EastGodavari

News April 17, 2024

తూ.గో.: పండగ పూట విషాదం.. దారుణ హత్య

image

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో సవుదాల వెర్రెమ్మ (55) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాదే రామకృష్ణ (38) అనే వ్యక్తి తన భార్యకు అమ్మమ్మ అయిన వెర్రెమ్మను బుధవారం గొంతు కోసి హత్యచేశాడు.  కుటుంబ కలహాలే కారణమని కొత్తపేట పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

తూ.గో.: అక్కడ 6 సార్లు కాంగ్రెస్.. 5 సార్లు TDP మరి ఈ సారి..?

image

కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, జనసేన, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కోసారి విజయం సాధించాయి. ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య పోటీ జరుగుతుంది. 1962, 67, 78, 89, 2004, 2009లో కాంగ్రెస్, 1983, 85, 94, 99, 2014లో TDP, 1955లో సీపీఐ, 1972లో ఇండిపెండెంట్, 2019లో జనసేన విజయం సాధించాయి. మరి ఈసారి విజయం ఎవరిదో చూడాలి.

News April 17, 2024

కాకినాడ: వరుపుల V/S వరుపుల

image

ప్రత్తిపాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీచేస్తున్న వైసీపీ, TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థుల ఇంటిపేర్లు ఒకటే కావడం గమనార్హం. YCP నుంచి వరుపుల సుబ్బారావు బరిలో నిలవగా..కూటమి నుంచి వరుపుల సత్యప్రభ ఉన్నారు. 1985, 1989, 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సుబ్బారావు 3 సార్లు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004లో గెలుపొందారు. 2009 ఓడి, 2014లో గెలిచారు. 2019లో పోటీలో లేరు. తాజాగా మరోసారి బరిలో నిలిచారు.

News April 17, 2024

కాకినాడ: దేశంలోనే రాత్రిపూట పెళ్లి జరిగే ఏకైక ఆలయం ఇదే..

image

సీతారాముల కళ్యాణాన్ని నేటి రాత్రి జరిపించేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏర్పాట్లుచేశారు. రాత్రి 9 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకట దివాకర్, ఈవో అశ్విని తెలిపారు. దేశంలో రాత్రిపూట కళ్యాణం జరిగే ఏకైక ఆలయం కావడం విశేషం. పూర్వం పిఠాపురం మహారాజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తిలకించి, చేబ్రోలు వచ్చేసరికి రాత్రి అయ్యేదట. అప్పటినుంచి రాత్రి జరిపించడం ఆనవాయితీగా మారింది.

News April 17, 2024

తూ.గో.: సీతారాముల కళ్యాణానికి 24 ఏళ్లుగా..

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.

News April 17, 2024

తూ.గో.: సీతారాముల కళ్యాణానికి 24 ఏళ్లుగా..

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.

News April 17, 2024

కాకినాడ: అచ్చంపేటలో 19న మేమంతా సిద్ధం సభ

image

కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం పరిధిలోని అచ్చంపేటలో ఈ నెల 19వ తేదీన సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం సభ జరగనుంది. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, ర్యాంపు ఏర్పాటు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, తదితరులు ఉన్నారు.

News April 17, 2024

కాకినాడ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.. ఎవరికీ తెలియకుండా ఖననం

image

రౌతులపూడి మండలం గిడజాంకు చెందిన పూడి తాతాజీ తన కౌలు భూమిలో కొబ్బరి మొక్కలు వేసి రక్షణకు విద్యుత్ తీగలు అమర్చాడు. సోమవారం అదే గ్రామానికి చెందిన సత్తిబాబు(42) గేదెలు మేపేందుకని వెళ్లి ఆ తీగలు తగిలి చనిపోయాడు. తాతాజీ భయంతో మృతదేహాన్ని ఖననం చేశాడు. రాత్రయినా సత్తిబాబు ఇంటికి రావట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారు రంగంలోకి దిగి తాతాజీని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. కేసు నమోదైంది.

News April 16, 2024

వాహన తనిఖీలు.. రూ.6 లక్షలు సీజ్: ఆర్డీవో

image

పెద్దాపురం మెయిన్ రోడ్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.6 లక్షల నగదు పట్టుబడినట్లు ఆర్డీవో సీతారామారావు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకట రాజగుప్తా పెద్దాపురం మెయిన్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. కాండ్రకోటకు చెందిన పల్లికల శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి వద్ద ఎటువంటి పత్రాలు లేకుండా రూ.6లక్షల నగదు పట్టుబడిందని అన్నారు.

News April 16, 2024

కాకినాడ: విషాదం.. కానిస్టేబుల్ మృతి

image

తూ.గో. జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మిరియాల పెంటారావు (42) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కాకినాడ ఏపీఎస్పీలో పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉంటున్నారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో కాకినాడ GGHకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.