EastGodavari

News March 5, 2025

పిడింగొయ్యి: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహాం ఉందని వీఆర్‌వో అప్పలనాయుడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హండ్రెడ్‌ఫీట్‌రోడ్డులో కల్వర్టు పక్కన గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్‌వి.రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2025

రాజమండ్రి: బోటింగ్, నది విహారం కార్యక్రమాలు నిర్వహణ

image

తూ.గో జిల్లా పరిధిలో చేపల వేట ద్వారా జీవనోధారంతో పాటు, పర్యటక అభివృద్ది పరంగా బోటింగ్, నది విహారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. వీటికి సంబంధించిన నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో టూరిజం ఇన్‌ఛార్జ్ ప్రాంతీయ సంచాలకులు పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2025

తూ.గో: ఇంటర్ పరీక్షకు 23,655 మంది విద్యార్థుల హాజరు

image

తూ.గో జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్-1 పరీక్షకు 23,655 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్‌ఐఓ ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 51 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆర్‌ఐఓ, డీవీఈఓ, ఫ్లయింగ్, సెన్సింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్లు ఈ పరీక్షలను పర్యవేక్షించారన్నారు.

News March 4, 2025

జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

image

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.

News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News March 4, 2025

రాజమండ్రి: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

News March 4, 2025

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని నెల చివరికి సాధించాలి: కలెక్టర్

image

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హెక్టార్ల లక్ష్యానికి 2821 హెక్టార్ల ప్రగతి సాధించడం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయాలని  కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియాన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడుతో కలిసి సమీక్షించారు.

News March 3, 2025

రాజమండ్రి: హత్య కేసులో జీవిత ఖైదు

image

2021 సెప్టెంబర్‌లో  రాజమండ్రిలోని సీటీఆర్ఐ సెంటర్ వద్ద జరిగిన హత్య కేసులో ఒక నేరస్థుడికి సోమవారం కోర్టు శిక్ష విధించింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఆర్.శ్రీలత ముద్దాయి యర్రా సాయికి జీవితకాలం ఖైదు అలాగే రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసు పురోగతిలో సహకరించిన పీపీ రాధాకృష్ణరాజు, త్రీ టౌన్ సీఐ అప్పారావు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లులను, ఎస్పీ నర్సింహ కిషోర్‌ను కోర్టు అభినందించింది.

News March 3, 2025

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం పోలీసుల వివరాలు.. తొర్రేడుకు చెందిన నరేంద్ర (45) పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI మనోహర్ తెలిపారు.

News March 3, 2025

తూ.గో: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

image

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.