EastGodavari

News May 12, 2024

తూ.గో.: ఓటింగ్ శాతం పెంచుదాం

image

తూ.గో. జిల్లాలో గత 2 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 78.5 శాతం పోలింగ్ జరగగా.. 2019 ఎన్నికల్లో 80.08 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో మరింత పెంచేలా ఓటర్లుగా
మనం ముందుకెళ్దాం.
– ఇంతకీ గత 2 ఎన్నికల్లో మీరు ఓటు వేశారా..?

News May 11, 2024

తూ.గో.: ‘13న పరీక్ష 22 రోజులకు రిజల్ట్.. జాబ్ కొట్టేదెవరో?

image

రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి తూ.గో.లో 19 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 234 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.

News May 11, 2024

ద్వారంపూడికి పవన్ మాస్ వార్నింగ్

image

కాకినాడ సిటీలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నీ సంగతి చూస్తా.. నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టావు, ప్రకృతి వనరులను దోచేశావు, పచ్చని మడ అడవులను నరికేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి నిన్ను రోడ్డుమీదికి లాక్కొస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.

News May 11, 2024

వంగా గీతను డిప్యూటీ CM చేస్తా: జగన్

image

పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ CM చేసి పంపిస్తానని CM జగన్ అన్నారు. పిఠాపురం సభలో ఆయన మాట్లాడుతూ.. గాజువాక, భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం వచ్చిన వ్యక్తికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందా అంటూ పవన్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు

News May 11, 2024

పిఠాపురంలోకి జగన్ ENTRY

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పిఠాపురం చేరుకున్నారు. ప్రచారంలో చివరి సభ కావడంతో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ నేపథ్యంలో ఆయనపై ఏమైనా విమర్శలు చేస్తారా అన్నదానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News May 11, 2024

కాసేపట్లో పిఠాపురానికి CM జగన్

image

సీఎం జగన్ మోహన్ రెడ్డి పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితమే కైకలూరులో పర్యటించి అక్కడి నుంచి పిఠాపురం బయలుదేరారు. జనసేన అధినేత పవన్ పిఠాపురం నుంచే బరిలో ఉండటం, జగన్ ప్రచార ముగింపు సభ కావడంతో సీఎం ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News May 11, 2024

పిఠాపురానికి నేడు జగన్.. రామ్‌చరణ్

image

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. పిఠాపురంలో క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. పూజల అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

News May 11, 2024

తూ.గో.: నేడే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.
– మన తూ.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

News May 10, 2024

తూ.గో.: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో తూ.గో. జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరోవైపు జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీచేయడంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

News May 10, 2024

టార్గెట్ పిఠాపురం.. జగన్ ఫిన్షింగ్ టచ్..?

image

ఏపీలోనే పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిపోయారు. అదే రిజల్ట్ ఈసారి పిఠాపురంలోనూ రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుండగా.. సీఎం జగన్ తన ప్రచారాన్ని పిఠాపురంలో ముగించనున్నట్లు సమాచారం. సీఎం ఫిన్షింగ్ టచ్ ఇస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే భావనలో ఉన్నారట.