EastGodavari

News April 25, 2024

తూ.గో జిల్లా: మాజీ సైనికులకు పథకాల రిజిస్ట్రేషన్

image

తూ.గో జిల్లా మాజీ సైనికులకు, సైనిక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే వివిధ పథకాలు, ప్రయోజనాలను పొందేలా దరఖాస్తు చేసుకునేందుకు ap.sainic.com వెబ్ సైట్ ను రూపొందించినట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు వారి వివరాలను తప్పనిసరిగా ఈ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 25, 2024

కోనసీమ జిల్లాలో 480 కంప్లైంట్లు

image

ఎన్నికల ఉల్లంఘనలపై ఈ నెల 16-23 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 480 ఫిర్యాదులు వచ్చాయని సీపీఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. వాటిలో 94 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధం లేని వాటిగా గుర్తించి వాటిని తిరస్కరించామన్నారు. 386 ఫిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించామన్నారు. మిగిలిన 37 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించామని చెప్పారు. వెలగపూడి కార్యాలయానికి వచ్చిన 33 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.

News April 25, 2024

కాకినాడ పోర్టు – విశాఖపట్నం రైలు రద్దు

image

కాకినాడ పోర్టు – విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్టు (17267) రైళ్లను ఈ నెల 29 – మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. భావనగర్ – కాకినాడ పోర్టు (12756) రైలును మే 4, 11, 18, 25 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ డివిజన్లో మరమ్మతు నిర్వ హణ పనుల కోసం మార్పులు చేశామన్నారు.

News April 25, 2024

నేటి నుంచి ద్రాక్షారామ ఆలయం మూసివేత

image

ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో బుధవారం నుంచి గర్భాలయ దర్శనాలను నిలిపివేస్తున్నారు. శివలింగంపై గుంటలు పడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో శివలింగానికి రసాయనాలు పూసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆలయాన్ని మూసి ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు.

News April 25, 2024

తూ.గో.: క్వారీలో స్నానానికి దిగి 13ఏళ్ల బాలుడు మృతి

image

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది.
క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 24, 2024

తూ.గో.: మహిళ దారుణహత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెళ్లుగడ్డలో మంగళవారం బొంతు మణికుమారి (30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూంలో మాటువేసిన ఆగంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. హత్య సమయంలో డోరు లోపల గడియ వేసిఉందని, కిటికీ లోంచి ఆమె తోడికోడలు, కుమారుడు చూసి కేకలు వేశారు. ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

News April 24, 2024

గండేపల్లి: వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు

image

ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. 2019 జనవరి 22న గండేపల్లి గ్రామ శివారులో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా.. స్కూటీ చోదకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దాపురం కోర్టు మెజిస్ట్రేట్ జి.హర్షవర్ధన్ తీర్పు వెల్లడించారు.

News April 24, 2024

తూ.గో జిల్లాలో జోరందుకున్న నామినేషన్ల పర్వం

image

తూ.గో జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. 4వ రోజు సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీ లత తెలిపారు. లోక్‌ సభకు 4, అసెంబ్లీలకు 20 దాఖలయ్యాయని అన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా సోమవారం వరకూ లోక్‌ సభకు 5 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 48 దాఖలయ్యాయి.

News April 24, 2024

రాజమండ్రి: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య

image

రాజమండ్రిలోని సిద్ధార్థ నగర్ కు చెందిన బొజ్జి మహాలక్ష్మి (63) ఒంటిపై పెట్రోలు పోసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడు బొజ్జి రాజశేఖర్ తన తల్లికి మతిస్థిమితం సరిగాలేదని, గత కొన్ని రోజులుగా చనిపోతానంటూ చెప్పేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News April 24, 2024

తూ.గో: పోలింగ్ రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13 ఓటు హక్కు వినియోగించుకునేందుకు తూ.గో జిల్లాలోని వివిధ ప్రైవేటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు కార్మికశాఖ సహాయ కమిషనర్ బి.ఎస్.ఎం. వల్లి తెలిపారు. ఓటుహక్కు ఉన్న కార్మికులందరికీ పోలింగ్ రోజున సెలవు మంజూరు చేయాలని ఆయా సంస్థల యాజమాన్యాన్ని కోరారు.