EastGodavari

News April 16, 2024

తూ.గో.: తుప్పల్లో పసికందు.. సంచలన విషయాలు

image

కడియం మండలం వేమగిరికి చెందిన ఓ మహిళ తన బిడ్డను <<13061116>>తుప్పల్లో<<>> పడేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రాగా.. తనకు తానే పురుడు పోసుకుంది. కత్తిపీటతో పేగు తెంచుకొంది. 4వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని పాపను 20అడుగుల ఎత్తునుంచి తుప్పల్లోకి విసిరింది. కాగా తప్పు తెలుసుకొని తిరిగి అక్కున చేర్చుకుంది. రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

News April 16, 2024

తూ.గో.: 14 వరకు నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

image

సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని FDO రామకృష్ణ తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం, బలుసుతిప్ప గ్రామాల్లో 683 బోట్లు, కొత్తపాలెం పరిధిలో 309 బోట్లు ఉన్నాయన్నారు. జూన్ 14 వరకు వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 16, 2024

మన తూర్పుగోదావరిలోకి నేడు CM జగన్ ENTRY

image

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం బస్సు యాత్ర మంగళవారం తూ.గో.జిల్లాలో ప్రవేశించనుంది. జిల్లాలోని సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన లేఔట్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో రాత్రి బసచేస్తారు. 17న శ్రీరామనవమి నేపథ్యంలో ప్రచారానికి విరామం ప్రకటించారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకుంటారు.

News April 16, 2024

తూ.గో: మళ్లీ అమ్మాయే పుట్టిందని తుప్పల్లో పడేశారు

image

మగ సంతానమే కావాలనే ఆలోచనతో ఓ తల్లి మానవత్వం లేకుండా అప్పుడే పుట్టిన పాపను తుప్పల్లో పడేసింది. ఈ ఘటన తూ.గో జిల్లా కడియం మండలం వేమగిరిలో జరిగింది. తాపీ పనులు చేసుకునే ఓ కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగ సంతానం కావాలనే ఆలోచనతో ఉన్న మహిళ కు.ని ఆపరేషన్ చేయించుకున్నట్లు ఇంట్లో నమ్మించింది. మరోసారి గర్భం దాల్చిన ఆమె ఆదివారం ప్రసవించింది. ఆడపిల్ల పుట్టడంతో తుప్పల్లోకి విసిరేసింది.

News April 16, 2024

తూ.గో.: YCP MLA అభ్యర్థి సమక్షంలో 900 వాలంటీర్లు రాజీనామా

image

మండపేటలో YCP MLA అభ్యర్థి తోట త్రిమూర్తులు వాలంటీర్లతో సమావేశం నిర్వహించగా నియోజకవర్గంలోని దాదాపు 1200 మంది హాజరయ్యారు. ‘వాలంటీర్లంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వైసీపీ ప్రచారంలో పాల్గొనండి. మళ్లీ వచ్చేది వైసీపీనే..అందరినీ విధుల్లోకి తీసుకుంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. రాజీనామా చేసేందుకు గేటువద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశారు. 900మందికిపైగా రాజీనామా చేసినట్లు సమాచారం. అనంతరం పట్టణంలో ర్యాలీ తీశారు.

News April 16, 2024

ఉమ్మడి తూ.గో ఓటర్ల తీర్పు ఏంటో..?

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే నానుడి ఉంది. 2009లో కాంగ్రెస్-11, పీఆర్‌పి- 4, టీడీపీ-4 చోట్ల విజయం సాధించాయి. 2014లో టీడీపీ-13, వైసీపీ-5, ఇండిపెండెంట్-1 గెలిచాయి. 2019లో వైసీపీ-14, టీడీపీ-4, జనసేన-1 సీటు గెలిచాయి. మరి 2024లో ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందో కామెంట్ చేయండి.

News April 15, 2024

ఆటోలోంచి తల బయటకుపెట్టిన మహిళ.. మృతి

image

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో విషాదం నెలకొంది. దిబ్బలపాలెంకు చెందిన లోవదుర్గ ఈ రోజు తెల్లవారుజామున వాడపల్లి వెంకన్నబాబు దర్శనం నిమిత్తం అదే వీధికి చెందిన మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆటోలో బయలుదేరింది. ఎర్రవరం హైవేపై గల వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ వద్దకు ఆ ఆటో వెళ్లగా.. లోవదుర్గకు వాంతులు రావడంతో తల బయటకు పెట్టింది. ఆ సమయంలో వాహనం ఆమె తలను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది.

News April 15, 2024

మండపేటలో 1000 మందికి పైగా వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మండపేట నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధించిందన్నారు.

News April 15, 2024

జగన్‌ను హత్య చేసేందుకే రాళ్ల దాడి: మిధున్ రెడ్డి

image

దాడులు చేస్తే ఉన్నత పదవులిస్తామని నారా లోకేష్ ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మలికిపురం సభలో ఆయన మాట్లాడుతూ.. TDPది హింసాత్మక ధోరణి అని అన్నారు. జగన్ సభలకు జనం పోటెత్తుతున్నారని, ఇరుకు సందులో పెట్టినా చంద్రబాబు సభలకు జనం రావటం లేదన్నారు. CM జగన్‌ను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాళ్ల దాడి జరిగిందని ముధున్ రెడ్డి ఆరోపించారు.

News April 15, 2024

అత్యాచారయత్నం.. మర్మాంగం కోసేసిన మహిళ

image

అత్యాచారం చేయబోయిన ఓ వ్యక్తిపై తిరగబడిన మహిళ అతడి మర్మాంగం కోసేసింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరంలో ఆదివారం రాత్రి జరిగింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారం చేయబోయిన అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ
మర్మాంగాన్ని మహిళ బ్లేడుతో కోసింది. ఈ ఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. సత్యనారాయణ అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు విచారణ చేపట్టారు.