India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి మృత్యువాత పడిన మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకకు చెందిన ఎం.సతీష్ మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. మృతుడి భార్య నాగమణి, తల్లి పద్మావతి, తండ్రి శ్రీనివాసరావు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఉన్న దిక్కును కోల్పోయామంటూ తీవ్రంగా రోధించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రభుత్వం తరఫున సతీష్ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందించారు.
రాష్ట్రలో ఉన్న 13,226 విలేజ్లలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సింపుల్ గవర్నమెంట్, సింపుల్ గవర్నెన్స్ విధానంలో పనిచేసే సాదా సీదా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వమని ఉద్గాటించారు. 2014-19 స్వర్ణ యుగం, 2019-24 చీకటి యుగం అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక వరమని వానపల్లి సభా వేదికగా సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పోలవరంను దుర్మార్గుడైన జగన్ గోదావరిలో కలిపేశారని, డయాఫ్రం వాల్ నాశనమైందని, కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. తొందర్లోనే పోలవరంను పూర్తి చేస్తామన్నారు.
తూ.గో జిల్లాలో బాలికలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలో పోలీసులు వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక నంబర్ 9490760794 లేదా 112 నెంబర్ల ద్వారా 24 గంటలు వారికి అందుబాటులో ఉంటున్నామన్నారు.
భావనగర్ – కాకినాడ పోర్టు (12756) రైలును వచ్చే నెల 7, 14, 21, 28 తేదీల్లో దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లాల్సిన రైలును విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా దారి మళ్లించినట్లు వివరించారు.
అన్నవరం దేవస్థానంలో పెళ్లిసందడి నెలకొంది. స్వామి సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ముహుర్తాల్లో దాదాపు వంద వివాహాలు జరిగాయి. సత్యగిరిపై విష్ణు సదన్, ఉచిత కల్యాణ మండపాలు, రత్నగిరిపై ఆలయ ప్రాంగణాలు, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, పాత, కొత్త సెంటినరీ కాటేజీ ప్రాంగణాల్లో వివాహాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామానికి చెందిన కొప్పర్తి గణేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద పార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. సీఎం చంద్రబాబు రూ.కోటి పరిహారం ప్రకటించడంతో నిన్న అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) గా అల్లూరి వెంకట సుబ్బరాజు గురువారం రాజమండ్రిలో బాధ్యత స్వీకరించారు. 1989 బ్యాచ్ కు చెందిన అల్లూరి వెంకట సుబ్బరాజు గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) గా నియమితులయ్యారు.
గ్రామ సభలను విజయవంతం చేసేందుకు ప్రజలను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తూ.గో కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి గ్రామసభల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో సభలను నిర్వహించాలని, ఇందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పటవల రాఘవేంద్రపురం సమీపంలో యానాం వైపు వెళ్తున్న బైక్ను కాకినాడ వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజులూరు మండలం జగన్నాథగిరికి చెందిన మణికంఠ(31) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామంలో పైడా కళాశాల సమీపంలో ఓ వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.