EastGodavari

News May 13, 2024

పిఠాపురంలో గందరగోళ పరిస్థితి..?

image

కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఓటర్లు మండిపడుతున్నారు. ఈవీఎంలలో గుర్తులు సరిగా కనిపించడం లేదని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో కనీసం విద్యుత్ సరఫరా లేదని వారు ఆరోపించారు.

News May 13, 2024

రాజవొమ్మంగిలో మోరాయించిన ఈవీఎంలు

image

ఏజెన్సీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజవొమ్మంగి మండలంలోని 75, 76 పోలింగ్ కేంద్రాలలో ఇప్పటివరకు ఈవీఎంలు మోరాయించడంతో ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం ఈవీఎంలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని పోలింగ్ ఆఫీసర్లు వెల్లడించారు.

News May 13, 2024

తూ.గో: నేడే పోలింగ్.. ఈ నంబర్స్ గుర్తుంచుకోండి

image

తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950

News May 13, 2024

REWIND: 2019లో 100% పోలింగ్ ఇక్కడే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం పెరిగింది. 80% నమోదైంది. అత్యధికంగా అనపర్తిలో 87.48%, అతి తక్కువగా రాజమండ్రి సిటీలో 66.34% నమోదైంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పగడాలపేట ప్రాంతంలోని 109వ పోలింగ్ కేంద్రంలో 100% పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. ఈసారి విదేశాలు, ఇతర పట్టణాల్లో ఉన్నవారు భారీగా తరలివస్తున్నారు. వారంతా ఓటువేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది.

News May 13, 2024

తూ.గో: నేడే పోలింగ్.. ఈ నంబర్స్ గుర్తుంచుకోండి

image

తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950

News May 13, 2024

కాట్రేనికోన: మరపడవపై ఎన్నికల సామగ్రి తరలింపు

image

కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పరిధిలోకి మగసానితిప్ప దీవిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌కు ఎన్నికల సామగ్రిని అధికారులు మరపడవపై తరిలించారు. బలుసుతిప్ప నుంచి మగసానితిప్పకు చేరుకోవడానికి ఉప్పుటేరు వెంబడి గోదావరి నదీపాయలో గంటసేపు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. 

News May 13, 2024

తూ.గో: సార్వత్రిక ఎన్నికలు.. సర్వం సన్నద్ధం

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 3,608 బ్యాలెట్ యూనిట్లు, 3,608 కంట్రోల్ యూనిట్లు, 4002 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3,860 బ్యాలెట్ యూనిట్లు, 3,860 కంట్రోల్ యూనిట్లు, 4,170 వీవీప్యాట్లు వాడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,040 బ్యాలెట్ యూనిట్లు, 2,040 కంట్రోల్ యూనిట్లు, 2,203 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు.

News May 13, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు వారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

GET READY తూ.గో. జిల్లా

image

సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాలు, 3 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.

News May 12, 2024

కాకినాడ: పవన్ ఓటేసేది ఎక్కడంటే..?

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం MLA అభ్యర్థిగా పోటీచేస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదుకానందు వల్ల తనకు తానే ఓటు వేసుకోలేని విషయం తెలిసిందే. కాగా ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అక్కడ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.