EastGodavari

News May 3, 2024

కడియం: 6న మోదీ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

image

కూటమి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారి వద్ద విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ జగదీష్, ఎఎస్పీ అనిల్ కుమార్, జేసీ తేజ భరత్‌లు పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.

News May 3, 2024

6న రాజమండ్రికి ప్రధాని మోదీ రాక

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన ప్రధాన మోదీ రాజమండ్రిలో పర్యటించనున్నారు. కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారిపై కూటమి ఆధ్వర్యంలో విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.  

News May 3, 2024

UPDATE: కాకినాడ: వాగులో మునిగి ఇద్దరు యువకుల మృతి

image

రంపచోడవరం సమీపంలోని సీతపల్లివాగులో కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మునిగి 13166677 విషయం తెలిసిందే. పూర్తి వివరాలు.. సామర్లకోటకు చెందిన పెయింటింగ్ పనులు చేసే ఆరుగురు యువకులు గురువారం విహారయాత్రకని ఆటోలో సీతపల్లివాగుకు వెళ్లారు. ఈ క్రమంలో అవినాష్(27) స్నానం చేద్దామని వాగులో దిగి ఊబిలో చిక్కుకున్నాడు. గమనించిన రాజ్‌కుమార్ (29) రక్షించేందుకు దిగగా ఇద్దరూ ఊబిలో కూరుకుపోయి చనిపోయారు.

News May 3, 2024

కాకినాడ జిల్లాలో 16,34,122 మంది ఓటర్లు: కలెక్టర్

image

EVMలను ఏ విధంగా ఉపయోగించాలో జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు కాకినాడ కలెక్టర్ నివాస్ తెలిపారు. గురువారం ఆయన జగ్గంపేటలోని మోడల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. జిల్లాలో 16,34,122 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు.

News May 3, 2024

నన్నయలో ఎంఎస్సీ జియోఇన్ఫర్మేటిక్స్ కోర్సు

image

రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంఎస్సీ జియోఇన్ఫర్మేటిక్స్ కోర్సు ప్రారంభిస్తున్నామని, ఏపీ పీజీ సెట్ ద్వారా విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చునని వీసీ ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివరాలు వెల్లడించారు. మే 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌ లభిస్తాయన్నారు.

News May 2, 2024

మావయ్యకు మద్దతుగా పిఠాపురానికి మరో మెగా హీరో

image

పవన్ గెలుపు కోసం పిఠాపురంలో మెగా హీరోలు వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 4న సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేయనున్నట్లు జనసేన పార్టీ నేతలు తెలిపారు. 6వ తేదీన కాకినాడలో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే 4 రోజుల కింద వరుణ్ తేజ్, నిన్న వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మరో వైపు జబర్దస్త్ నటులు, డాన్స్ మాస్టర్ జానీ ఇక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

News May 2, 2024

కోనసీమ: గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. సూరిశెట్టి రాజు(48) మడుపల్లి గ్రామానికి సొసైటీ మెంబర్‌గా పని చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గురువారం పనికి వెళ్లాడు. గుండెపోటు రాగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు మృతితో మడుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 2, 2024

తూ.గో: ‘ఓటుతో ప్రభుత్వాన్నే కూల్చిన ఎమ్మెల్యే’ (REWIND) 

image

తూ.గో జిల్లాకు చెందిన ఓ MLA వేసిన ఓటు ప్రభుత్వాన్నే కూల్చేసింది. 1953లో ఆంధ్రా తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు సారథ్యంలో మద్యపాన నిషేధానికి బిల్లుపై ఓటింగ్ పెట్టారు. అయితే.. మద్యం తాగడం గిరిజనుల సంప్రదాయమంటూ ఎల్లవరం నియోజకవర్గ MLA కారం బాపన్నదొర బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో అది వీగిపోయింది. మద్యపానాన్ని నిషేధించలేకపోయానన్న ఆవేదనతో ప్రకాశం పంతులు 14నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు.

News May 2, 2024

‘పది’లో రాజమండ్రి జైలు ఖైదీల సత్తా

image

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు అత్యుత్తమ ఫలితాలు సాధించటం ఆనందమని జైలు సూపరింటెండెంట్ రాహుల్ అన్నారు. తొలిసారిగా సెంట్రల్ జైలు నుంచి 48 మంది ఖైదీలు ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరుకాగా వారిలో 39 మంది పాసై 81శాతం ఉత్తీర్ణత సాధించారని, ఓపెన్ ఇంటర్మీడియట్ నుంచి 12 మంది పరీక్ష రాయగా..  11 మంది పాసై 92శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.

News May 2, 2024

కాకినాడ: వాగులో మునిగి ఇద్దరు యువకుల మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రౌన్‌పేటలోని గణేశ్‌కాలనీకి చెందిన ఇద్దరు యువకులు రంపచోడవరం సమీపంలోని సీతపల్లి వాగులో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువారం సామర్లకోట నుంచి సీతపల్లి వాగుకు 13మంది యువకులు విహారయాత్రకు వెళ్లారు. వారిలో గణేష్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు నీటిలో దిగగా.. ఊబీలో కూరుకుపోయి మృతి చెందినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.