EastGodavari

News July 22, 2024

అధికారులు సంసిద్ధంగా ఉండాలి: కోనసీమ కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉద్ధృతి పెరగడం, 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం నేపథ్యంలో ప్రజలకు సమర్థవంతంగా సహాయక చర్యలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సూచనలు చేశారు. నేడు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రోగ్రాం ఉంటుందన్నారు.

News July 21, 2024

తూ.గో: మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

image

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజ్ నుంచి 7.72 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద 42.50 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరిందని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

వరదలు.. గోదావరిపై పడవల్లో రాకపోకలు నిషేధం

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరదలు పెరగడంతో సఖినేటిపల్లి – నరసాపురం మధ్య గోదావరి నదిపై పంటు, నాటుపడవలపై రాకపోకలు నిలిపివేసినట్లు‌ అధికారులు ఆదివారం ఓ‌ ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ముందస్తు జాగ్రత్తగా గోదావరిపై రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. SHARE IT..

News July 21, 2024

తూ.గో.: వరదలు.. మొదటి ప్రమాద హెచ్చరికకు అవకాశం

image

భద్రాచలం వద్ద గోదావరి వరద ఆదివారం 38.02 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గోదావరిలో కలుస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ రాత్రికి భద్రాచలం వద్ద వరద 43 అడుగులు దాటవచ్చని CWC అధికారులు అంచనా వేశారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందన్నారు.

News July 21, 2024

కోనసీమ: బాలికపై లైంగిక దాడి

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఓ యువకుడిపై కేసు నమోదుచేసినట్లు SI రాజేశ్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాలు.. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన యువకుడు వెంకటరమణ మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి కొంతకాలం క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల బాలికను విలస గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటినుంచి శారీరకంగా, మానసికంగా వేధించడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుచేసిందన్నారు.

News July 20, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాకు కొత్త JCల నియామకం

image

ఏపీలో 62 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హిమాన్షు కౌశిక్ రానున్నారు. అంబేడ్కర్ కోనసీమ జాయింట్ కలెక్టర్‌గా నిశాంతి నియమితులు కాగా.. ప్రస్తుతం అక్కడ జేసీగా ఉన్న నుపూర్ అజయ్ బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ఆర్.గోవిందరావు బదిలీపై రానున్నారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్ నియమితులయ్యారు.

News July 20, 2024

కోనసీమ: తండ్రిని కొట్టాడని ఫ్రెండ్స్‌తో కలిసి చంపేశాడు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నరేశ్(38)కు మతిస్థిమితం లేదు. తరచూ గొడవ పడుతుంటాడు. ఇంటి వెనుక ఉండే అప్పారావును గతంలో కొట్టగా.. అతడి కొడుకు పోతురాజు నరేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 15న పోతురాజు అతడి ఫ్రెండ్స్ రాజు, కె.రాంబాబు, శ్రీను, డి.రాంబాబుతో కలిసి దాడి చేయగా నరేశ్ మృతి చెందాడు.

News July 20, 2024

తూ.గో జిల్లాలో TOP NEWS@ 6PM

image

☞ కడియంలో మహిళతో అసభ్యప్రవర్తన.. అరెస్ట్
☞ పిఠాపురంలో దాడిపై జగన్ స్పందించరా?: వర్మ
☞ 45 గ్రామాలు మునిగే ఛాన్స్: కోనసీమ కలెక్టర్
☞ ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
☞ తూ.గో జిల్లాలో తీర ప్రాంతాల్లో అలల అలజడి
☞ 10వేల హెక్టార్లలో పంట నష్టం: తూ.గో కలెక్టర్
☞ నిండుకుండలా డొంకరాయి జలాశయం
☞ జాబ్ మేళాతో యువతకు ఉపాధి: మంత్రి సుభాశ్
☞ వైసీపీ నేతలపై దాడులు ఆపాలి: జక్కంపూడి

News July 20, 2024

తూ.గో: వివాహితతో అసభ్యప్రవర్తన.. ఆమె భర్తపై దాడి

image

తూ.గో జిల్లా కడియంలో ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI తులసీధర్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కడియంకు చెందిన చల్లా కొండరాజు అదే ఏరియాకు చెందిన వివాహితతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె భర్తపై దాడి చేశాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు SI నాగ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి కొండరాజును అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించింది.

News July 20, 2024

తూ.గో.: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారుల తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి తూ.గో. జిల్లాలోని పెద్దాపురంలో మాత్రమే నవోదయ విద్యాలయం ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.