమూర్తి, డి.ఎల్.డి.ఓ. పి. వీణాదేవితో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కార విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదని స్పష్టం చేశారు.

News September 1, 2025

తూ.గో జిల్లా: ఎస్పీ కార్యాలయానికి 28 ఫిర్యాదులు

image

తూర్పు గోదావరి జిల్లా పోలీసులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 28 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. అదనపు ఎస్పీ ఎన్‌బిఎమ్. మురళీకృష్ణతో కలిసి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారుల ద్వారా చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

News September 1, 2025

నిడదవోలు: వందే భారత్ రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

image

నిడదవోలు నుంచి సోమవారం వందే భారత్ రైలు ఢీ కొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు కంటి ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. నిడదవోలులో రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమె వయసు 65 ఏళ్లు ఉంటుందని, వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News September 1, 2025

తూర్పు గోదావరి: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

image

తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 1న పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి ఆదివారం తెలిపారు. మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్లు అందజేయనున్నామని వెల్లడించారు. ఇందులో 33,177 మంది వికలాంగులకు కూడా పంపిణీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

News August 31, 2025

దివ్యాంగులకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 1న జిల్లాలోని దివ్యాంగులకు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆమె ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 33,117 దివ్యాంగుల పెన్షన్లలో కేవలం 33 మంది మినహా మిగిలిన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.