India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం,పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనమయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.
తల్లి మరణించిన కాసేపటికి కొడుకు కన్నుమూసిన విషాద ఘటన తాళ్లరేవులో జరిగింది. మృతుడి భార్య 8ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నూకరాజుకు పక్షవాతం ఉండడంతో తల్లి కామేశ్వరి చేపల వ్యాపారం చేసి చూసుకొనేది. మంగళవారం రక్తపోటు రాగా ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. నూకరాజుకు తల్లిని చూపించి దహనసంస్కారాలకు తీసుకెళ్లారు. దీంతో కాసేపటికే కొడుకు కన్నుమూశారు.
అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు చేపట్టారు. దశమి, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాలు, రద్దీ రోజుల్లో శీఘ్ర దర్శనం రూ.200, ప్రదక్షిణ దర్శనం రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఈవో ఆదేశించారు. మధ్యాహ్నం మూడు తరువాతే రూ.300 ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించడం, సాధారణ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉమ్మడి తూ.గో జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కె.మాధురి డిప్యూటీ కలెక్టర్ ఎంపికైన సందర్భంగా గ్రామస్థులు అభినందన సభ నిర్వహించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోగా.. తల్లి ఉమామహేశ్వరి కష్టపడి చదివించారు. మాధురి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారని సర్పంచ్ మల్లేశ్వరి అన్నారు. గ్రామానికే పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఐఏఎస్ సాధించడమే తన ధ్యేయమని మాధవి అన్నారు.
తూ.గో జిల్లా వ్యాప్తంగా పశు సంచార వాహనాల్లో ఖాళీగా ఉన్న 5 పైలట్ పోస్టుల భర్తీకి ఈనెల 28న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రాజమండ్రి పశు వైద్యశాలలో శుక్రవారం 10AM నుంచి 2PM వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
☞ SSC పాసై ఉండాలి
☞ 2 (OR) 3ఏళ్ల అనుభవంతో హెవీ లైసెన్స్ ఉండాలి
☞ వయసు: 35 ఏళ్లలోపు
☞ డ్యూటీ టైమింగ్స్: 8AM-5PM
☞ వేతనం నెలకు రూ.12వేలు
డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో దర్శమమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ MLAలకు ఆయన శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని సమస్యలపై ఆయన దూకుడు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ అవగాహన కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్క తొలగింపునకు ఆమోదం లభించిందని గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ సతీశ్ కుమార్ సోమవారం తెలిపారు. మొత్తం 306 పనులకు రూ.20.76 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ. 31.50 కోట్లతో 430 పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించగా.. తొలి ప్రాధాన్యతగా 306 పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. మిగిలిన పనులకు త్వరలో నిధులు మంజూరు అవుతాయన్నారు.
సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే తూ.గో జిల్లా వ్యాప్తంగా 1,346 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!
తూ.గో జిల్లా గోపాలపురానికి చెందిన మాజీ మహిళా వాలంటీర్ సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. గోపాలపురంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ రాజీనామా చేసిన వాలంటీర్ భర్త 6 నెలల క్రితం మృతి చెందాడని బంధువులు తెలిపారు. దీంతో ఆమె జంగారెడ్డిగూడెంలో పుట్టింటికి వెళ్లింది. 3 నెలల నుంచి ఆరోగ్యం బాగోలేక పోవడంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి వైద్యం చేయించారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేదని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.
మైనర్ బాలికను గర్భవతి చేసిన నిందితునికి 15 సంవత్సరాల జైలు శిక్ష రూ.7వేల నగదు జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. అమలాపురం మద్దాల వారి పేటలో 2018 ఏప్రిల్ 2న తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలికకు మత్తు పానీయాలు ఇచ్చి గణపతి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు.
Sorry, no posts matched your criteria.