EastGodavari

News April 27, 2024

రాజమండ్రి చేరుకున్న వరుణ్ తేజ్‌

image

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో సినీ హీరో వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి ఆయన బయలుదేరి వెళ్లారు.

News April 27, 2024

కోనసీమ జిల్లాలో 31 నామినేషన్లను తిరస్కరణ

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కోనసీమ జిల్లావ్యాప్తంగా ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 31 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో 21 నామినేషన్లు వేయగా 16 , ఏడు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 130 నామినేషన్లు దాఖలు చేయగా 104 నామినేషన్లు ఆమోదించామని తెలిపారు.

News April 27, 2024

తూ.గో జిల్లాలో 89 ఆమోదం.. 44 REJECT

image

తూ.గో జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఇందులో రాజమండ్రి అర్బన్ లో 13 నామినేషన్లు వేస్తే 2, రాజమండ్రి గ్రామీణంలో 14 వేస్తే 7, రాజానగరంలో 18 కి 4, కొవ్వూరులో 14 కి 2, గోపాలపురంలో 15 కు 4, నిడదవోలులో 16 కు 3, అనపర్తిలో 24 నామినేషన్లు వేస్తే 15 నామినేషన్లు తిరస్కరించారు.

News April 27, 2024

కాకినాడ: ఇంజినీరింగ్ విద్యార్థి SUICIDE.. కేసు నమోదు

image

కాకినాడ గాంధీనగర్‌కు చెందిన పల్లి సంజయ్ వర్మ (21) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న అతను గురువారం కుటుంబ సభ్యులను రూ.500 కావాలని అడగగా ఇవ్వక పోవడంతో ఉరి వేసుకున్నాడని విద్యార్థి తండ్రి మధుబాబు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న వర్మను జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 27, 2024

పిఠాపురంలో నేడు పవన్ కోసం హీరో వరుణ్ తేజ్ ప్రచారం

image

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా సినీ హీరో కొణిదెల వరుణ్ తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్ షో ప్రారంభమై వన్నెపూడి మీదుగా సాగుతుందన్నారు. అనంతరం కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు.

News April 26, 2024

JEE మెయిన్స్.. కోనసీమ విద్యార్థికి ఆలిండియా RANK

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ గారపాటి త్రిమూర్తులు కుమారుడు వీరసత్య సంతోష్‌ JEE మెయిన్స్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 368 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు. ఈ మేరకు విద్యార్థిని గ్రామ సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభినందించారు.

News April 26, 2024

రాజోలు: ప్రత్యేక ఆకర్షణగా జనసేన వీర మహిళలు

image

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో జనసేన వీరమహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారంతా తెలుపు రంగు చీరపై జనసేన గాజుగ్లాస్ గుర్తు, ఎన్నికల చిహ్నం కలిగిన చీరలు కట్టుకొని ఆకట్టుకొన్నారు.

News April 26, 2024

పి.గన్నవరంలో 29న జగన్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

image

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీన పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం రాజోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పరిశీలించారు. కేంద్ర కార్యాలయ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, పార్టీ నేత కేఎస్ఎన్ రాజు, వైసీపీ ప్రధాన కార్యదర్శి తెన్నేటి కిషోర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

News April 26, 2024

పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

image

పిఠాపురంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిన్ని నామినేషన్ వేశారు. ఇంటర్ వరకు చదివిన ఆయన స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఏ (రాజనీతిశాస్త్రం) సైతం పూర్తిచేశారు. నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే ఓ మేనిఫెస్టో రూపొందించుకొన్నారు.

News April 26, 2024

తొండంగి: ఉరేసుకుని ఇస్రో ఉద్యోగి ఆత్మహత్య

image

తొండంగి మండలం పైడి కొండకు చెందిన కోదండ గంగేశ్వర్ (31) ఉరి వేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో గంగేశ్వర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఎస్పీబీలో విధులు నిర్వహిస్తున్నాడు. సూళ్లూరుపేట షార్ ఉద్యోగుల నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.