India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈనెల 12 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ డీవీఎస్ ఏల్లారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారన్నారు. రైతులకు చెల్లించే ధాన్యం సొమ్ముల బకాయిలను విడుదల చేస్తారన్నారు.
17 మంది తహశీల్దార్లకు పోస్టింగ్స్ ఇస్తూ తూ.గో కలెక్టర్ ప్రశాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణి (బిక్కవోలు), సుస్వాగతం (కోరుకొండ), సుజాత (రాజమండ్రి రూరల్), సరస్వతి (గోకవరం), పోసిబాబు (కడియం), రమేష్ (రాజమండ్రి అర్బన్), మేరీకమ్మ (చాగల్లు), నాగరాజు నాయక్ (నిడదవోలు), అచ్యుత కుమారి (పెరవలి), రవీంద్రనాథ్ (తాళ్లపూడి), కనకరాజు (కొవ్వూరు), ప్రసాద్ (ఉండ్రాజవరం), ఐదుగురికి ప్లేసులు కేటాయించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ ప్రజలను కోరారు. పరిశ్రమలు, స్కూల్స్, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ గంజాయి బ్యాచ్లు కనిపించినా తమకు సమాచారం చేరవేయాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని, రూ.5 వేల రివార్డు అందజేస్తామని అన్నారు.
రాజమండ్రిలోని ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఎన్నికలలో కూటమి అభ్యర్థులు గెలిచి బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఎన్నికల వ్యయానికి సంబంధించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఖర్చును రూ.80 లక్షలకు పైగా చూపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుమారు రూ.40-రూ.45 లక్షలు కూడా ఖర్చు అవ్వదనే మాట గట్టిగా వినిపిస్తోంది. అవి పలు అనుమానాలుకు దారి తీస్తున్నాయి.
ప్రత్తిపాడు మండలం లంపకలోవ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీలో అంతా మహిళా సభ్యులే ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ ఆదేశాలతో గురువారం
జరిగిన పాఠశాల విద్యా కమిటీ సమావేశంలో పూర్తి స్థాయి మహిళా సభ్యులే ఉండే విధంగా కమిటీని ఎన్నుకున్నారు. విద్యా కమిటీ ఛైర్పర్సన్గా మువ్వల గంగా భవాని, వైస్ ఛైర్ పర్సన్గా కుక్కల దుర్గా భవానితో పాటు మరో 13 మంది మహిళలు ఎన్నికయ్యారు.
అమలాపురం నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు మంత్రి నారా లోకేశను కోరారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ను రాష్ట్ర సచివాలయంలో ఆయన కలిసి పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన మంత్రి నారా లోకేశ్కు పలు విషయాలను తెలియజేశారు.
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు, బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల దళిత మోర్చా ఇన్ఛార్జ్ కొల్లి సూర్యారావు గురువారం అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు దొరబాబు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు, బీజేపీ మహిళా నాయకురాలు చిట్టూరి రాజేశ్వరి సంతాపం తెలిపారు.
అన్నవరం దేవస్థానం అనివేటి మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం పనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పనులు నెల్లూరుకు చెందిన దాత సహకారంతో చేపడుతున్నారు. రాగి రేకుకు బంగారు తాపడం చేసి ధ్వజస్తంభానికి అమర్చనున్నారు. సుమారు 300 కిలోల రాగిపై 1,800 గ్రాముల బంగారంతో పనులు చేపట్టారు.
తూ.గో. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 77,817 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. 64,550 హెక్టార్లలో నాట్లు పూర్తి అయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అధిక వర్షాలు, వరదల వల్ల పలుచోట్ల నాట్లు దెబ్బతిన్నాయి. 117 గ్రామాల్లో 4,496 మంది రైతులకు చెందిన 14,599 హెక్టార్లలో నాట్లు మునిగిపోయాయని అధికారుల నిర్ధారించారు. నిడదవోలు మండలంలో అత్యధికంగా 600 ఎకరాల్లో తిరిగి నాట్లు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం 4,64,386 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద బుధవారం సాయంత్రానికి 7.60 అడుగులకు నీటిమట్టం కొనసాగుతున్నట్లు వివరించారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీరు విడుదల చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.