India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లా ధవళేశ్వరానికి చెందిన ఇద్దరు బాలికల అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో బాలికలు దొరికారని, నిందితుడిని పట్టుకున్నారని సమాచారం. విజయనగరానికి చెందిన వెంకటేశ్ ధవళేశ్వరానికి చెందిన బాలికలను 15 రోజుల కింద అపహరించాడు. బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పిఠాపురం మాజీ MLA వర్మ, ‘X’ వేదికగా మంత్రి లోకేశ్కు <<13823784>>విన్నవించడంతో<<>> బాలికల ఆచూకీ కనుగొన్నారు.
ప్రేమిస్తున్నానని వెంటపడుతూ.. ఒప్పుకోకపోతే చనిపోతా, ఫొటోలు నెట్లో పెడతానంటూ యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. చేబ్రోలుకు చెందిన యువకుడిపై గొల్లప్రోలు యువతి ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని SI జాన్ బాషా తెలిపారు. కాలేజీకి వచ్చి యువకుడు బెదిరించడంతో పాటు గతంలో అతడితో తీసుకున్న ఫొటోలను నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అన్నవరం రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన 17 ఏళ్ల యువకుడు గాజుల స్వామిని GRP పోలీసులు ఆదివారం తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. యువకుడి ప్రవర్తన తేడాగా ఉండటంతో హెడ్కానిస్టేబుల్ శ్యామ్ తుని GRP ఎస్ఐ అబ్దుల్ మారూఫ్కి సమాచారం అందించారు. రెస్టారెంట్లో పనిచేయమని తల్లిదండ్రులు కోరగా అది ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు విచారణలో గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి అప్పగించారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (ఏఈ) కె.సురేశ్ <<13827346>>అదృశ్యమైన<<>> విషయం తెలిసిందే. కాగా అతను రాజమండ్రి బస్టాండ్లో ఉన్నట్లు ఆదివారం బంధువులకు సమాచారం అందింది. దీంతో అతణ్ని ఇంటికి తీసుకు వచ్చేందుకు కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. కుటుంబ సమస్యల కారణంగా శనివారం విధులకు వెళ్లిన సురేశ్ అదృశ్యమైనట్లు చెబుతున్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలోని రైతులకు రూ.191.84 కోట్ల ధాన్యం బకాయిలు ఈ నెల 12న విడుదల కానున్నాయి. తూ.గో జిల్లాలో 498.70 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. రూ.470.99 కోట్లు చెల్లించగా.. రూ.27.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాకినాడ జిల్లాలో రూ.56.75 కోట్లలో రూ.47.25 కోట్లు చెల్లించగా.. రూ.9.50 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.355.88 కోట్లకు, రూ.201.25 కోట్లు చెల్లించారు. రూ.154.63 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (AE) కె.సురేశ్ అదృశ్యంపై అతడి తండ్రి దన రామప్రసాద్ ఆదివారం అమలాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 10:45 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉందని, తర్వాత నుంచి పనిచేయటం లేదన్నారు. సురేశ్ అమలాపురంలో ఉంటున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (AE) కె.సురేశ్ అదృశ్యంపై అతడి తండ్రి దన రామప్రసాద్ ఆదివారం అమలాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 10:45 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉందని, తర్వాత నుంచి పనిచేయటం లేదన్నారు. సురేశ్ అమలాపురంలో ఉంటున్నారు.
కాకినాడలోని రామారావుపేటలో శ్రీపాద అపార్ట్మెంట్ 4వ అంతస్తులో 79ఏళ్ల వంగ మణికి జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చి గుర్తుతెలియని మహిళ చోరీకి పాల్పడింది. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఆమె వద్దకు గత నెల 24న ఓ మహిళ వెళ్లి మాయమాటలు చెప్పి మనవరాలిగా పరిచయం చేసుకుంది. జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చి రూ.2.16 లక్షల విలువైన 8 కాసులు బంగారం చోరీ చేసింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం MLA దాట్ల బుచ్చిబాబు సోదరుడు వెంకట సీతారామరాజు(43) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో స్వగ్రామం ఐ.పోలవరం మండలం మురమళ్లలో విషాదం నెలకొంది. సీతారామరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న MLA బుచ్చిబాబును పలువురు పరామర్శించి ఓదార్చారు. నియోజకవర్గంలోని నాయకులు, MLA అభిమానులు సీతారామరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఇటీవల వివాహమై.. ఆషాఢ మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు పెట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన ఉద్ధగిరి వెంకన్నబాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో అల్లుళ్లకు ఇటువంటి మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తుంది.
Sorry, no posts matched your criteria.