India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లవరం మండలం రెల్లుగడ్డ శివారులోని ఎలువుల్లంకకు చెందిన నాగేశ్వరరావు తన భార్య లక్ష్మిపై సోమవారం కత్తితో దాడి చేశాడు. ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల కింద వీరికి నాగేశ్వరరావుతో లక్ష్మికి వివాహమైంది. 10 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా కొడుకు, కూతురుతో అమలాపురంలో ఉంటుంది. ఇటీవలే కొడుకు పెళ్లి జరిగింది. ఆదివారం స్వగ్రామంలో రిసెప్షన్ జరిగింది. అక్కడి నుంచి వెళ్తుండగా దాడి చేశాడు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై మాజీ MLA ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ MLA కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. కక్షసాధింపు చర్యలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తనను లక్ష్యంగా చేసుకొని పెడుతున్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంట్లో వివాహిత, యువకుడు<<13894976>> ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. SI రఘునాథరావు వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన నానాజీ (25), సాయిప్రసన్న(22) ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. నానాజీ తల్లిదండ్రులతో కలిసి స్థానిక టవర్ కాలనీలో ఉంటూనే, జగనన్న కాలనీలో సాయిప్రసన్నతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉరేసుకొని చనిపోయారు. కేసు నమోదుచేసి, విచారణ చేస్తున్నామని SI తెలిపారు.
సీబీఎస్ఈ విధానంలో విద్యార్థులు సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ట్యాబుల్లో అప్లోడ్ చేసిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో పరీక్షలను రెండోసారి వాయిదా వేశారు. మొదట ఈ నెల 12 నుంచి 17 వరకు, రెండవ సారి సోమవారం నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాయిదా వేయక తప్పలేదు. సాంకేతిక కారణాలతో వాయిదా వేశామని DCEB కార్యదర్శి వెంకట్రావు తెలిపారు.
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సోమవారం సాయంత్రం 2,75,642 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.50 అడుగులుగా ఉందన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 13,800 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమానికి 40 దరఖాస్తులు అందాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలు, జిల్లాకు చెందిన పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు అందజేశారన్నారు. దరఖాస్తులను మంగళగిరి జనసేన కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు.
కాకినాడ జిల్లాలో రాఖీ పండగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడలోని దుమ్ములపేటలో అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి మృత్యువాత పడింది. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట సమీపంలోని కొత్తమూలపేట వద్ద ప్యాసింజర్ ఆటోను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పరపల్లి దేవి(11) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలోని మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంట్లో వివాహిత, యువకుడు ఉరివేసుకుని అనుమానాదస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు ఆరా తీశారు. మృతులు కె.ప్రసన్న, పి.నానాజీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సుమారు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ ఘటన జరిగింది. గోకవరం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెద్దాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు చేరుకునేసరికి పెద్ద ఎత్తున పొగలు వెలువడినట్లు ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తంగా బస్సును పక్కకి నిలిపి ప్రయాణికులను కిందికి దింపేశారు.
ఫొటో రెండక్షరాల జ్ఞాపకం. అప్పుడు నువ్విలా ఉండేవాడివిరా… ఆ రోజు మనమెళ్లింది ఇక్కడికేరా.. మన ఊరు ఒకప్పుడు ఇలా ఉండేది.. మొదటిసారి మనం సినిమాకెళ్లినప్పడు.. అంటూ ఫ్రెండ్స్తో గుర్తుచేసుకునే వేల జ్ఞాపకాలకు.. లక్షల మధుర స్మృతులకు వేదిక ఫొటో. ఆనాటి ఎన్నో క్షణాలను కళ్లముందుంచే ఆయుధమే చిత్రం. మరి మీకు గుర్తుండిపోయే చిత్రం ఎక్కడ, ఎవరితో తీసుకున్నారో పంచుకోండి.
– నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.
Sorry, no posts matched your criteria.