India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాజులూరు మండలం శీల గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై 2017లో ఆమె ఇంటి పక్కనే నివసించే సునీల్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ పెద్దల సమక్షంలో వివాహం అనంతరం తన తండ్రితో కలిసి వేధింపులకు గురి చేశాడు. ఫోక్సో కేసు నమోదు అవ్వడంతో సునీల్కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, అతని తండ్రి ఏసుబాబుకు ఏడాది జైలు, రూ.5 జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాలలో అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీలోపు జిల్లా కోఆర్డినేటర్, కలెక్టరేట్ కాంపౌండ్, వికాస ఆఫీసుల్లో దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు.
గోకవరం మండలంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పర్యటించనున్నారు. తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శంకుస్థాపన పనులను బుధవారం మండల డిప్యూటీ తహశీల్దార్ రజిని, ఎంపీడీవో గోవింద్, గోకవరం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పరిశీలించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ను MLC ఉదయ భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తాడేపల్లిలో బుధవారం కలిశారు. చింతూరు డివిజన్లో వరద బాధితులను గురించి జగన్ ఆరా తీసినట్లు ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. ఆపద సమయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు అండగా ఉండాలని సూచించారని చెప్పారు.
అనపర్తి మండలంలో గురువారం (రేపు) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు రామవరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని తెలిపారు. అనంతరం బలబద్రపురంలో మాజీ MLA నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్కడి నుంచి పందలపాక గ్రామానికి వెళ్లి అక్కడ వైద్యశిబిరం ప్రారంభిస్తారన్నారు.
అంతర్జాతీయ టైగర్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పులుల ఫొటోలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ద్రోణంరాజు భగవాన్ దాస్ తీసిన పులుల ఫొటోలను పవన్ చూశారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని పవన్ దాస్ను అభినందించారు.
వాతావరణ ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫోన్లకు మెసేజ్లు పంపి అలర్ట్ చేసింది. ఉమ్మడి జిల్లాలోని రాజమండ్రి రూరల్, అనపర్తి,
అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని సూచించింది.
☞ SHARE IT..
ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై కోరింగ ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ సురేశ్ను సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు మంగళవారం తెలిపారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. 2019లో ప్రత్తిపాడు పీఎస్లో గంజాయి కేసులో పట్టుకున్న కారులో ఇంజిన్ మాయం చేశారని చినశంకర్లపూడికి చెందిన సూర్యారావు ఈనెల 23న డీజీపీకి ఫిర్యాదు చేశారు.
మంత్రి కందుల దుర్గేష్ను తూ.గో. జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఆయన చిన్ననాటి స్నేహితుడు బత్తుల సత్తిబాబు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. రాజమండ్రి SKVT జూనియర్ కళాశాలలో ఇద్దరం చదువుకున్నామని తెలిపారు. తన మిత్రుడు పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అమలాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద అంబికా లాడ్జిలో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఐదు లాప్టాప్లు, 75 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.