EastGodavari

News May 8, 2024

తూగో జిల్లాలో జోరుగా ఎన్నికల బెట్టింగులు

image

తూ.గో జిల్లాలో ఎన్నికల్లో అభ్యర్థుల విజయంపై పందేలు కడుతున్నారు. మండల స్థాయిలో మెజార్టీలు నుంచి రాష్ట్రస్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందన్న విషయంపై పందేలకు తెరలేపారు. రాష్ట్రంలో హాట్ సీట్‌గా మారిన పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లతో సై అంటున్నారు.దీనిపై పోలీసులు కూడా నిఘా పెట్టినట్లు సమాచారం.

News May 8, 2024

ప్రత్తిపాడు అభ్యర్థి గెలుపుకోసం నటుడు ప్రచారం

image

ప్రత్తిపాడు నియోజకవర్గ  కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్య ప్రభని గెలిపించాలని కోరుతూ ప్రత్తిపాడులో ప్రముఖ సీరియల్ నటుడు ఇంద్రనీల్ వర్మ మంగళవారం ఇంటింటా ప్రచారం  నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సత్య ప్రభను, ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.

News May 7, 2024

తూ.గో.: దంచికొడుతున్న వర్షాలు.. మీ వద్ద పరిస్థితి ఏంటి..?

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన జిల్లావాసులు వర్షానికి కొంత ఉపశమనం పొందారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, వీ.ఎల్ పురం సెంటర్ నీటి మునిగాయి. కొన్నిప్రాంతాల్లో రైతులు ఆరబెట్టిన వరిధాన్యం తడిచిపోయింది.  – మీ వద్ద పరిస్థితి ఎలా ఉంది..?

News May 7, 2024

తూ.గో.: ప్రచారంలో సెలబ్రటీలు.. ప్రభావం ఏ మేర..?

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానపార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వారి తరఫున ప్రచారం చేసేందుకు సినీనటులు రావడంతో గోదారి జిల్లా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండటంతో ఆయన తరఫున మెగాహీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నారా రోహిత్ ఇప్పటికే ప్రచారం చేయగా.. జబర్దస్త్ ఫేమ్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
– మరి వీరి ప్రభావం ఏమైనా ఉంటుందా..?

News May 7, 2024

తూ.గో: ALERT.. ఈ ప్రాంతాల్లో పిడుగులకు ఛాన్స్

image

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.

News May 7, 2024

తూ.గో: ALERT.. ఈ ప్రాంతాల్లో పిడుగులకు ఛాన్స్

image

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.

News May 7, 2024

రాజోలు వైసీపీ అభ్యర్థి గొల్లపల్లికి అస్వస్థత

image

రాజోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో సోమవారం ఆయన అస్వస్థతకు గురి కాగా.. మలికిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఎండల ప్రభావంతో రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న గొల్లపల్లి సూర్యారావును ఆసుపత్రిలో చేర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎటువంటి అధైర్యానికి గురికావద్దని సూర్యారావు కోరారు.

News May 7, 2024

మృత్యుశకటాలైన బైక్, లారీ.. ఇద్దరు మహిళలు బలి

image

వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం హైవేపై బైక్ ఢీకొనడంతో పెరవలికి చెందిన చిన వెంకమ్మ(52) మృతి చెందింది. ఈమె ప్లాస్టిక్ సామగ్రి విక్రయిస్తుంటుంది. పిఠాపురంలో లారీ ఢీకొని పంపాదమ్మ(55) మృత్యువాత పడింది. తొండంగి మండలం వి.కొత్తపేటకు చెందిన పంపాదమ్మ భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. లారీ ఢీకొట్టింది. పంపాదమ్మ స్పాట్‌లో మరణించింది.

News May 7, 2024

నేడు కోరుకొండలో సీఎం జగన్ పర్యటన

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (మంగళవారం) కోరుకొండలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కోరుకొండ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై పోలీస్ అధికారులు సోమవారం సమీక్షించారు.

News May 7, 2024

సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనపై దర్యాప్తు

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడికి గాయాలైన విషయం తెలిసిందే. కాకినాడ DSP హనుమంతరావు, శిక్షణ DSP ప్రమోద్, SI బాలాజీ సోమవారం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తాటిపర్తికి చెందిన వెంకటరమణ, వీరబాబును అదుపులోకి తీసుకొని, బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తుంది.