India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కూడలి వద్ద శనివారం ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం నుంచి పి.గన్నవరం మండలం ముంగండ రొయ్యల పరిశ్రమలో పని కోసం 11 మంది ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
పేదల సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశ పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఇసుక పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక పాలసీ విధానంపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, అనపర్తి, సామర్లకోట, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికల సందేశాలు పంపించారు.
ప్రత్తిపాడు ASIగా పని చేస్తున్న పి.పెద్దబ్బాయి (60) గుండెపోటుతో మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం రాజవొమ్మంగి మండలం లాగరాయి. కాగా ఆయన ఏలేశ్వరంలో నివాసం ఉంటున్నారు. శనివారం ఇంట్లో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కాకినాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 6.81 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మామిడాకులు, పూలతో పందిరిని అందంగా అలంకరించారు. వినాయకచవితికి నెలరోజుల ముందే ఈ ఏర్పాట్లు చేయడం విశేషం. కాగా చేతి సంచితో బజారుకు వెళదాం అనే సందేశంతో ఓ సంచిని వినాయకుని వద్ద ఉంచారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు సీఐలకు పోస్టింగ్ ఇస్తూ ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న టీవీ.నరేష్ కుమార్ను డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు సీఐగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అల్లు వెంకటేశ్వరరావును తూర్పుగోదావరి జిల్లా కడియం సీఐగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఫోన్ మాట్లాడుతున్నావని పేరెంట్స్ ప్రశ్నించగా ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. నల్లజర్ల మండలం ఘంటావారిగూడేనికి చెందిన లక్ష్మి(18) ఓపెన్ ఇంటర్ చేస్తూ ఓ మెడికల్ షాప్లో పనిచేస్తోంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలతచెందిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం అమ్మానాన్నకు ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉందని కట్ చేసింది. వారు వచ్చేసరికి ఉరేసుకొని చనిపోయింది. కేసు నమోదైంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యాక ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ చూపిస్తానని నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిఠాపురంలో గురువారమే ప్రీమియర్స్ అయ్యాయని అన్నారు. చిత్ర యూనిట్ అక్కడి వారితో కలిసి మూవీని చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. మూవీ సెలబ్రేషన్స్ ప్రస్తుతానికి తమ ఆఫీస్లో ప్లాన్ చేశామని, పిఠాపురంలో ప్లాన్ చేస్తే తప్పకుండా చెబుతామని అన్నారు.
కొవ్వూరు మండలం కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ పునరుజ్జీవ ప్రక్రియ చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో నిపుణులు కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. 45 రోజుల తర్వాత చిగుర్లు వస్తాయని పేర్కొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇలా 10 చెట్లకుపైగా చిగురింపజేశామన్నారు. ఈ చెట్టు అంటే తనకు ప్రాణమని, దాన్ని బతికిస్తే ఎక్కువ నిడివితో మళ్లీ ఓ పెద్ద సినిమా తీస్తానని డైరెక్టర్ వంశీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.