EastGodavari

News August 19, 2024

పిఠాపురం: వర్మ మాటలు వక్రీకరణ.. పోలీసులకు ఫిర్యాదు

image

ఇటీవల కాకినాడ జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో మాజీ MLA వర్మ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను వక్రీకరించి ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే దాన్ని పలు యూట్యూబ్ ఛానల్స్ సొంత ప్రయోజనాల కోసం వర్మ మాటలు వక్రీకరించి కథనాలు ప్రచురించారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News August 19, 2024

సోనూసూద్ సాయం.. అమలాపురం కుర్రోడు అమెరికాకు

image

సినీ నటుడు సోను సూద్ అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయంతో అమలాపురం టౌన్‌కు చెందిన విద్యార్థి పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాడు. పంజాబ్‌లోని లూథియానా సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేశాడు. తద్వారా జే-వన్ వీసాపై హాస్పిటాలిటీ స్టూడెంట్ ఎక్సేంజ్ విజిటర్‌గా 12నెలలు అమెరికా వెళ్లనున్నాడు. కాగా అతను చిరు వ్యాపారి కుమారుడు.

News August 19, 2024

తూ.గో.: నేటి నుంచి విద్యార్థులకు CBSE పరీక్షలు

image

విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు సీబీఎస్ఈ విద్యావిధానంలో నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు సీబీఎస్ఈ సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 15, కాకినాడ జిల్లాలో 33, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 12 చొప్పున మొత్తం 60 పాఠశాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

News August 19, 2024

రాజమండ్రి: సముద్రంలోకి 2.47 లక్షల క్యూసెక్కుల నీరు

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం 2.47 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 13,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజీ వద్ద 9.90 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని వివరించారు.

News August 19, 2024

తూ.గో.: అశ్లీల నృత్యాలు.. ఐదుగురు అరెస్ట్

image

తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెం శివారు తోటలో అశ్లీల నృత్యాలు నిర్వహించిన కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని CI శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. నిందితులు సురేష్ బాబు, యువరాజు, సుబ్బారావు, దుర్గాప్రసాద్, దుర్గా శ్రీనివాసులను రిమాండ్ కు తరలించామని చెప్పారు. ప్రధాన నిందితుడు సురేష్ బాబుపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు అయ్యాయన్నారు.

News August 19, 2024

చేనేత మండలి పునరుద్ధరణకై MPకి వినతి

image

రద్దు చేసిన చేనేత మండలిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అమలాపురం పార్లమెంట్ టీడీపీ బీసీ సాధికార కమిటీ కన్వీనర్ కొండా జగదీశ్వరరావు ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని, ఏ విధమైన షరతులు లేకుండా రివైజ్డ్ రీఫామ్స్, రీ కన్స్ట్రక్షన్స్ స్కీములను ప్రవేశ పెట్టాలని కోరారు. ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి వర్క్ షెడ్ నిర్మించాలని కోరారు.

News August 18, 2024

పోలవరం ఫైళ్ల దహనం కేసులో ఉద్యోగుల సస్పెండ్

image

పోలవరం ఎడమ, కుడి కాలువ (ఎల్ఏ) కార్యాలయ ఫైళ్ల దహనం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ తూ.గో కలెక్టర్ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్లు కుమారి, సత్యదేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

News August 18, 2024

బహ్రెయిన్‌లో కోనసీమ యువకుడి ఆత్మహత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకకు చెందిన నాగులపల్లి వీర వెంకట దుర్గానాగసాయి(22) బహ్రెయిన్‌లో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులకు సమాచారం అందింది. మృతుడి మేనమామ ఉండపల్లి రమేశ్ ఆదివారం ఈ విషయం తెలిపారు. గత నెల 29న పెట్రోల్ బంక్‌లో పని చేసేందుకు నాగ సాయి వెళ్లాడన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని, విచారణ జరిపించాలని, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరారు.

News August 18, 2024

కాకినాడ: మహిళ మృతదేహం కలకలం.. UPDATE

image

ఏలేశ్వరం మండలం మర్రివీడు సమీపంలోని ఏలేరు కాల్వలో గుర్తుతెలియని మహిళ <<13882912>>మృతదేహం<<>> కలకలం రేపిన విషయం తెలిసిందే. శనివారం తల, కాళ్లు, చేతులు లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉంది. అయితే మృతదేహానికి సంబంధించిన తలను అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామ శివారు కాలువలో పోలీసులు ఆదివారం గుర్తించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

News August 18, 2024

పిఠాపురంలో జనసేనాని కొత్త కార్యక్రమం రేపటి నుంచే

image

పిఠాపురం నియోజకవర్గంలో ‘జనసేన జనవాణి’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చేబ్రోలులోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వగృహం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనవాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. దీన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.