EastGodavari

News August 7, 2024

తూ.గో.: మురుగు కాల్వల అభివృద్ధికి రూ.9.8 కోట్లు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మురుగు కాలువల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క, తూడు తొలగింపునకు ప్రభుత్వం రూ.9.8 కోట్లు నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ద్వారా ఈ నిధులను మంజూరు చేశారు. కోనసీమ జిల్లాలో 76 పనులను రూ.7.1 కోట్లు, కాకినాడ జిల్లాలో 22 పనులను రూ.1.9 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక పనికి రూ.80 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

News August 7, 2024

సత్యదేవుడికి రూ.కోటిన్నర వ్యయంతో వజ్ర కిరీటం

image

శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దాపురానికి చెందిన మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు సుమారు రూ.కోటిన్నర వ్యయంతో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేయించిన కిరీటాన్ని దేవస్థానానికి అందజేశారు. సత్యనారాయణ స్వామి దేవస్థానం 134వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ వజ్ర కిరీటాన్ని అలంకరించారు.

News August 7, 2024

కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

image

కాకినాడకు చెందిన కృష్ణమోహన్‌కు పెళ్లిసంబంధం చూస్తానని శిరీష అనే మహిళ కలిసింది. జూన్ 23న సత్యవేణి, దుర్గ అనే ఇద్దరిని పరిచయం చేసింది. వారు అతణ్ని రాజమండ్రికి తీసుకెళ్లి నీరజను పెళ్లికుమార్తెగా చూపించారు. నచ్చడంతో నిశ్చితార్థం ఖర్చులకు రూ.2.80లక్షలు, గోల్డ్ చైన్, ఫోన్‌ను సత్యదేవి, ప్రియాదేవికి అందించాడు. కొద్దిరోజులకు అనుమానంతో ప్రశ్నించగా మోసం చేశారని తేలింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News August 7, 2024

100 రోజుల ప్రాణాళిక అందజేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో ప్రాధాన్యం కలిగి ఉండాలని, ఆ మేరకు 100 రోజుల ప్రణాళికను అధికారులు అందజేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఇన్‌ఛార్జి జేసీ జి.నరసింహులుతో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్, 2047పై రాష్ట్ర చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కొన్నారు.

News August 6, 2024

సామర్లకోటలో వందేభారత్ రైలుకు హాల్టింగ్

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే‌భారత్ రైలుకు సామర్లకోటలో ప్రయోగాత్మకంగా ఈనెల 3వ తేదీ నుంచి హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. 6 నెలలపాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News August 6, 2024

కోనసీమ జిల్లాలో 256 మందికి నోటీసులు జారీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించిన 256 మంది క్లస్టర్ సిబ్బందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు DRDA PD శివశంకర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ 8 గంటల వరకు ప్రారంభించలేదని నోటీసులలో పేర్కొన్నారు. ఆ 256 మందిలో 32 మంది కలెక్టర్ కార్యాలయంలో సంజాయిషీ ఇవ్వగా.. మిగిలిన వారు ఈనెల 10వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలన్నారు.

News August 6, 2024

తూర్పుగోదావరి: దరఖాస్తుల ఆహ్వానం

image

రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు, ఐదు సహాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీఎల్ఎఫ్ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్సైట్ నందు గానీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటీస్ బోర్డు నందు గానీ అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. ఈనెల 9లోగా దరఖాస్తు చేయాలన్నారు.

News August 6, 2024

ధవళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం గత 3 రోజుల నుంచి నిలకడగా ఉంది. మంగళవారం ఉదయం 7 గంటలకు 8.90 అడుగులకు చేరి నీటిమట్టం సాధారణ స్థాయిలో ఉంది. 6.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు.

News August 6, 2024

’రాజమండ్రి విమానాశ్రయం లీజుకు’

image

దేశవ్యాప్తంగా 2022- 2025 మధ్యకాలంలో లీజుకు ఇవ్వాలని గుర్తించిన విమానాశ్రయాల్లో రాజమండ్రి విమానాశ్రయం ఒకటని కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. ఉత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకునేందుకే ఈ విమానాశ్రయాలను లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.

News August 6, 2024

కోనసీమ: మద్యం మత్తులో ASIపై దౌర్జన్యం

image

అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన విజయ్ అదే గ్రామంలోని అమ్మాయితో ఈ నెల 3న రాత్రి ఆమె ఇంటి వద్ద మాట్లాడుతున్నాడని అంబాజీపేట SI చిరంజీవి సోమవారం తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు అతణ్ని ప్రశ్నించడంతో వివాదం జరిగిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకొని విచారించారు. దీంతో విజయ్ ఏఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.