EastGodavari

News July 23, 2024

గోదావరి వరదలపై కలెక్టర్ మండల అధికారులతో సమీక్ష

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News July 23, 2024

స్పెషల్ ఆఫీసర్ల నియామకం: కోనసీమ కలెక్టర్

image

కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వరద పెరుగుతున్న దృష్ట్యా కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో సహాయం నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ సమస్య ఉత్పన్నమైనా 08855-244299 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఆర్డీవో కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

News July 22, 2024

కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్‌ నుంచి సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వాగులు, చెరువుల వైపు వెళ్లనివ్వొద్దని కలెక్టర్ సూచించారు. SHARE IT..

News July 22, 2024

హృదయవిదారకరం.. డెడ్‌బాడీతో బైక్‌పై 5KM

image

రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం మిర్యాలవీధికి చెందిన అన్నపూర్ణ అనారోగ్యంతో జడ్డంగి PHCలో సోమవారం మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. ఆమె కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో గ్రామ యువకులు డెడ్‌బాడీని బైక్‌పై 5కిమీ దూరంలో ఉన్న స్వగ్రామానికి తీసుకెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన అన్నపూర్ణ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనాల వారు ముందుకు రాకపోవడంతో ఇలా చేసినట్లు యువకులు తెలిపారు.

News July 22, 2024

జగన్‌కు RRR రిక్వస్ట్

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను <<13680466>>అసెంబ్లీ<<>>లో పలకరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి రోజూ రావాలని జగన్‌ను కోరానని రఘురామ తెలిపారు. ప్రతిపక్షం సభలో లేకపోతే బాగుండదని చెప్పానన్నారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.

News July 22, 2024

ధవళేశ్వరం UPDATE.. 2వ ప్రమాదహెచ్చరికకు ఛాన్స్

image

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిందని డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం జిల్లా, మండల స్థాయి ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరదలపై సమీక్షించారు. భద్రాచలం నుంచి ధవలేశ్వరం బ్యారేజీకి భారీగా వరద వస్తుందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలన్నారు.

News July 22, 2024

తూ.గో.: వాగు దాటలేని పరిస్థితి.. వ్యక్తి మృతి

image

రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామానికి చెందిన కుంజం రాజులమ్మ(65)కు ఆదివారం రాత్రి 11 గంటలకు గుండెనొప్పితో బాధపడింది. కుటుంబీకులు రాజవొమ్మంగి PHCకి తీసుకెళ్దామంటే మార్గమధ్యలో వట్టిగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. కాసేపటికే రాజులమ్మ మృతి చెందింది. గత ఏడాది గ్రామానికి చెందిన కొంగర అప్పారావు కూడా ఈ విధంగానే మరణించారు. తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని సర్పంచ్ శుభలక్ష్మి కోరారు.

News July 22, 2024

కాకినాడ: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో గడ్డి మందు తాగిన వ్యక్తి మృతిచెందిన ఘటన కరప మండలంలో జరిగింది. SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని గొర్రిపూడి పీటీపుంతకు చెందిన శ్రీనివాస్ (50) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 15న మద్యం తాగి ఇంటికెళ్లగా భార్య పార్వతితో గొడవ అయింది. భార్యను బెదిరించేందుకు గడ్డిమందు తాగాడు. కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు.

News July 22, 2024

పవన్‌కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంచాలి: వర్మ

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంచాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కోరారు. పిఠాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర నిఘా సంస్థలు సైతం పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని సమాచారం ఇచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News July 22, 2024

కాకినాడ: రొయ్యల కూర వండలేదని సూసైడ్

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన గొల్లప్రోలులో జరిగింది. SI జాన్ బాషా తెలిపిన వివరాలు.. మండలకేంద్రంలోని ఎస్సీపేటకు చెందిన బుచ్చిరాజు(23) శనివారం ఉదయం భార్యతో పచ్చిరొయ్యల కూర వండమని చెప్పాడు. బయటకెళ్లి తిరిగొచ్చాక కోడిగుడ్ల కూర వండటంతో భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చి పురుగుమందు తాగాడు. కాకినాడ GGHకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.