EastGodavari

News July 29, 2024

తూ.గో: ఇదీ.. ‘డొక్కా సీతమ్మ’ గొప్పదనం

image

మధ్యాహ్న భోజన పథకానికి ‘డొక్కా సీతమ్మ’ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈమె భవానీశంకరం-నరసమ్మల(మండపేట) కూతురు. ఎందరో ఆకలి తీరుస్తున్న గొప్ప మనసు గల సీతమ్మను చూసి లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆమెను పెళ్లి చేసుకున్నారు. పిఠాపురం మహారాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి సీతమ్మ వద్ద భోజనం చేశారని, బ్రిటీష్ కింగ్ ఎడ్వర్డ్-7 పట్టాభిషేకానికి సీతమ్మ వెళ్లకపోతే ఆమె ఫొటో పెట్టి వేడుక చేశారని చెబుతుంటారు.

News July 29, 2024

సామర్లకోట మాజీ కౌన్సిలర్ ఆత్మహత్య

image

సామర్లకోట మాజీ కౌన్సిలర్ గోపీ దుర్గాభవాని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సామర్లకోట పాత తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రస్తుత 7వ వార్డుకు చెందిన గోపీ దుర్గాభవానీ(35) ఉరేసుకొని మృతి చెందారు. దంపతుల మధ్య గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 29, 2024

భర్త మోసం చేశాడని అత్తింటి ముందు నిరసన

image

తనతో అప్పులు చేయించి భర్త మోసం చేశాడంటూ విశాఖపట్నంకు చెందిన అచ్యుతాంబ ఆదివారం ఆరోపించారు. కాకినాడ అర్బన్ జగన్నాథపురం ముత్తానగర్‌లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. ముత్తానగర్‌కు చెందిన జయరాజు 2019లో తనను వివాహం చేసుకున్నారన్నారు. వ్యాపారం కోసం విశాఖలో పలువురి నుంచి రూ.28 లక్షలు తన ద్వారా అప్పుగా తీసుకున్నారని, 20 కాసుల బంగారం తాకట్టుపెట్టి రూ.10 లక్షలు ఇవ్వగా, తనను మోసం చేశాడని వాపోయారు.

News July 28, 2024

కోనసీమ: పడవ బోల్తాపడి గల్లంతైన వ్యక్తి ఇతడే

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఊడిమూడిలంక గ్రామంలో <<13725482>>పడవ బోల్తా<<>> పడిన ఘటనలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి ఊడుమూడి లంక గ్రామానికి చెందిన చదలవాడ విజయ్ కుమార్(38)గా స్థానికులు తెలిపారు. గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 28, 2024

నిఫా వైరస్.. కాకినాడలో ప్రత్యేక వార్డ్

image

కేరళలో నిఫా వైరస్‌ జాడలు వెలుగు చూడటంతో కాకినాడ జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కాకినాడ GGHలో నిఫా వైరస్‌ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. ఈఎన్‌టీ వార్డు భవనంలో 6 బెడ్‌లతో వార్డు సిద్ధం చేశారు. అనస్థీషియా, మైక్రోబయాలజీ, మెడిసిన్, ఫల్మనాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్యనిపుణులతో కమిటీని నియమించారు. మందులు, ఇతర వైద్య పరికరాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 28, 2024

పెద్దాపురం: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దాపురం జవహార్ నవోదయ విద్యాలయం (2025-2026)లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పెద్దాపురం విద్యాలయ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రామకృష్ణయ్య తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని 43 మండలాల నుంచి ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు అర్హులన్నారు. సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2025 జనవరి 18న పరీక్ష జరుగుతాయన్నారు.

News July 28, 2024

529 కుటుంబాలకు రూ.3వేల ఆర్థిక సహాయం: కలెక్టర్

image

గోదావరి వరదల వల్ల తూ.గో జిల్లాలో ముంపునకు గురైన 1,421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరకులు పంపిణీ చేస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. సరకులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అందజేస్తామన్నారు. జిల్లాలో 529 వరద బాధిత కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

News July 28, 2024

నేడు ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి అచ్చెన్న పర్యటన

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటిస్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మంత్రి పర్యటన మొదలవుతుందన్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, రామచంద్రపురం, కె.గంగవరం, సీతానగరం మండలాల్లోని గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. నష్టపోయిన పంటల వివరాలు, బాధితుల కష్టాలు తెలుసుకోనున్నారు.

News July 27, 2024

అల్లకల్లోలంగా సముద్రం.. చేపల వేట నిషేధం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని పెరుమల్లాపురం, కొత్త చోడిపల్లిపేటలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వారం రోజుల పాటు మత్స్యకారులు బోటుపై చేపల వేటను నిలిపివేశారు. వేట ఆగిపోవడంతో గంగపుత్రులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అనుకూల వాతావరణం వచ్చేవరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News July 27, 2024

రామసేతు శిలను సేకరించిన కోనసీమ జిల్లా వాసి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం అరుదైన రామసేతు శిలను సేకరించారు. రాములు ఇటీవల రామసేతు వారధిని సందర్శించగా..అక్కడి నుంచి శిలను సేకరించినట్లు తెలిపారు. ఈ రాయితోనే రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వానరులతో కలిసి వంతెన వంతెన నిర్మించారన్నారు. సుమారు 225 గ్రాముల బరువు ఉంటుందని, ఈ రాయి నీటిలో మునగదని ఆయన వివరించారు. చుట్టుపక్కల వారు ఆ శిలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.