EastGodavari

News March 31, 2025

రాజమండ్రి: ముస్లిం సోదరులకు కలెక్టర్ శుభాకాంక్షలు

image

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తోటి వారికి, పేద వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే గొప్ప దాన గుణాన్ని చాటే పండుగ రంజాన్ అన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాస ఉపవాస దీక్షలు నియంత్రణా సాధ్యం చేసే గొప్ప సందేశం అని పేర్కొన్నారు.

News March 30, 2025

రాజమండ్రి: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

మార్చి 31 రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు .

News March 30, 2025

రాజనగరం: ‘ఉగాది’లో విద్యార్థులు

image

తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని స్థానిక దివ్య కళాశాల విద్యార్థులు శనివారం సాయంత్రం కళాశాల మైదానంలో ‘ఉగాది’ అక్షరాలుగా ఏర్పడి ఆ పండుగ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వీరి ఆకృతిని చూసేందుకు వచ్చిన అధ్యాపకులు, సహ విద్యార్థులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేశారు. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

News March 30, 2025

రాజమండ్రి: రహదారుల అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ.25 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో అత్యవసరమైన పనుల ప్రతిపాదనల జాబితాను శనివారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి అందజేశారు. పంచాయతీరాజ్ పరిధిలో గల గ్రామీణ రోడ్లలో అధ్వానంగా ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.

News March 30, 2025

రాజమండ్రి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రశాంతి

image

శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల కలయికతో ఉగాది పండుగ రోజు తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులుల కలయికతో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువుగా అనగా కారం, తిక్ అనగా చేదు, కషాయం, వగరులతో కలిసి ఉగాది అని అన్నారు.

News March 29, 2025

సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను అభివృద్ది చేయాలి: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులకు సంబంధించిన పనులు నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను హేతుబద్ధీకరణ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు.

News March 29, 2025

రాజమండ్రి: తప్పిన పెను ప్రమాదం..41 మంది సేఫ్

image

ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం భద్రచలం నుంచి రాజమండ్రికి బయలుదేరింది. బస్సు కూనవరం ఘాటీలో దుర్గమ్మ గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ ఫెయిలయ్యింది. గమనించిన డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలువరించాడు. బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ను ప్రయాణీకులు అభినందించారు.

News March 29, 2025

తూ.గో: పదో తరగతి పరీక్ష వాయిదా- DEO

image

ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. సోషల్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.

News March 28, 2025

అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

image

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.

News March 28, 2025

కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

image

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

error: Content is protected !!