EastGodavari

News August 18, 2024

కాకినాడ: కాళ్లు, చేతులు లేకుండా మొండెం

image

ఏలేశ్వరం మండలం మర్రివీడు సమీపంలోని ఏలేరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. తల, కాళ్లు, చేతులు లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉంది. దీంతో హత్యేననే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వయస్సు 30 నుంచి 35 ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News August 18, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి నీటి విడుదల

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం 2.05 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 14,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.80 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

News August 18, 2024

తూ.గో.: వయస్సు 19 ఏళ్లు.. కేసులు 25

image

రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామానికి చెందిన పలివెల ప్రభుకుమార్ అలియాస్ ప్రభు (19) రాజమండ్రిలోని సంతోష్‌నగర్‌లో ఉంటున్నాడు. కాగా అతనిపై ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 25 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒంగోలులో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి, రాజానగరం, రాజోలు ప్రాంతాల్లోనూ కేసులు నమోదైనట్లు
ఆ జిల్లా SP దామోదర్ తెలిపారు.

News August 18, 2024

పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరిగేలా పనిచేయాలి: ఎస్పీ

image

సైబర్ క్రైమ్స్, మహిళలపై జరిగే దాడుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసు అధికారులకు తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నెలవారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలలో పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం, అవిశ్వాసం పెంపొందించే విధంగా పనిచేయాలని సూచించారు.

News August 17, 2024

కోనసీమ: సహోద్యోగినితో అసభ్యప్రవర్తన.. సస్పెండ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ రాంజీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు MPDO సరోవర్ తెలిపారు. సచివాలయంలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న యువతి పట్ల రాంజీ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఈ నెల 1న అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో రాంజీని సస్పెండ్ చేశారన్నారు.

News August 17, 2024

కాకినాడ: LOVE.. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్

image

తునిలో విషాద ఘటన జరిగింది. ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని శివారులోని పెద్ద రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎస్‌.అన్నవరం గ్రామానికి చెందిన వడ్లమూరి భాను(22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

News August 17, 2024

రంప: 108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

image

చింతూరు మండలం వంకలగూడెం గ్రామానికి చెందిన పార్వతికి పురిటి నొప్పులు రావడంతో ఏడుగురాళ్లపల్లి PHCకి తీసుకెళ్లేందుకు కుటుంబీకులు 108లో బయలుదేరారు. మార్గం మధ్యలో వాహనం రిపేర్‌కు గురై ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న PHC వైద్యాధికారి విశ్వచైతన్య వాహనం వద్దకు వచ్చి పురుడు పోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు.

News August 17, 2024

తూ.గో.: సముద్రంలోకి నీటి విడుదల

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 1,96,143 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరిందన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు.

News August 17, 2024

నేడు కాకినాడలో జాబ్‌మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం (నేడు) జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నవోదయ టెక్నిక్స్, ఎస్బీ ఇన్సూరెన్స్, సంగీత మొబైల్స్ సంస్థలు 100 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. పదవ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు హాజరుకావచ్చని తెలిపారు.

News August 16, 2024

గోదావరిలో మునిగిన యువకుడు.. రక్షించిన స్థానికులు

image

పామర్రు మండలం కోటిపల్లి వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరు గల్లంతైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కందుల నరేంద్ర, కంచిమర్తి అంజి ద్రాక్షారామం నుంచి కోటిపల్లి గోదావరికి స్నానానికి వెళ్లారు. పుష్కర్ ఘాట్ వద్ద స్నానం ఆచరిస్తూ నరేంద్ర గోదావరిలో మునిగిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు ప్రమాదంలో ఉన్న అంజిని కాపాడారు.