EastGodavari

News August 25, 2024

నేడు తూ.గో జిల్లాలో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

image

తూ.గో జిల్లాలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా పనిచేస్తాయని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కే.తిలక్ కుమార్ ప్రకటించారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు. ఏపీ ఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో కూడా చెల్లించవచ్చునని తెలిపారు.

News August 25, 2024

ఏలేరు ప్రాజెక్టులోకి 1,622 క్యూసెక్కుల వరద నీరు

image

ఏలేశ్వరం మండలంలోని ఏలేరు ప్రాజెక్టులో జలకళ ఉట్టిపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు 1,622 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో శనివారం 86.56 మీటర్లకు 82.80 మీటర్లు, 24.11 టీఎంసీలకు 17.08 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నాయి. ఆయకట్టుకు 400, విశాఖకు 300 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

News August 25, 2024

కోల్‌కతా ఘటపై NHRCని ఆశ్రయించి అమలాపురం న్యాయవాది

image

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురానికి చెందిన న్యాయవాది కుడిపూడి అశోక్ శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)ను ఆశ్రయించారు. వైద్యురాలిని హింసించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు విచారణ సక్రమంగా సాగటం లేదన్నారు. నిందితులకు రాజకీయ పక్ష నేతలు రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు.

News August 24, 2024

తూ.గో: మరో అల్పపీడనం.. వర్షాలకు ఛాన్స్

image

తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. కాకినాడ జిల్లాలో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించింది. SHARE IT..

News August 24, 2024

తూ.గో: స్కూటీని ఢీకొన్న లారీ.. టీచర్ దుర్మరణం

image

కొవ్వూరు మండలం దేచెర్ల చెరువు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దేవరపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు మహిళ రాజమండ్రికి చెందిన రాజ్యలక్ష్మి (హిందీ టీచర్)గా తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

News August 24, 2024

తూ.గో: తగ్గిన చికెన్ అమ్మకాలు

image

శ్రావణమాసం, విష జ్వరాలతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగం జరిగేదని, ప్రస్తుతం అది సగానికి పరిమితం అయ్యిందని వ్యాపారస్థులు వాపోయారు. అమ్మకాలు తగ్గడంతో ధరలు పడిపోయాయని అంటున్నారు. కిలో బాయిలర్ చికెన్ ధర రూ.350 నుంచి రూ.185కి, రూ.167 పలికిన లైవ్ ధర రూ.90కి పడిపోయింది.

News August 24, 2024

పిఠాపురం MLAపై అభ్యంతరకర పోస్టులు.. ఉద్యోగి సస్పెండ్

image

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టి ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించిన సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ రవిశంకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరుకు చెందిన చౌదరి ఇతనిపై కమిషనర్‌కు, మంత్రికి ఈ నెల 21న ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొవ్వూరు నుంచి బదిలీపై విజయవాడకు వెళ్లారు.

News August 24, 2024

యానాం: గోదావరిలో దూకి యువతి గల్లంతు

image

గుర్తు తెలియని యువతి యానాం రాజీవ్ రివర్ బీచ్‌లోని ఎన్ఈసీ జెట్టి సమీపంలో శుక్రవారం గోదావరిలో దూకినట్లు స్థానికులు తెలిపారు. ఆమె వయసు18 – 20 ఏళ్ల మధ్య ఉంటుందని, దూకుతుండగా ఓ వ్యక్తి గమినించి అడ్డగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై మురుగానందన్ తెలిపారు.

News August 24, 2024

మృతుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత

image

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి మృతుడి భార్య సాయి దుర్గకు చెక్కు అందజేశారు.

News August 24, 2024

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్: కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు ఫిర్యాదు నమోదుకు 1800 4252540, 0883241 7711 కు ఫోన్ చేసి తెలపాలన్నారు. జిల్లాలో పెండ్యాల, పందలపర్రు స్టాక్ యార్డ్‌ల వద్ద వినియోగదారులకు అందించేందుకు ఇసుక సిద్ధంగా ఉందన్నారు.