India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆంధ్రపదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ప్రశంపా పత్రం స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు లభించింది.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షకు గైట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రెండు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రామానుజం, వైస్ ప్రిన్సిపల్ టి.రామారావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GIET కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,791 మంది పరీక్ష రాయనున్నట్టు పేర్కొన్నారు.
తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి మండిపడ్డారు. శనివారం దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి వయోవృద్ధుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్లో నమోదు అయ్యింది. కలెక్టర్ ఛాంబర్లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదుదారుడి సమక్షంలో కోర్టు నిర్వహించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ప్రతి నెల ఐదు వేలు చెల్లించాలని ఆదేశించారు.
‘అమ్మ వేరొకరితో ఉంటుంది. అతను మమ్మల్ని బెల్టుతో కొడుతున్నాడు. ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం. మా నాన్నకు అప్పగించండి, లేకుంటే అమ్మ మమ్మల్ని చంపేస్తుంది’ అంటూ రాజానగరం(M) కొంతమూరు చెందిన తేజకిరణ్ (10) భానుప్రకాశ్(8) అనే చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. గ్రామానికి చెందిన మహిళకు ప్రవీణ్కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడగా.. పిల్లలను పట్టించుకోకుండా వారిని కొడుతున్నారని SI నారాయణమ్మ తెలిపారు.
రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసి సెల్ఫోన్ అపహరించి, బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను తెనాలి జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిడుబ్రోలుకు చెందిన దేవర సాయి, యర్రంశెట్టి వంశీ కాకినాడ- తిరుపతి రైలులో ప్రయాణిస్తున్న సంతోష్ కుమార్ను కొట్టి సెలోఫోన్ దొంగిలించారు. ఈ కేసులో టెక్నాలజీ పరంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి జైలుకి తరలించారు.
గోకవరం మేజర్ గ్రామపంచాయతీ శివారులో వ్యభిచారం జరుగుతున్న గృహంపై ఎస్ఐ పవన్ కుమార్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రైడ్ చేశారు. ఈ రైడ్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మగవాళ్లు, ఆడవాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు బదిరెడ్డి పద్మావతిని అదుపులో తీసుకున్నారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జైలుకు పంపిస్తానని SI తెలిపారు.
నెల్లూరులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొవ్వూరుకు చెందిన జోసఫ్, కైకలూరుకు చెందిన శ్రావణి 21న నెల్లూరు సింహపురి హోటల్లో రూము తీసుకున్నారు. తర్వాత రోజు బయటకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రూము నుంచి బయటకు రాలేదు. విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం వరకు బయటకు రాకపోవడం, రూము నుంచి దుర్వాసన వెదజల్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా చేశారని సమచారం.
నెల్లూరులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొవ్వూరుకు చెందిన జోసఫ్, కైకలూరుకు చెందిన శ్రావణి 21న నెల్లూరు సింహపురి హోటల్లో రూము తీసుకున్నారు. తర్వాత రోజు బయటకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రూము నుంచి బయటకు రాలేదు. విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం వరకు బయటకు రాకపోవడం, రూము నుంచి దుర్వాసన వెదజల్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా చేశారని సమచారం.
జిల్లా డీపీఆర్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోని తీసుకుని వెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ డీపీఆర్వోకి సూచించారు.
నెల్లూరులో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. తూ.గో: కొవ్వూరుకు చెందిన జోసఫ్ రత్నకుమార్, ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణి 4రోజుల కిందట నెల్లూరులోని సింహపురి హోటల్లో గదిని తీసుకున్నారు. శుక్రవారం రూము నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టగా కుళ్లిన స్థితిలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. 3రోజుల కిందటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.