EastGodavari

News April 24, 2024

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అప్పులెన్నో తెలుసా..?

image

☞ అభ్యర్థి: వంగా గీత (వైసీపీ)
☞ విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్, ఎం.ఎల్
☞ కేసులు: ఏమీ లేవు
☞ చరాస్తులు: రూ.2.10 కోట్లు, భర్త పేరు మీద రూ.27.81 లక్షలు
☞స్థిరాస్తులు: రూ.13.11 కోట్లు, భర్త పేరు మీద రూ.13.64 కోట్లు
☞ అప్పులు: రూ.4.51 కోట్లు, భర్త పేరు మీద రూ.51.64 లక్షలు

News April 24, 2024

కాకినాడ: మహిళను ఢీకొట్టిన కాలేజ్ బస్సు.. మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్‌లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్‌లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 24, 2024

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన జాన్ వెస్లీ 

image

తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఉభయగోదావరి జిల్లాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ జోనల్ ఇన్‌ఛార్జి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జాన్ వెస్లీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో రేపు ఎన్నికల్లో వైసీపీ జెండా మరోసారి ఎగిరేందుకు, సీఎం జగన్‌ను రెండోసారి గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

News April 24, 2024

పి.గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టిబాబు

image

పి.గన్నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ఖరారు చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన చిట్టిబాబుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి MLA అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

News April 24, 2024

10Th రిజల్ట్స్.. ఉమ్మడి తూ.గో.లో ఉత్తీర్ణత శాతమిలా

image

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది.
➠ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023లో 73.48% పాస్ కాగా.. 2024లో ఏకంగా 91.88శాతానికి ఎగబాకింది.
➠ కాకినాడ జిల్లాలో గతేడాది 68.02% మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 83.09% మంది పాసయ్యారు.
➠ తూ.గో జిల్లాలో గతేడాది 70.32% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 82.03శాతానికి చేరింది.

News April 24, 2024

‘పది’ ఫలితాల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా 4వ స్థానం

image

☞ ‘పది’లో 91.88 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే 4న స్థానంలో నిలిచింది. 18,787 మంది పరీక్షలు రాయగా.. 17,262 (BOYS-8,551, GIRLS-8,711) మంది పాసయ్యారు.
☞ తూ.గో: 23,367 మందికి గానూ 19,414 (BOYS-9,648, GIRLS-9,793) మంది ఉత్తీర్ణులయ్యారు. 83.2శాతంతో 21వ స్థానం.
☞ కాకినాడ: 27,671 మంది పరీక్షలు రాయగా.. 22,993 (BOYS-10,958, GIRLS-12,035) మంది పాసయ్యారు. 83.09శాతంతో 22వ స్థానంలో ఉంది.

News April 22, 2024

తీవ్ర ఉత్కంఠ.. తూ.గో జిల్లాలో 30,116 మంది

image

‘పది’ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
☞ తూ.గో జిల్లాలో 137 కేంద్రాల్లో 30,116 మంది పరీక్షలు రాశారు. కాగా.. గతేడాది ఈ జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది.
☞ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 21,113 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఈ జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
☞ కాకినాడ జిల్లాలో 27,712 మంది పరీక్షలు రాయగా.. గతేడాది ఈ జిల్లా 19వ స్థానంలో నిలిచింది.

News April 22, 2024

తూ.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే

image

☞ రాజమండ్రి ఎంపీ అభ్యర్థులు రుద్రరాజు(కాంగ్రెస్), గూడూరి శ్రీనివాస్ (YCP)
☞ వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట-TDP)
☞ విశ్వరూప్ (అమలాపురం-YCP)
☞ సూర్యారావు (రాజోలు-YCP)
☞ చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట-YCP)
☞ ద్వారంపూడి (కాకినాడ సిటీ- YCP)
☞ ధనలక్ష్మి (రంపచోడవరం- YCP)
☞ చినరాజప్ప (పెద్దాపురం- TDP)
☞ విప్పర్తి వేణుగోపాలరావు (పి.గన్నవరం-YCP)
☞ కన్నబాబు (కాకినాడ రూరల్-YCP)
☞ వంగా గీత (పిఠాపురం-YCP)

News April 22, 2024

పగో: నేడే ఫలితాలు.. ఉత్కంఠతో 27,426 మంది

image

ప.గో జిల్లాలో 27,426 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా.. వారందరూ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 14,624 మంది బాలురు, 12,802 మంది బాలికలు కలిపి మొత్తం 27,426 మంది విద్యార్థులు 127 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు రాశారు. గతేడాది జిల్లాలో 65.93 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా యంత్రాంగం కసరత్తు చేసిందని అధికారులు తెలిపారు.

News April 22, 2024

పవన్ కళ్యాణ్ సభలో చాకుతో యువకుడు?

image

పవన్ భీమవరం సభలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం చౌక్‌లో పవన్ మాట్లాడుతుండగా.. ఇద్దరి కదిలికలపై అనుమానంతో పోలీసులు పట్టుకునేందుకు యత్నించారట. ఓ యువకుడు చాకుతో దాడికి దిగగా.. అతడిని, దుర్గాపురానికి చెందిన మరో యువకుడిని సైతం స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరు జేబు దొంగతనాలకు వచ్చారా..?, మరేదైనా కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.