EastGodavari

News April 26, 2024

తూ.గో: మూడు రోజులు.. ఆరు సభలు.. పవన్ షెడ్యూల్

image

ఉమ్మడి జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజోలులోని మలికిపురం కూడలిలో.. 6 గంటలకు ద్రాక్షారామ సుభాష్‌చంద్రబోస్‌ కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. 28న జగ్గంపేట, ప్రత్తిపాడు సభల్లో పాల్గొంటారు.

News April 26, 2024

తూగో: అసెంబ్లీ స్థానాలకు 485 నామినేషన్లు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోనసీమ , కాకినాడ , రాజమండ్రి పార్లమెంటు ఆయా పరిధిలోని 21 అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ పార్లమెంట్లకు 32, రాజమహేంద్రవరం పార్లమెంటు 19, అమలాపురం పార్లమెంటు 21 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21అసెంబ్లీ స్థానాలకు గాను కాకినాడ జిల్లా 170, తూర్పు గోదావరి జిల్లా 114 డా.బి.ఆర్. కోనసీమ జిల్లా 175 నామినేషన్లు దాఖలయ్యాయి .

News April 26, 2024

ప్రత్తిపాడు: దశాబ్దాలుగా ఆ మూడు కుటుంబాలదే హవా..!

image

దశాబ్దాల నుండి ప్రత్తిపాడులో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ సెగ్మెంట్లో మొదట ముద్రగడ కుటంబం హవా కొనసాగగా.. తరువాత పర్వత కుటుంబం ఒక వెలుగు వెలిగింది. తదనంతరం వరుపుల కుటుంబం అధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి సత్యప్రభ బరిలో నిలబడగా, వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఉన్నారు

News April 26, 2024

రాజమండ్రి: నేటి నుంచి ఆ మార్గం బంద్

image

రాజమండ్రి-కొవ్వూరు మధ్య ఉన్న గామన్‌ బ్రిడ్జి మరోసారి మరమ్మతులకు గురైంది. రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వచ్చే మార్గంలో 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు సమాచారం. బేరింగ్‌ మార్పు చేయడానికి 10 రోజుల పాటు వంతెనపై ఒక మార్గంలోనే వాహన రాకపోకలకు అనుమతించనున్నారు.

News April 25, 2024

27న పెద్దాపురానికి పవన్ కళ్యాణ్

image

పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 27న వస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ నేతలు పాల్గొంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు చేపట్టినట్లు టౌన్ అధ్యక్షులు అడబాల కుమార్ స్వామి తెలిపారు.

News April 25, 2024

తూ.గో.: అక్కడ ఒకే పేరుతో ముగ్గురు పోటీ

image

పి.గన్నవరం నియోజకవర్గంలో ఒకే పేరు కలిగిన ముగ్గురు వ్యక్తులు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో పాటు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అదే పేరున్న గిడ్డి సత్యనారాయణ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో గిడ్డి సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. దీంతో ఎవరికి ఏ మేర నష్టం వాటిల్లుతుందో వేచి చూడాలి.

News April 25, 2024

JEE మెయిన్స్‌లో వాడపాలెం విద్యార్థికి జాతీయ RANK

image

JEE మెయిన్స్ పరీక్షల్లో డా.బీఆర్.అంబేడ్కర్ జిల్లా కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు సాయి నరేన్‌ జాతీయ స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 648వ ర్యాంక్ సాధించారు. నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు గంటి జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ మేరకు విద్యార్థిని గ్రామస్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 25, 2024

తూ.గో.: టీడీపీ జిల్లా కోఆర్డినేటర్‌గా సతీష్

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కోఆర్డినేటర్‌గా సానా సతీష్ ఎంపికయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్‌గా తోట నవీన్, పెద్దాపురం కోఆర్డినేటర్‌గా రాజా సూరిబాబు రాజు, జగ్గంపేట కోఆర్డినేటర్‌గా అప్పలరాజు, కాకినాడ కోఆర్డినేటర్ గా వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.

News April 25, 2024

కాకినాడ: టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల..?

image

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లాలో టీడీపీకి షాక్‌ తగలనుంది. తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సీటును ఆశించిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు TDPపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి YCPలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగన్ సమక్షంలో ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్లు టాక్.

News April 25, 2024

రంపచోడవరంలో 88 మంది అరెస్ట్

image

ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమై రంపచోడవరం డివిజన్ లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి115 కేసుల్లో 88మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై. రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మండలాల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.