EastGodavari

News August 15, 2024

తూ.గో.: అంకెలతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

image

78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సామర్లకోట అయోధ్య రామాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ అంకెలతో మ్యాజిక్ స్క్వేర్‌ రూపొందించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటు నుంచి యాడ్ చేసినా మొత్తం 78 వచ్చేలా దానిని రూపొందించారు.

News August 15, 2024

రాజమండ్రికి చెందిన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

రాజమహేంద్రవరానికి చెందిన బీటెక్ విద్యార్థి నూజెండ్ల శశాంక్ (20) మంగళగిరి మండలంలోని ప్రైవేట్ యూనివర్సిటీలో బుధవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. మంగళగిరి గ్రామీణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలో శశాంక్ సీఎస్ఈ విభాగంలో రెండో ఏడాది చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాలలో బ్యాక్ లాగ్ ఉండటంతో వసతి గృహంలోని తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

News August 15, 2024

కాకినాడ: కుమార్తెతో తండ్రి అసభ్య ప్రవర్తన

image

కాకినాడ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. అనకాపల్లి వ్యక్తికి కాకినాడ జిల్లా కిర్లంపూడి మహిళతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె ఉంది. ఉపాధి కోసం భార్య వేరే ప్రాంతంలో ఉండగా.. భర్త, కుమార్తె అనకాపల్లిలో ఉంటున్నారు. తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో కిర్లంపూడిలోని అమ్మమ్మ ఇంటికి కుమార్తె వచ్చేసింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పొక్సో కేసు నమోదైంది.

News August 14, 2024

కాకినాడ: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

image

రాష్ట్ర ప్రజానీకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందడానికి ప్రాణాలర్పించిన మహనీయులు అందరిని స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాల పునాదులపై దేశ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన పండుగలా నిర్వహించికుందామని పిలుపునిచ్చారు. కాకినాడలో గురువారం మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు.

News August 14, 2024

అగ్రికల్చర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల బీఎస్సీ(హానర్స్) కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.angrau.ac.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

News August 14, 2024

కాకినాడ: ఇది చాలా ఘోరమైన చావు..!

image

ఇది మాములు సూసైడ్ కాదు. చాలా ఘోరం. కాకినాడ జిల్లాకు కరపకు చెందిన ఇంజరపు సత్యనారాయణ(52) స్థానికంగా వెల్డింగ్ వ్యాపారం చేస్తున్నాడు. షాపు నడపటం కష్టతరంగా మారింది. పనులు రాకపోగా అప్పులు పెరిగిపోయాయి. వీటిని తీర్చలేనని కుమిలిపోయాడు. బాధలు తట్టుకోలేక తన షాపులోనే ఉన్న చిన్న ఇనుము కణతులను మింగేశాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చనిపోయాడు.

News August 14, 2024

కోనసీమ: యువకుడి ప్రాణం తీసిన అత్యుత్సాహం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో యువకుడి అత్యుత్సాహం అతని ప్రాణాన్ని బలిగొంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన శివ(26) ఈనెల 6న గడ్డి మందు ఎలా ఉంటుందో అని నోట్లో వేసుకుని ఊసేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈక్రమంలో సోమవారం అతడికి ఆయాసం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

News August 14, 2024

నేడు కాకినాడకు పవన్ కళ్యాణ్ రాక

image

కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. హెలికాప్టర్‌లో నేటి సాయంత్రం కాకినాడకు చేరుకుంటారు. JNTU గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగరవేస్తారు. తర్వాత చేబ్రోలులోని తన నివాసానికి చేరుకుంటారు. రేపు రాత్రికి గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన విజయవాడకు వెళ్తారా? పిఠాపురంలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

News August 14, 2024

ఇంటింటా ఓటర్ల సర్వే నిర్వహించాలి: కలెక్టర్

image

ఓటర్ల సంక్షిప్త సవరణ జాబితా తయారీలో భాగంగా ఇంటింటా ఓటర్ల సర్వే నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి వివేక్ యాదవ్ అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు.

News August 13, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పిడుగులు పడే అవకాశం

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక హెచ్చరించింది. రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతంలో పిడుగులు పడవచ్చని అధికారులు ప్రకటించారు. సెల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. ఆరు బయట, చెట్ల కింద ఉండవద్దని సూచించింది.