EastGodavari

News July 24, 2024

ఆగస్టు 4లోగా ఫీజు చెల్లించాలి: జయశ్రీ

image

వచ్చేనెల 4వ తేదీలోగా డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ 2018–20 బ్యాచ్‌లో మేనేజ్‌మెంట్‌, స్పాట్‌ అడ్మిషన్లలో మొదటి సంవత్సరం ఒకసారి ఫెయిలైన అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తూ.గో జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్‌ జయశ్రీ తెలిపారు. పరీక్ష ఫీజును సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు డీఈఎల్‌ఈడీ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలన్నారు. వివరాలకు సంబంధిత ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.

News July 24, 2024

తూ.గో: వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

తూ.గో జిల్లా నిడదవోలులోని తీరుగూడెంలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసినట్లు ఎస్ఐ పులపా అప్పారావు తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఆంజనేయపురానికి చెందిన ఓ విటుడు, రాజమహేంద్రవరానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం: ఎంపీ ఉదయ్

image

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తికి నిధులు కల్పించడం సంతోషకరమన్నారు.

News July 23, 2024

కాకినాడ JNTU రిజిస్ట్రార్‌పై CID విచారణ చేయాలి: హైకోర్ట్

image

అర్హత లేని 48 ఇంజినీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంపై కాకినాడ JNTU రిజిస్ట్రార్‌పై CID విచారణ జరపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఈ మేరకు కేసు నమోదుచేసి ఈ నెల 26న FIR తమ ముందు ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. కేసుపై దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టగా.. ఇప్పటికే రిజిస్ట్రార్‌కు నోటీసులు ఇచ్చినా రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

News July 23, 2024

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం: ఎంపీ ఉదయ్

image

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తికి నిధులు కల్పించడం సంతోషకరమన్నారు.

News July 23, 2024

కోనసీమ: వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సెలవు

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరదలకు సంబంధించి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరద ప్రభావం లేని ప్రాంతాలలో విద్యాసంస్థలు యథావిధిగా నిర్వహించబడతాయన్నారు.

News July 23, 2024

కోనసీమ: 52 ఏళ్ల మహిళపై అత్యాచారయత్నం

image

మామిడికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(52)పై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు గెడ్డం సత్యనారాయణమూర్తిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని నగరం SI సురేష్ తెలిపారు. వరుసకి మరిది అయిన నిందితుడు బాధితురాలు వంట గదిలో ఒంటరిగా ఉండగా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నారు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయగా పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్ట్ చేశామన్నారు.

News July 23, 2024

కోనసీమ: పీత శరీరంపై నరసింహస్వామి ముఖ కవళికలు

image

సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామానికి చెందిన కాగితం కృష్ణ మంగళవారం పీతలు కొనుక్కొని ఇంటికెళ్లాడు. కాగా ఓ పీత శరీరంపై నరసింహ అవతారంలో ముఖం గుర్తులు కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం గ్రామస్థులకు తెలియడంతో పలువురు దానిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

News July 23, 2024

సఖినేటిపల్లిలో మునక్కాయ పొడవు 4 అడుగులు

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో రైతు చెల్లుబోయిన సత్యనారాయణ పెరట్లో మునగ చెట్టుకు కాచిన జంబో మునక్కాయ అబ్బుర పరుస్తోంది. హైబ్రిడ్ మొక్కకు కాచిన మునక్కాయ సుమారు 4 అడుగులు వరకు పెరగటం విశేషం. ఇంత పొడవు మునక్కాయ గతంలో ఎక్కడా చూడలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News July 23, 2024

తూ.గో జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని మంగళవారం అధికారులు తెలిపారు. గోకవరంలో అత్యధికంగా 21.6 మిల్లీ మీటర్లు, ఉండ్రాజవరంలో 0.8mm అత్యల్ప వర్షపాతం నమోదయిందన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ లో 9.2, తాళ్లపూడి 9.0, బిక్కవోలు 7.6, కొవ్వూరు 6.0, కడియం 5.2, రాజానగరం 4.8, అనపర్తి 4.8, కోరుకొండ 4.4, రంగంపేట 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అని తెలిపారు.