EastGodavari

News May 2, 2024

కోనసీమ జిల్లాలో ఎన్నికలపై 592 ఫిర్యాదులు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సి.విజిల్ యాప్ ద్వారా 592 ఫిర్యాదులు అందాయని సి.విజిల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 100 నిమిషాల లోపు 436 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 118 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధించినవి కావని చెప్పారు. 38 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘానికి 44 ఫిర్యాదులు అందగా 33 పరిష్కరించామన్నారు.

News May 2, 2024

రాజమండ్రి వస్తున్న బస్సులో రూ.2.40 కోట్లు దొరికాయ్..!

image

హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న బస్సులో భారీగా నగదు దొరికింది. ప.గో జిల్లా జగన్నాథపురం చెక్‌పోస్ట్ వద్ద రూ. 2.40 కోట్లు తరలిస్తుండగా పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ బస్సులో ఆ నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

తూ.గో జిల్లాలో నేటి నుంచి హోం ఓటింగ్

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం తూ.గో జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 1,306 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మే 2, 8వ తేదీల్లో రెండు విడతల్లో ఈ ఓటింగ్ జరుగనుంది. దీని కోసం అధికార యంత్రాంగం సమాయత్తమైంది. తొలి విడతగా మే 2న, మిగిలిన వారికి రెండో విడతగా మే 8న ఓటు వేసే అవకాశం కల్పించారు.

News May 2, 2024

తూ.గో: వారందరికీ సెలవే..!

image

ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న పోలింగ్ సందర్భంగా దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు జిల్లా సహాయ కార్మిక కమీషనర్ టి. నాగలక్ష్మి బుధవారం తెలిపారు. కార్మికులు వేతనాల్లో ఈ సెలవుకు సంబంధించి ఎటువంటి తగ్గింపు చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు జరిమానాతో కూడిన శిక్షార్హులుగా భావించడం జరుగుతుందని  తెలిపారు.

News May 2, 2024

కాకినాడ జీజీహెచ్‌లో దొంగతనం

image

కాకినాడ జీజీహెచ్‌లో మత్తు ఇంజెక్షన్లు దొంగిలిస్తూ 42 ఏళ్ల వ్యక్తి పట్టుబడ్డాడు. డ్రగ్స్ కు బానిసైన అతను కొంతకాలంగా రోగులకు నొప్పి ఉపశమనానికి ఇచ్చే ఇంజెక్షన్లు దొంగిలించి వాటిని వినియోగిస్తుండేవాడు. జీజీహెచ్ క్యాన్సర్ వార్డ్‌లోకి చొరబడి రోగులకు ఇచ్చేందుకు భద్రపరిచిన ఎవిల్ ఇంజెక్షన్లను అపహరిస్తుండగా ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

News May 2, 2024

కాకినాడ: సర్పంచ్ హేమ కుమారికి అరుదైన అవకాశం 

image

ప.గో జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నా హేమ కుమారి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మే 3న అమెరికా ఐక్యరాజ్య సమితిలో నిర్వహిస్తున్న 57వ మకిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. హేమ కుమారి 2022లో కాకినాడ జేఎన్‌టీయూ ఎంటెక్ పట్టా పొందారు. జేఎన్టీయూలో ఐదేళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‎గా పనిచేశారు. 

News May 1, 2024

రేపు 12 మండలాల్లో వడగాల్పులు: కలెక్టర్

image

కాకినాడ జిల్లాలోని 12 మండలాల్లో గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెదపూడి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్నారు. తుని మండలంలో బుధవారం 41.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది అన్నారు.

News May 1, 2024

జిల్లాలో 1644 పోలింగ్ కేంద్రాలు… కలెక్టర్ శుక్ల

image

కోనసీమ జిల్లాలో 1644 పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ ద్వారా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాడ్లను ఎంపిక చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో అమలాపురంలో బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 15,31,410 మంది వాటర్‌లో ఉన్నారన్నారు. పురుషులు 7,59,104, మహిళలు 7,72,285, ఇతరులు 21 మంది ఉన్నారన్నారు.

News May 1, 2024

తూ. గో: అత్యంత పారదర్శకంగా ఈవీఎమ్ ర్యాండమైజేషన్

image

తూ.గో జిల్లాలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీలో నిలిచిన అభ్యర్థుల, వారి ప్రతినిధుల సమక్షంలో “ఈవీఎం- ర్యాండమైజేషన్” ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజమండ్రి పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలలో అత్యంత పారదర్శకంగా ఈవీఎమ్‌ల ర్యాండమైజేషన్ ఆయా అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు.

News May 1, 2024

పిఠాపురం: దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తా: దొరబాబు

image

సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్పచారంపై సైబర్ పోలీసులకు  ఫిర్యాదు చేస్తానని పిఠాపురం MLA పెండెం దొరబాబు మంగళవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిందన్నారు. అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు.