EastGodavari

News July 30, 2024

రంపచోడవరం MLA సొంత డబ్బులతో అంబులెన్స్ సిద్ధం

image

ఆపదలో ఉన్న వారికి వైద్యసహాయం అందించేందుకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి సొంత సొమ్ముతో అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే సిద్ధం చేశారు. ప్రస్తుతం అంబులెన్సు వాహనాన్ని అన్నీ రకాలుగా తీర్చిదిద్దుతున్నట్లు టీడీపీ నేత భాస్కర్ తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ఈ అంబులెన్స్‌ను MLA శిరీషా దేవి ప్రారంభిస్తారని తెలిపారు.

News July 30, 2024

రాజమండ్రి: నాటు తుపాకీతో కాల్పులు

image

తూ.గో జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు చోరీకి వచ్చారు. స్థానికులు వారిని ప్రతిఘటించడంతో వాళ్ల వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. స్థానికులు అప్రమత్తమై ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. దొంగలు వచ్చిన బైక్, నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News July 30, 2024

రాజమండ్రిలో లెక్చరర్ ఉద్యోగాలు

image

రాజమండ్రి SKR మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా ఫిజికల్ డైరెక్టర్, బోటనీ బోధించడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ కుమారి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి పీజీలో 55% మార్కులు ఉండాలని చెప్పారు. ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. ఆగస్టు 1న ఉదయం 10 గంటల నుంచి కాలేజీలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

News July 30, 2024

పిఠాపురంలో రోడ్లపై వర్మ కీలక వ్యాఖ్యలు

image

పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. యర్నగూడెం-త్యాజంపూడి రహదారి విషయమై కాంట్రాక్టర్‌తో మాట్లాడానని చెప్పారు. రెండు రోజుల్లో గుంతలు పూడ్చే పనులు ప్రారంభిస్తామన్నారు. రాబోయే రోజుల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళ్లాలని ఆకాంక్షించారు. జనసేన కోసం సీటును త్యాగం చేశారని వర్మకు నిన్న చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News July 30, 2024

కోనసీమ: అప్రెంటిస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

కోనసీమ జిల్లా పరిధిలోని డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు APSRTCలో అప్రెంటిస్ కొరకు ఆగస్టు 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు కోరారు. దరఖాస్తు చేసిన వారు ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరం ఆఫీసులో హాజరు కావాలన్నారు.

News July 29, 2024

రంప: వరదలో టిప్పర్.. రాత్రంతా చెట్టుపైనే డ్రైవర్

image

చింతూరు మండలం నిమ్మలగూడెం రహదారి మలుపు వద్ద సత్తుపల్లి నుండి వస్తున్న టిప్పర్ ఆదివారం అర్ధరాత్రి వరద నీటిలో చిక్కుకుంది. డ్రైవర్ మర్రి నవీన్ పక్కనే ఉన్న తాటిచెట్టుపైకి ఎక్కి రాత్రంతా ఉండిపోయాడు. ఆ గ్రామానికి చెందిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో బోటుపై వెళ్లి డ్రైవర్‌ను సోమవారం ఒడ్డుకు తెచ్చారు. అతను నిడదవోలుకు చెందిన వ్యక్తి అని సమాచారం.

News July 29, 2024

BREAKING: కాకినాడలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి (VIDEO)

image

కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి టూ టౌన్ వరకు గల రైల్వే ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ డ్రైవర్స్ కాలనీకి చెందిన రెడ్డి చంద్రబోస్ (37) బైక్‌పై వెళ్తుండగా.. కాకినాడ నుంచి ఏలేశ్వరం వెళ్తున్న ఏలేశ్వరం డిపో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.

News July 29, 2024

ధవళేశ్వరం వద్ద 14.60 అడుగులకు చేరిన నీటిమట్టం

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల వరకు 14.60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 14.60 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 3 పంట కాలువల ద్వారా 8,700 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

News July 29, 2024

బాధిత కుటుంబానికి రూ.లక్ష సాయం చేసిన మంత్రి సుభాష్

image

మామిడికుదురు మండలం కొమరాడ గ్రామానికి చెందిన పెచ్చేట్టి సుబ్బయ్య కరోనా సమయంలో మరణించారు. ఈ మేరకు బాధిత కుటుంబీకులకు రూ.లక్ష నగదును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం అందజేశారు. అదేగ్రామానికి చెందిన కొర్లపాటి శ్రీరాములు డయాలసిస్‌తో బాధపడుతుండగా రూ.20 వేల సాయం అందించారు.

News July 29, 2024

జగ్గంపేట: విద్యుత్ షాక్.. గృహిణి మృతి

image

కాకినాడ జిల్లా జగ్గంపేటలోని నెహ్రూ కాలనీకి చెందిన కింతాడ మంగా (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఆమె తన ఇంటి వద్ద నీళ్లు పట్టేందుకు మోటార్ స్విచ్ వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. ఈ ఘటనపై జగ్గంపేట ఏఎస్ఐ నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా భార్య మృతదేహంపై భర్త పడి ఏడ్చిన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.