India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ కిండంగి గ్రామానికి చెందిన గిరిజనులు ఓటు వేయాలంటే 8 కి.మీ నడవాల్సి ఉంటుంది. కొండపైన ఉన్న ఈ గ్రామంలో మొత్తం 51 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 27 మంది పురుషులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 4 కి.మీ దూరంలో ఉన్న లోదొడ్డి గ్రామానికి వచ్చి తిరిగి వారి గ్రామానికి వెళ్ళాలి. మొత్తం 8కిమీ నడక తప్పదని గ్రామస్తులు తెలిపారు.
గోదావరిలో మునిగి చనిపోయిన ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన ముగ్గురి డెడ్బాడీలు లభ్యమయ్యాయి. పల్లూరి సత్యఅనంతలక్ష్మి(40), కప్పిరెడ్డి ఏసమ్మ(60), కర్రీ సునీత శనివారం వాడపల్లి వెంకటేశ్వరాలయానికి గోదావరి పాయలోంచి నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో మడికి వద్ద వాడపల్లిలంక సమీపంలో వారు <<13231697>>నీటిలో మునిగిన సంగతి <<>>తెలిసిందే. మృతదేహాలు లభ్యం కాగా.. SI శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మరొకరి ఆచూకీ తెలియరాలేదు.
ఉమ్మడి తూ.గోలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. అనపర్తి-87.4, రాజానగరం-87.4, రామచంద్రపురం-87.1, మండపేట-86.9, జగ్గంపేట-85.6, కొత్తపేట-84.4, ముమ్మిడివరం-83.6, తుని-83.2, అమలాపురం-83.1, గన్నవరం- 82.4, పత్తిపాడు-81.3, పిఠాపురం-81.2, పెద్దాపురం-80.6, రాజోలు- 80, రంపచోడవరం-77.4. రాజమండ్రి రూరల్-74.2, కాకినాడ రూరల్-74, కాకినాడ సిటీ-67, రాజమండ్రి సిటీ-66.2. ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి.
తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం – 1950
ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆదివారం అక్కడ పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి కాలినడకన వస్తుండగా.. గౌతమి గోదావరిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన మహిళలుగా స్థానికులు గుర్తించారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆదివారం అక్కడ పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎలక్షన్ విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్యారు. గంగవరం మండలం బియ్యంపాలెం ఎంపీపీ స్కూల్ టీచర్ తమన్నదొర శనివారం సాయంత్రం తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో పాడేరు వెళ్తున్నారు. అడ్డతీగల మండలం వీరభద్రాపురం సమీపంలో తమన్నదొరకు ఫిట్స్ రాగా.. స్థానిక యూటీఎఫ్ నాయకులు ఆర్వో ప్రశాంత్ కుమార్కు సమాచారం ఇచ్చారు. అధికారుల అనుమతితో ఇంటికి చేర్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా తూ.గో జిల్లాలోని సాధారణ ప్రజలకు దొరికిన ఉపాధికి ఈ వారాంతంలో బ్రేక్ పడింది. అభ్యర్థులు తమ ప్రచారాల కోసం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలను సమీకరించారు. కూలి చెల్లించి తమ వెంట తిప్పుకున్నారు. పూల వ్యాపారులతో మొదలై, టెంట్లు, టీ, టిఫిన్ సెంటర్లకు సైతం తాజా ఎన్నికల నేపథ్యంలో కొంత ఆదాయం లభించింది. ప్రచార పర్వానికి తెరపడటంతో ఇప్పుడు ఆ ఉపాధికి బ్రేక్ పడింది.
తూ.గో జిల్లా కడియం మండలం కడియపుసావరంలో శనివారం రాత్రి ఓ వ్యక్తి నగదు పంపిణీ చేస్తున్నాడని స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సీఐ తులసీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి పరిశీలించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.64 వేలు స్వాధీనం చేసుకుని, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.