India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నవరం దేవస్థానం అనివేటి మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం పనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పనులు నెల్లూరుకు చెందిన దాత సహకారంతో చేపడుతున్నారు. రాగి రేకుకు బంగారు తాపడం చేసి ధ్వజస్తంభానికి అమర్చనున్నారు. సుమారు 300 కిలోల రాగిపై 1,800 గ్రాముల బంగారంతో పనులు చేపట్టారు.
తూ.గో. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 77,817 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. 64,550 హెక్టార్లలో నాట్లు పూర్తి అయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అధిక వర్షాలు, వరదల వల్ల పలుచోట్ల నాట్లు దెబ్బతిన్నాయి. 117 గ్రామాల్లో 4,496 మంది రైతులకు చెందిన 14,599 హెక్టార్లలో నాట్లు మునిగిపోయాయని అధికారుల నిర్ధారించారు. నిడదవోలు మండలంలో అత్యధికంగా 600 ఎకరాల్లో తిరిగి నాట్లు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం 4,64,386 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద బుధవారం సాయంత్రానికి 7.60 అడుగులకు నీటిమట్టం కొనసాగుతున్నట్లు వివరించారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీరు విడుదల చేసినట్లు తెలిపారు.
పెళ్లిళ్లు, శుభకార్యాలు, ముహూర్తాలలో పాటు శ్రావణమాసం ప్రారంభం కావడంతో రావులపాలెం అరటి మార్కెట్ యార్డుకు శ్రావణ శోభ సంతరించుకుంది. గత కొంత కాలంగా దిగుబడి ఉన్నప్పటికి సరైన ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంత మేర గెలలు దిగుబడి తగ్గినా అరటి గెలలకు మంచి ధర పలుకుతుంది. ప్రస్తుతం కర్పూర రకం రూ.300-600, చక్కెరకేళి రూ.200-500 వరకూ ధర పలుకుతోంది.
మండపేటలో ఆగస్టు 11న జరగనున్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకృష్ణ, స్వరూప వివాహ వేడకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కుటుంబం బుధవారం ఆహ్వానం పలికింది. ఈ మేరకు బిక్కిన కృష్ణార్జున చౌదరి, రెడ్డి రాజబాబు, చోడే సత్యకృష్ణ, శ్రీకృష్ణ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి, మోసం చేశాడంటూ యువతి ముమ్మిడివరంలో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ జ్వాలాముఖి ప్రకారం.. భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటున్న ఓ యువతిని కమిని గ్రామ పరిధిలోని వాసాలతిప్పకు చెందిన రామకృష్ణ ప్రేమ పేరుతో మోసం చేశాడు. మే నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు మల్లెల నాగేంద్ర ఉప్పాడ చేనేత చీరలతో విజయవాడలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాగేంద్ర వద్ద రూ.20వేలకు ఉప్పాడ చీరను కొనుగోలు చేశారు.
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన పర్యటనలలో ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటి వరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న వ్యక్తిగత భద్రత సిబ్బంది (PSO’s) 1+1ను 2+2కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామానికి చెందిన బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ కాకినాడ జిల్లాధ్యక్షుడు కురసాల కన్నబాబుకి పంపినట్లు తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానన్నారు. కాగా పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు సైతం ఈ రోజు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు YCPకి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా తనను వెన్నంటి నడిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి స్వలోభాలకు ఆశపడి రాజీనామా చేయలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడం తమకు తెలియదన్నారు. వీలైనంత త్వరలో భవిష్యత్ ప్రణాళికను తెలియజేస్తానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.