India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి శాంతించింది. ప్రస్తుతం నీటి ప్రవాహం13.70 అడుగులకు ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాగా మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా నేడు, లేదా రేపటికి గోదావరి నది ప్రవాహం సాదారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పొగాకు అదనపు పంటపై జరిమానా మాఫీ చేయడం పట్ల ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
రంపచోడవరం, చింతూరు డివిజన్లో అన్ని పాఠశాలలకు గురువారం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ఏజెన్సీలో భారీ వర్షాలు ఇంకా కురుస్తున్నందున, వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బుధవారం ఆయన తెలిపారు. విద్యార్థులను బయటకు పంపకుండా ఇళ్ల వద్దే ఉంచాలని కోరారు. ప్రైవేట్ విద్యాలయాలు కూడా సెలవు పాటించాలని కోరారు.
దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10 లక్షలు కేటాయిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి తూ.గో జిల్లాలో విద్యార్థులకు ఊరట నిచ్చింది. కాకినాడ JNTU పరిధిలో 341 అనుబంధ కళాశాలలు, నన్నయ వర్సిటీ పరిధిలో 434 కళాశాలలు ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం హర్షనీయం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 385 వంతున, తూ.గో జిల్లాలో 300 పంచాయతీలు ఉన్నాయి. సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా వినియోగించాలి. పల్లెల్లోని పీఆర్, ఆ&బీ రహదారులకు మోక్షం దక్కాలి. రూ.1,203 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్, రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాలు చేపట్టాలి.
ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు ద్వారా ఎంతో మంది యువకులకు ఉపాధి లభిస్తుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,40,257 మందికి రూ.1,650.60 కోట్లు అందించారు. కాకినాడ జిల్లాలో 17,166 మందికి రూ. 282.51 కోట్లు.. కోనసీమ జిల్లాలో 24,371 మందికి రూ.229.84 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇకపై రూ.20 లక్షలు వరకు రుణం ఇస్తారు.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఊరట కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కాకినాడ, తూ.గో, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎడమ కాలువను రూ 4,202.69 కోట్లతో నిర్మించవలసి ఉంది. ఇంతవరకు 72.99 శాతం పనులయ్యాయి.
బడ్జెట్తో ఉమ్మడి తూ.గో జిల్లాలో 4.12 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి. విపత్తులు, వరదలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రత్యేక కేటాయింపులు, విపత్తులను తట్టుకునే వంగడాల రూపకల్పన దిశగా ఊతమిస్తుందని ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ ద్వారా తూ.గో జిల్లాలో 1.34లక్షల మందికి రూ.435.45 కోట్లు, కాకినాడ జిల్లాలో 1.57లక్షల మందికి రూ.186 కోట్లు, కోనసీమలో 1.49 లక్షల మందికి రూ.112 కోట్లు జమ చేశారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్తో ఉమ్మడి తూ.గో జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. బడ్జెట్పై పారిశ్రామిక రంగం ఉత్సాహంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 172 కర్మాగారాలు.. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా పరిశ్రమలు 8,861 ఉన్నాయి. కార్మికులు, ఉద్యోగులు 1.20 లక్షల మంది ఉన్నారు. పారిశ్రామిక పార్కుల్లో కాకినాడ, రాజమహేంద్రవరానికి చోటు దక్కితే కార్మికుల వసతి సమస్యకు పరిష్కారం దొరకనుంది.
కేంద్ర బడ్జెట్తో వేతన జీవులకు ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5శాతం, రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు 10%, రూ.10-12 లక్షల వరకు 15శాతం, 12-15 లక్షల వరకు 20శాతం, ఆ పైన 30% పన్ను ప్రకటించారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో కేంద్ర ఉద్యోగులు 5వేలు, రాష్ట్ర ఉద్యోగులు 65వేల మంది, పింఛన్ పొందే వారు 39వేల మంది ఉన్నారు. వీరిలో పలువురికి మేలు జరగనుంది.
Sorry, no posts matched your criteria.