India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలోని 576/16-18 పోల్ వద్ద సుమారు 20 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని యువతి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నీలం దుస్తులు ధరించి ఉన్నట్లు వివరించారు. ఈ మేరకు రాజమండ్రి జీఆర్ పీఎస్లో కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలిసినవారు 94406 27551, 94914 44022 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే భార్యను హతమార్చాడు. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీతానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
21న విశాఖలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాల్సిన విద్యార్థి స్నేహితులతో కలిసి సరదాగా బీచ్కి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద సోమవారం కాలువలో గల్లంతై సందీప్(17) మృతి చెందిన విషయం తెలిసిందే. పి.గన్నవరం మండలం పెదకందాలపాలానికి చెందిన సందీప్ పేరెంట్స్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. దీంతో అన్నదమ్ములు అమలాపురం మండలం వన్నెచింతలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.
కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన వివాహితపై దగ్గరి బంధువైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు యువకుడు అఖిల్పై కేసు నమోదు చేశామని CI గీతా రామకృష్ణ తెలిపారు. కొన్నేళ్లుగా అసభ్యకరంగా ఫొటోలు తీసి, డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. జులై 25న ఏలూరులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడంతో అఖిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాకినాడలో మంగళవారం (నేడు) రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నట్లు కాకినాడ కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
అన్నవరం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంబాబు (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు రాజమండ్రిలో ఓ వివాహానికి వచ్చారు. వివాహం అనంతరం బైకుపై అరకు వెళ్లారు. తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా అన్నవరం వై జంక్షన్ వద్ద బస్సును తప్పించబోయి అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేవరపల్లి మండలం కుమారదేవం సినిమాచెట్టు పునరుద్ధరణ పనులను ముమ్మరం చేశామని రోటరీ క్లబ్ఆఫ్ రాజమండ్రి ఐకాన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. చెట్టు పునరుద్ధరణ కార్యక్రమ ఇన్ఛార్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. చెట్టు కొమ్మలను కత్తిరించే ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. మానుకి ఏ విధమైన నష్టం జరగకుండా ప్రత్యేకంగా తయారుచేసిన లేపనాలు పూసి కవర్ చేస్తామన్నారు.
కాకినాడ జిల్లాకేంద్రంలోని పెద్దమార్కెట్కు చెందిన టి.కృష్ణమోహన్ను పెళ్లిసంబంధం పేరిట ఆరుగురు మహిళలు కలిసి కొద్దిరోజుల క్రితం <<13794340>>మోసం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై గతంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ రోజు బాధితుడు కలెక్టరేట్లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదుచేశాడు.
రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా జైళ్ల శాఖ అధికారి కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంక్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. బంక్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పలువురి వాహనాలలో మంత్రి అనిత సరదాగా పెట్రోల్ కొట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా జైళ్ల శాఖ అధికారి కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంక్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. బంక్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పలువురి వాహనాలలో మంత్రి అనిత సరదాగా పెట్రోల్ కొట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.